-
మూడో బిడ్డకు తండ్రైన పంజాబ్ సీఎం.. కుమార్తె ఫోటో షేర్ చేసిన భగవంత్ మాన్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భార్య.. డాక్టర్ ''గురుప్రీత్ కౌర్'' గురువారం మొహాలీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భగవంత్ స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. దేవుడు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటూ.. బిడ్డ ఫోటో కూడా షేర్ చేశారు. లూథియానాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్కు ప్రసవం జరిగినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు భగవంత్ మాన్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో పదవిలో ఉన్నప్పుడు తండ్రి అయిన మొదటి వ్యక్తి భగవంత్ సింగ్ మాన్. ఈయన 2022 జులైలో గురుప్రీత్ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఇంద్రప్రీత్ కౌర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2015లో విడిపోయారు. భగవంత్ సింగ్ మాన్, ఇంద్రప్రీత్ కౌర్ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇప్పుడు రెండో భార్య పాపకు జన్మనివ్వడంతో మూడోసారి తండ్రయ్యారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో భగవంత్ మాన్ తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు తన కుమార్తె ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. Blessed with baby Girl.. pic.twitter.com/adzmlIxEbb — Bhagwant Mann (@BhagwantMann) March 28, 2024 -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!
సింగర్, బిగ్బాస్-14 కంటెస్టెంట్ రాహుల్ వైద్య, బుల్లితెర నటి దిశా పర్మార్ తల్లిదండ్రులయ్యారు. ఈ జంట గతంలో చాలా సార్లు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం దిశా పర్మార్ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బేబీ, తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా మా ఇంటికి బిడ్డ రావడం సంతోషంగా ఉందని అన్నారు. (ఇది చదవండి: ముగిసిన మీరా అంత్యక్రియలు.. బోరున విలపించిన విజయ్ దంపతులు!) ఇన్స్టాలో రాస్తూ..'మా ఇంటికి లక్ష్మీ తల్లి వచ్చింది. మమ్మల్ని ఆ దేవుడు ఆడబిడ్డతో ఆశీర్వదించాడు. మమ్మీ, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు అండగా నిలిచిన వైద్యులకు మా కృతజ్ఞతలు. మాకు ఉత్తమమైన సేవలు అందించినందుకు మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంతోషకరమైన సమయంలో మా పాపను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఏనుగు బొమ్మతో ఉన్న కార్టూన్ ఫోటోను షేర్ చేశారు. గణేశ్ చతుర్థి సందర్భంగా పాప పుట్టడంతో అలా ఆనందాన్ని పంచుకున్నారు. మీ ఇంటికి గణేష్తో పాటు మీరు లక్ష్మీ దేవిని కూడా స్వాగతించారు అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. కాగా.. టీవీ రియాలిటీ షో బిగ్ బాస్- 14లో 2020లో ఆమె పుట్టినరోజు సందర్భంగా దిశాకు రాహుల్ ప్రపోజ్ చేశాడు.రాహుల్ వైద్య, దిశా పర్మార్ జూలై 16, 2021న ముంబైలో వివాహం చేసుకున్నారు. సింగింగ్ రియాలిటీ షో అయిన ఇండియన్ ఐడల్ మొదటి సీజన్లో రాహుల్ కనిపించారు. అతను కేహ్ దో నా, తేరా ఇంతేజార్, యాద్ తేరీ వంటి పాటలు పాడారు. అంతే కాకుండా ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్- 11లో కూడా పాల్గొన్నాడు. దిశా పర్మార్ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించి.. ఆ తర్వాత టీవీ షో ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారాలో నకుల్ మెహతా సరసన నటించింది. దిశా వో అప్నా సా షోలో కూడా కనిపించింది. ఆమె నటించిన బడే అచ్చే లాగ్తే హై- 2తో ఫేమ్ తెచ్చుకుంది. (ఇది చదవండి: నోరుజారిన డాక్టర్బాబు.. రెచ్చిపోయి ఛాలెంజ్ చేసిన శోభా) View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
అమ్మ ప్రెగ్నెంట్ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి
తన తల్లి కారణంగా మలయాళ నటి ఆర్య పార్వతి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. 47 ఏళ్ల వయసులో ఆమె తల్లి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. అంతేకాదు తాను అక్కను అయ్యానంటూ తన బుల్లి చెల్లి ఫొటో షేర్ చేస్తూ మురిసిపోయింది. అయితే లేటు వయసులో తన తల్లి బిడ్డకు జన్మనివ్వడంపై తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆర్య పార్వతి స్పందించింది. ఇది వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా.. అందులో సిగ్గుపడాల్సింది ఏముందని అభిప్రాయపడింది. చదవండి: రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా అమ్మ ప్రెగ్నెన్సీ విషయం మా నాన్న ద్వారా తెలిసింది. అప్పటికే ఆమె 8నెలల గర్భవతి. ఆ సమయంలో ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. అవును.. 23 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల నుంచి ఇలాంటి వార్త వినాల్సి రావడంతో.. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. షాక్ అయ్యాను అనేకంటే ఆశ్చర్యపోయాను అని చెప్పాలి. 47 ఏళ్ల వయసులో తల్లి గర్భవతి అయ్యిందంటే అది ఇబ్బంది పెట్టే విషయమే అని తెలుసు. కానీ, నాకు తెలిసే సమయానికి అమ్మ 8 నెలల గర్భవతిగా ఉంది. తనకే ఈ విషయం 7వ నెలలో తెలిసింది’ అంటూ ఆర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం, పాపులర్ నటుడు కన్నుమూత ‘అయితే నాతో ఈ విషయం చెప్పేందుకు అమ్మ-నాన్న ఇబ్బంది పడ్డారట. ఇది చెప్పగానే నేను ఎలా రియాక్ట్ అవుతానోనని భయపడ్డారట. అందుకే కొంతకాలం ఈ విషయాన్ని నా దగ్గర దాచారు’ అని పేర్కొంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నాన్న ఈ విషయం చెప్పిన తర్వాత తాను వెళ్లి తన అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చానని చెప్పింది. ‘నిజానికి నేను ఎంతోకాలం దీనికోసమే ఎదురు చూశాను. నేనెందుకు సిగ్గుపడతాను’ అని అమ్మతో చెప్పానని ఆర్య పార్వతి చెప్పుకొచ్చింది. కాగా సోషల్ మీడియాలో ఆమె ఈ గుడ్న్యూస్ షేర్ చేయడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. -
47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి
ఇండస్ట్రీలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో ఓ కల్పిత కథ.. నిజ జీవితంలో చోటు చేసుకుంది. ప్రముఖ సీరియన్ నటి, బుల్లితెర హీరోయిన్ తల్లి 23 ఏళ్ల తర్వాత గర్భవతి అయి ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఈ వార్త ఇండస్ట్రలో, సోషల్ మీడియాలో హాట్టాపిక్గా నిలిచింది. వివరాలు.. కేరళకు చెందిన 23 ఏళ్ల ఆర్య పార్వతి మలయాళంలో పాపులర్ నటి. ఆమె పలు టీవీ సీరియల్స్లో లీడ్ రోల్స్ చేస్తూ బుల్లితెర హీరోయిన్గా ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది. చదవండి: కృష్ణవంశీకి పిచ్చా.. ఈమె హీరోయిన్ ఏంటీ? అని హేళన చేశారు: నటి సంగీత ‘చెంబట్టు’ ‘ఇలయవళ్ గాయత్రి’ వంటి సీరియల్స్ ఆమె గుర్తింపు పొందింది. ఆమె నటి మాత్రమే కాదు క్లాసికల్ డ్యాన్సర్ కూడా. నటిగా, డ్యాన్సర్గా ఆమె ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో గతంలో తన తల్లి గర్భవతి అయినట్లు ప్రకటించి షాకిచ్చింది. 47 ఏళ్ల ఆమె తల్లి 23 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యిందని తెలిసి అంతా అవాక్కాయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మననిచ్చింది. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఈ విషయాన్ని నటి ఆర్య పార్వతి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు తన బుల్లి చెల్లి ఫొటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ మురిసిపోతుంది. కాగా అచ్చం ఇలాంటి సంఘటన ఆధారంగా ఇటీవల తమిళంలో ఓ సినిమా తెరకెక్కింది. ఆర్జే బాలాజీ లీడ్ రోల్లో ‘వీట్ల విశేషం’ అనే సినిమా వచ్చింది. ఇందులో సత్యరాజ్, ఊర్వశీలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో హీరో తల్లిగా కనిపించిన ఊర్వశీ మధ్య వయసులో తల్లవుతుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే నిజ జీవితంలో జరగడం గమనార్హం. View this post on Instagram A post shared by 𝗔𝗿𝘆𝗮 𝗣𝗮𝗿𝘃𝗮𝘁𝗵𝗶 (@arya_parvathi) View this post on Instagram A post shared by 𝗔𝗿𝘆𝗮 𝗣𝗮𝗿𝘃𝗮𝘁𝗵𝗶 (@arya_parvathi) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య
ప్రముఖ నటుడు, డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తండ్రి అయ్యాడు. నేడు(బుధవారం) ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రయిన ఆనంద క్షణాలను సోషల్ మీడియా వేదికగా ఆయన స్వయంగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా కూతురికి హోప్ ఎలిజబెత్ బాసిల్ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. బిడ్డను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేస్తూ తాను తండ్రి అయినట్లు ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. చదవండి: వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్పై క్లారిటీ వచ్చేసింది? దీంతో ఆయనకు మలయాళ సినీ ప్రముఖులు, నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. దుల్కర్ సల్మన్, నజ్రియా ఫాహద్, టోనివో థామస్, ఐశ్వర్యా లక్ష్మీ, సంయుక్త, రాజీషా విజయన్ లాంటి స్టార్లు జోసెఫ్ దంపతులకు విషెష్ తెలిపారు. కాగా బాసిల్ జోసెఫ్ తెలుగు సినీ ప్రియులకు సైతం సుపరిచితమే. ఇటీవల ఆయన నటించిన జయ జయ జయ హే చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. చదవండి: వరుస ఫ్లాప్లు.. అలా చేస్తేనే పూజాకు ఆఫర్స్ ఇస్తామంటున్నారట? ఇందులో ఆయన భార్యను వేధించే భర్తగా కనిపించాడు. అంతేకాదు మలయాళంలో ఆయన వినూత్న కథా చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. కుంజీరమాయనమ్, గోధా వంటి చిత్రాలతో ఆయన మాలీవుడ్లో పాపులర్ అయ్యాడు. మిన్నల్ మెరళి చిత్రం ద్వారా డైరెక్టర్గా మారి తొలి చిత్రానికే దర్శకుడిగా పలు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యాడు. దీంతో ఆయన పేరు జాతీయ వ్యాప్తంగా మారుమోగింది. ఈ చిత్రం తెలుగులోనూ డబ్ అయిన సంగతి తెలిసిందే. Thrilled to announce the arrival of our little bundle of joy, HOPE ELIZABETH BASIL ! She has already stolen our hearts and we are over the moon with love for our precious daughter.We can't wait to watch her grow and learn from her every day pic.twitter.com/RpQoLaCdm0 — basil joseph (@basiljoseph25) February 15, 2023
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement