breaking news
ATP masters series tennis tournment
-
రెండో రౌండ్కు యూకీ బాంబ్రీ
ఏటీపీ మాస్టర్స్ టోర్నీ ఇండియన్ వెల్స్లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో అతను నికోలస్ మహుత్ (ఫ్రాన్స్)పై 7–5, 6–3తో విజయం సాధించాడు. ఏటీపీ టూర్లో తొలిసారి వీరిద్దరు తలపడిన ఈ మ్యాచ్ గంట 41 నిమిషాల పాటు సాగింది. ఈ పోరులో బాంబ్రీ 3 ఏస్లు సంధించాడు. రెండో రౌండ్లో అతను ప్రపంచ 12వ ర్యాంకర్ ల్యూకాస్ పౌలీ (ఫ్రాన్స్) తలపడతాడు. తొలి రౌండ్లో ల్యుకాస్కు ‘బై’ లభించింది. -
బోపన్న జోడి ఓటమి
న్యూఢిల్లీ: మోంటెకార్లో ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఐసాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్) జోడి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. మొనాకోలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-ఖురేషీ ద్వయం 6-7 (4/7), 5-7తో మూడో సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)-ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా) జోడి చేతిలో ఓటమి పాలైంది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో-పాక్ ద్వయం రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్ను ఒక్కోసారి కోల్పోయాయి. నిర్ణాయక టైబ్రేక్లో మెలో-డొడిగ్ జంట పైచేయి సాధించింది. రెండో సెట్లో బోపన్న ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసినా... తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్స్లో ఓడిన బోపన్న జోడికి 21,430 యూరోలు (రూ. 17 లక్షల 86 వేలు) ప్రైజ్మనీ, 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.