breaking news
ayesha khanna
-
నన్ను సర్జరీ చేయించుకోమన్నారు: ధురంధర్ నటి
స్టార్ నటులు రణ్వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ధురంధర్. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ.200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్లో మెరిసింది. శరారత్ అనే పాటలో స్టెప్పులేసింది. ఈ సినిమాలో భాగమవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతోంది.సర్జరీ చేయించుకోమని సలహాఅయితే కెరీర్ తొలినాళ్లలో తన లుక్పై చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడుతూ.. ఓ వ్యక్తి నా ముక్కును సరిచేయించుకోమన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నాకు నా ముక్కంటే చాలా ఇష్టం. దాన్ని సర్జరీ చేయించుకోమని చెప్పడానికి అతడెవరు? ఇలాంటి వాళ్లు లైఫ్లో ముందుకెళ్లరు.. కానీ పక్కవాళ్ల మీద పడి ఏడుస్తారు!ఫేమస్ డైరెక్టర్ మూవీఒకసారి ఓ హారర్ సినిమా ఆడిషన్కు వెళ్లాను. ఆయన ఫేమస్ డైరెక్టర్. ఆడిషన్ పూర్తయింది. అది వాళ్లకు నచ్చింది. కచ్చితంగా నన్నే సెలక్ట్ చేస్తారని అక్కడున్నవాళ్లు చెప్పారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే.. ఇది హారర్ సినిమా కాబట్టి సరిపోయింది. తెలుగులో సినిమాలుకానీ ఇలాంటి అవకాశాలు రావాలంటే నీ పళ్లవరస మార్చుకోవాలి అన్నారు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది అని ఆయేషా ఖాన్ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో ముఖచిత్రం, ఓం భీమ్ బుష్ సినిమాలు చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఐటం సాంగ్ చేసింది. జాట్లో కానిస్టేబుల్ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కిస్ కిస్కో ప్యార్ కరూ 2 మూవీ చేస్తోంది. హిందీ బిగ్బాస్ 17వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) -
రోడ్డుపై వెళ్తుంటే..బాబాయ్ లాంటివాడే అలా వేధించాడు: హీరోయిన్
సామాన్యులకే కాదు సెలెబ్రెటీలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురైనవారే ఉన్నారు. కొంతమందికి ఇండస్ట్రీ నుంచి ఎదురైతే..మరికొంతమందికి బయట నుంచే ఇలాంటి వేధింపులు వస్తుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉండడం వల్లే ఇప్పుడు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు. హీరోయిన్ అయేషా ఖాన్(Ayesha Khan) కూడా చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురైయ్యారట. బాబాయ్ లాంటివాడే తనతో అసభ్యకరంగా మాట్లాడి హింసించాడట. ఇప్పటికే ఆ సంఘటన గుర్తుకు వస్తే.. కళ్ల వెంట నీళ్లు ఆగవని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆయేషా.ముంబైకి చెందిన ఈ బ్యూటీ..బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు వెండితెరపై రాణిస్తుంది. కసాటి జిందగీ కే అనే సీరియల్లో ఆమె ఓ చిన్న పాత్ర పోషించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. హిందీ బిగ్బాస్ షో ఆమెను పాపులర్ చేసింది. సీజన్ 17లో పాల్గొన్న ఆమె..11 వారాల పాటు హౌస్లో ఉండి తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ముఖచిత్రం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్సేన్ సరసన నటించి, మెప్పించింది. ఓ భీమ్ బుష్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం బెంగాలీతో పాటు పలు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది.సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయేషా.. ఎప్పటికప్పడు తన సినిమా అప్డేట్స్తో పాటు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ని అలరిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఆమె ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నప్పుడు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.‘ఒకప్పుడు మాది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. చిన్న వయసులోనే లైగింక వేధింపులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఓసారి రోడ్డుపై ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే.. మా నాన్న స్నేహితుడు ఒకరు పిలిచారు. నేను ఆయనను బాబాయ్ అని పిలిచేదాన్ని. నా దగ్గరకు వచ్చి ప్రైవేట్ పార్ట్స్ గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. బాబాయ్ లాంటివాడు అలా మాట్లాడేసరికి షాకయ్యారు. ఆ వెంటనే మళ్లీ నావైపుగా వచ్చి అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. అప్పుడు నా వయసు 9 ఏళ్లు మాత్రమే. ఆయన ఎందుకు అలా అన్నాడో, ఏం చేయాలో తెలియదు. ఇంటికి వెళ్లి ఏడ్చేశా. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే.. కళ్లల్లోనుంచి నీళ్లు వచ్చేస్తాయి’ అని ఆయేషా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
పాకిస్తాన్ నటి మృతి.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం
పాకిస్తాన్ నటి ఆయేషా ఖాన్ (76) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాకిస్తాన్.. కరాచీలోని తన ఫ్లాట్లో విగతజీవిగా కనిపించింది. కొద్దిరోజులుగా ఆమె ఫ్లాట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో నటి మృతదేహాన్ని గుర్తించారు. వారం రోజుల క్రితమే ఆమె మరణించినట్లుగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జిన్నా హాస్పిటల్కు తరలించారు.కొన్నేళ్లుగా ఒంటరి జీవితంకొన్నేళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్న ఆయేషా ఖాన్ (Pakistani Actress Ayesha Khan) ఎలా మరణించింది? చివరి రోజుల్లో తను ఎలాంటి పరిస్థితిలో ఉంది? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. చుట్టుపక్కలవారిని, బంధువులను సైతం విచారిస్తున్నారు. ఆయేషా 1948, నవంబర్ 22న జన్మించింది. పాకిస్తాన్ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ అక్కడి ప్రజలు ఆమెను ఎంతగానో ఆరాధిస్తారు. ఈమె సోదరి ఖలీదా రియాసత్ కూడా బుల్లితెరపై చాలా పాపులర్.చదవండి: అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి -
Ayesha Khan: ఐటం సాంగ్స్తో ట్రెండింగ్లో ఆయేషా ఖాన్ (ఫోటోలు)
-
షూటింగ్ టైమ్లో యాక్సిడెంట్..ఇప్పటికీ పెయిన్ తగ్గలేదు: హీరోయిన్
‘ముఖచిత్రం’ నా తొలి తెలుగు సినిమా. మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో యాక్సిడెంట్ సీన్స్ చేసేప్పుడు కష్టపడ్డాను. నాకూ గాయాలయ్యాయి. రెండు నెలలు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ వల్ల పెయిన్స్ వస్తుంటాయి. ఏమైనా కష్టపడితే గానీ లైఫ్ లో ఏదీ దక్కదు అన్నట్లు ఈ సినిమాకు గాయపడినా మంచి చిత్రంలో భాగమవడం సంతృప్తిగా ఉంది’అని హీరోయిన్ అయేషా ఖాన్ అన్నారు. వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం". ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందించగా, గంగాధర్ దర్శకత్వం వహించారు. ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ...నేను ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించాను. ఈ చిత్రంలో ఒక మంచి సందేశాన్ని చూపిస్తున్నాం. మన రియల్ లైఫ్ లో చాలాసార్లు విన్నదే, చూసిందే కానీ ఇప్పటిదాకా తెరపై ఇలాంటి పాయింట్ ను ఎవరూ తెరకెక్కించలేదు. . మేము మా విజన్ కంటే దర్శకుడు సందీప్ ఎలా మమ్మల్ని తెరపై చూపించాలనుకుంటున్నాడు అనే విజన్ ను నమ్మాము. దాన్నే ఫాలో అయ్యాము. సందీప్ ఒక కొత్త తరహా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాడు. తప్పకుండా ఆదరిస్తాని కోరుకుంటున్నాను అన్నారు. హీరోయిన్ అయేషా ఖాన్ మాట్లాడుతూ...ఈ సినిమాలో సిటీ గర్ల్ మాయా ఫెర్నాండేజ్ పాత్రలో నటించాను. లైఫ్ లో ఎలా ఉండాలనే విషయంలో కంప్లీట్ గా అవేర్ నెస్ ఉన్న అమ్మాయి తను. దేనికీ కాంప్రమైజ్ కాకుండా, తను అనుకున్న పని చేస్తుంటుంది. నాకు తెలుగులో తొలి సినిమా. మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ చిత్రం నా డెబ్యూ మూవీగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. -
విల్స్ ఫ్యాషన్ వీక్
-
లాక్మే గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ తారలు


