breaking news
Australian mother
-
ఆ ఫొటో చూస్తే వెన్నులో వణుకు..!
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన మహిళ బియాంకా డికిన్సన్ ఓ ఫొటో చూడాలంటే ఇప్పటికి వణికిపోతోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ఆమె ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో భారీ స్పందన వస్తుంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఎఫ్బీ పోస్ట్ 11 వేల లైక్స్, 9800 షేర్లు, 7300 కామెంట్లను సొంతం చేసుకుంది. రెండు రోజుల కిందట తన పిల్లలతో సరదాగా బయటకు వెళ్లింది బియాంకా. తన ఇతర సంతానం ఆ పరిసర ప్రాంతాల్లో సరదాగా ఆడుకుంటుంటే.. నెట్ ఉన్న ప్రాంతంలో రెండేళ్ల కూతురు ఆగింది. దీంతో తన చేతిలో ఉన్న కెమెరాతో చిన్నారిని ఫొటో తీసింది. ఫొటో తీస్తుండగా పక్కనున్న చెట్ల నుంచి గాలికి ఏవో రాలి పడి కదులుతున్నట్లు బియాంకా డికిన్సన్ భావించింది. తాను తీసిన ఫొటో చూసిన ఆ తల్లికి కొన్ని సెకన్లలోపే ముచ్చెమటలు పట్టించింది ఆ ఫొటో. మొదట తన కూతురి నవ్వును అద్భుతంగా కెమెరాలో బంధించానని సంబరపడ్డ బియాంకా ఆ ఫొటోలో ఓ ముదురు గోదుమ రంగులో ఉన్న పెద్ద పామును గుర్తించింది. ఫొటో తీస్తున్నప్పుడు కూతురిపై మనసు పెట్టినందున అది పాము అని గమనించలేకపోయానని, కూతురికి అడుగు దూరంలో భయంకరమైన పాము వెళ్లినా.. ఎలాంటి హాని తలపెట్టలేదని పోస్ట్లో పేర్కొంది. రెండు రోజులు గడుస్తున్నా ఇప్పిటికీ ఆ ఫొటో చూస్తే వెన్నులో వణుకు పుడుతుందని ఆ పాప తల్లి బియాంకా డికిన్సన్ అంటోంది. గుడ్ ఫొటోగ్రఫీ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం థ్యాంక్ గాడ్ అని కామెంట్ చేస్తున్నారు. -
బిడ్డలను వదిలేసి.. ఉగ్రవాద సంస్థలోకి...
మెల్ బోర్న్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు ఓ ఆస్ట్రేలియన్ మహిళ తన ఇద్దరు బిడ్డలను వదిలేసింది. ఈ విషయం ఆమె సోదరితో చెప్పి తానిక ఎప్పటికీ ఇంటిమొఖం చూడనని చెప్పి వెళ్లిపోయింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం జాస్మానియా మిలోవానోవ్(26) అనే మహిళ తాను ఐఎస్లో చేరబోతున్నట్లు పరోక్షంగా ఇంట్లో వాళ్లకు చెప్పినట్లు తేలింది. అదే విషయం తన మాజీ భర్తకు కూడా తెలియజేసినట్లు తెలిపారు. అనుమానాస్పదంగా ఆమె సిడ్నీ విడిచి వెళ్లిపోయాక పోలీసులు దర్యాప్తు చేపట్టారని, ఇప్పుడిప్పుడే కొన్ని నిజాలు వెలుగుచూస్తున్నాయని తెలుస్తోంది. ఈ ఘటనపై ఆమె మాజీ భర్త మాట్లాడుతూ' ఆమె చేసిన పనికి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇప్పుడు నా చిన్నారుల గురించే ఆలోచిస్తున్నాను. వారిని వదిలి ఎలా వెళ్లబుద్దయిందో అర్థం కావడం లేదు' అని చెప్పారు.