విహెచ్పై దాడికి సీఎం, బొత్స బాధ్యులు: ఎంపి గుత్తా
నల్గొండ:రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై తిరుపతిలో జరిగిన దాడిని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఖండించారు. ఈ దాడికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలే బాధ్యులని వారు
పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వం ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడంలేదని విమర్శించారు. వెంటనే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.