-
ఒకే ఒక్కడు...
♦ వరుసగా మూడో సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్లో శ్రీకాంత్ ♦ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు ♦ రియో ఒలింపిక్ చాంపియన్ చెన్లాంగ్తో నేడు టైటిల్ పోరు అంతా కలలా అనిపిస్తోంది. రెండేళ్ల తర్వాత సూపర్ సిరీస్ ఫైనల్ (సింగపూర్ ఓపెన్) ఆడాను. మళ్లీ రెండు వారాల వ్యవధిలో రెండు సూపర్ సిరీస్ టోర్నీల్లో (ఇండోనేసియా, ఆస్ట్రేలి యన్ ఓపెన్) ఫైనల్కు చేరుకున్నాను. ఇదంతా కలగానే ఉంది. షి యుకితో మ్యాచ్లో ఆద్యంతం నియంత్రణతో ఆడాను. ఎక్కడా సులువుగా పాయింట్లు ఇవ్వలేదు. ఇక చెన్ లాంగ్తో జరిగే ఫైనల్లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. ఫలితం ఎలా ఉంటుందనే విషయంపై ఆలోచించడంలేదు. –శ్రీకాంత్ సిడ్నీ: భారత నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తన అద్వితీయ ప్రదర్శనను కొనసాగిస్తూ... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–10, 21–14తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ షి యుకి (చైనా)ను బోల్తా కొట్టించాడు. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో రెండు గేము ల్లోనూ ఆరంభంలో కాస్త పోటీ ఎదుర్కొన్న శ్రీకాంత్ ఆ తర్వాత ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. ఈ గెలుపుతో హైదరాబాద్కు చెందిన 24 ఏళ్ల శ్రీకాంత్ వరుసగా మూడో సూపర్ సిరీస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. తద్వారా భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా రికా ర్డు సృష్టించాడు. పురుషుల బ్యాడ్మింటన్లో మాత్రం ఈ ఘనత నమోదు చేసిన ఐదో క్రీడాకారుడిగా శ్రీకాంత్ గుర్తింపు పొందాడు. 2007లో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సూపర్ సిరీస్ టోర్నీలు ప్రవేశపెట్టాక లిన్ డాన్ (చైనా), లీ చోంగ్వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా), సోనీ ద్వికుంకురో (ఇండోనేసియా) మాత్రమే వరుసగా మూడు సూపర్ సిరీస్ టోర్నీలలో ఫైనల్కు చేరుకున్నారు. గత ఏప్రిల్లో సింగపూర్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన శ్రీకాంత్, గత వారం ఇండోనేసియా ఓపెన్లో విజేతగా నిలిచాడు. రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)తో ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 0–5తో వెనుకజంలో ఉన్నాడు. చెన్ లాంగ్తో ఇప్పటివరకు ఐదుసార్లు ఆడిన శ్రీకాంత్ అతనిపై ఒక్క గేమ్ మాత్రమే గెలవడం గమనార్హం. అయితే ప్రస్తుతం శ్రీకాంత్ ఫామ్ చూస్తుంటే ఆదివారం సంచలన ఫలితం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేటి ఫైనల్స్ ఉదయం గం. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
డిఫెండింగ్ చాంపియన్ సైనాకు షాక్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మరో హైదరాబాద్ ప్లేయర్కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో భాగంగా జరిగిన శుక్రవారం జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్(భారత్) పై 21-17, 10-21, 21-17 తేడాతో సున్ యు (చైనా) విజయం సాధించింది. ఈ విజయంతో భారత స్టార్ షట్లర్ ఇంటిదారి పట్టగా, నెగ్గిన చైనా క్రీడాకారణి సెమీస్లోకి దూసుకెళ్లింది. తొలి గేమ్ను కోల్పోయిన సైనా రెండో గేమ్లో ప్రత్యర్ధి సున్ యుకు గట్టి పోటీనిచ్చింది. రెండో గేమ్ నెగ్గిన సైనా మూడో గేమ్లో కొన్ని అనవసరం తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుని ఓటమి పాలైంది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన సైనాతో పాటు మరో క్వార్టర్ ఫైనల్లో ఓడిన పీవీ సింధు ఇంటిదారి పట్టారు. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్స్కు చేరుకున్న విషయం తెలిసిందే. -
సెమీస్ లో శ్రీకాంత్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 25-23, 21-17 తేడాతో భారత్ కే చెందిన సాయి ప్రణీత్ పై గెలుపొందాడు. ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు జరిగిన పోరులో శ్రీకాంత్ వరుస రెండు సెట్లు గెలిచి సెమీస్ కు చేరాడు. తొలి గేమ్ లో సాయి ప్రణీత్ నుంచి శ్రీకాంత్ కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వీరిద్దరూ హోరాహోరీగా తలపడిన మొదటి గేమ్ లో చివరకు శ్రీకాంత్ పైచేయి సాధించాడు. అదే ఊపును రెండో గేమ్ లో కొనసాగించిన శ్రీకాంత్.. సాయి ప్రణీత్ కు చెక్ పెట్టాడు. తద్వారా సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో సాయి ప్రణీత్ చేతిలో ఎదురైన ఓటమికి శ్రీకాంత్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ టైటిల్ పోరులో శ్రీకాంత్ పై సాయి ప్రణీత్ గెలిచి టైటిల్ ను కైవసం చేసకున్న సంగతి తెలిసిందే. -
సైనా, సింధు శుభారంభం
♦ ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశం ♦ శ్రీకాంత్, సాయిప్రణీత్ కూడా ♦ పోరాడి ఓడిన కశ్యప్, రుత్విక ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్, ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో 15వ ర్యాంకర్ సైనా 21–10, 21–16తో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై... ఐదో సీడ్ సింధు 21–17, 14–21, 21–18తో గతవారం ఇండోనేసియా ఓపెన్ టైటిల్ నెగ్గిన సయాకా సాటో (జపాన్)పై గెలుపొందారు. క్వాలిఫయర్, మరో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని 17–21, 21–12, 12–21తో చెన్ జియోజిన్ (చైనా) చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సోనియా చెహ (మలేసియా)తో సైనా; చెన్ జియోజిన్తో సింధు తలపడతారు. ప్రణయ్, జయరామ్లకు నిరాశ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్లో భారత నంబర్వన్ అజయ్ జయరామ్ 21–14, 10–21, 9–21తో ఏడో సీడ్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... ప్రణయ్ 19–21, 13–21తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో... కశ్యప్ 18–21, 21–14, 15–21తో ప్రపంచ నంబర్వన్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో... సిరిల్ వర్మ 16–21, 8–21తో విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. మరోవైపు ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ శ్రీకాంత్, యువతార సాయిప్రణీత్ తమ ప్రత్యర్థులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–13, 21–16తో కాన్ చావో యు (చైనీస్ తైపీ)పై, సాయిప్రణీత్ 10–21, 21–12, 21–10తో సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్లో సన్ వాన్ హోతో శ్రీకాంత్; హువాంగ్ (చైనా)తో సాయిప్రణీత్ ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 20–22, 21–19, 21–11తో లా చెయుక్ హిమ్–లీ చున్ (హాంకాంగ్) జంటపై గెలుపొందగా... మనూ అత్రి–సుమీత్ రెడ్డి జంట 20–22, 6–21తో తకెషి కముర–కిగో సొనాడా (జపాన్) జోడీ చేతిలో; కోనా తరుణ్–ఫ్రాన్సిస్ ఆల్విన్ ద్వయం17–21, 15–21తో సెతియావాన్ (ఇండోనేసియా)–బూన్ తాన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–11, 21–13తో వెండీ చెన్–జెన్నిఫర్ టామ్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని ద్వయం 13–21, 17–21తో లీ చున్–చౌ హో వా (హాంకాంగ్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
సైనా సాధించెన్...
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement