breaking news
Assembly Speaker Nadendla Manohar
-
అసెంబ్లీ ప్రాంగణాన్ని పరిశీలించిన స్పీకర్
హైదరాబాద్ : శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ బుధవారం అసెంబ్లీ ప్రాంగణాన్ని పరిశీలించారు. అసెంబ్లీకి విభజన బిల్లు రానున్న నేపథ్యంలో సమావేశాల ఏర్పాటుపై స్పీకర్ కసరత్తు చేపట్టారు. అధికారులతో సమావేశమై అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. కాగా అసెంబ్లీని ప్రొరోగ్ చేసినప్పటికీ డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు జరిగి తీరుతాయని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు డిసెంబర్ ఒకటి రెండు తేదీలలోనే రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు వస్తే ఏ క్షణంలోనైనా స్పీకర్ అసెంబ్లీని సమావేశపరచవచ్చనే అంచనాతో పోలీస్ అధికారులున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నాలుగు ఐదు తేదీలలో అసెంబ్లీ సమావేశం పెట్టినా, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదే సందర్భంలోనే స్పీకర్ పోలీస్ అధికారులతో సమావేశమవ్వడమూ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా సహజంగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ముందు పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ సంప్రదింపులు జరుపుతుండడం తెలిసిందే. -
ఇదేమి రచ్చబండ
సాక్షి, గుంటూరు :‘రచ్చబండ’ పేరుతో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తూ పూర్తయిందనిపిస్తున్నారు.తాత్కాలిక రేషన్ కార్డులు, పెన్షన్ల పంపిణీకి నేతలు,అధికారులు పరిమితమవుతున్నారు. రైతులను, వారి సమస్యలను పూర్తి స్థాయిలో విస్మరిస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణం, కొలకలూరు పంచాయతీలో గురువారం నిర్వహించిన రచ్చబండకు నియోజకవర్గ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రజాస్పందన లేకుండానే రచ్చబండను మమ అనిపించారు. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి పాల్గొని కొందరు లబ్ధిదారులకు తాత్కాలిక రేషన్కార్డులు పంపిణీ చేసి ముగించారు. అంతకు ముందు ప్రసంగిస్తూ తాను సమైక్యవాదినంటూ, రాష్ట్ర సమైక్యతకు పోరాడుతున్నానంటూ చెప్పుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతలు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం, ఇటీవల అధికవర్షాలకు పంటనష్టపోయిన విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. వినుకొండ రూరల్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు రేషన్ సరకుల సమస్యపై అధికారులను చుట్టుముట్టారు. కార్డులు వున్నా రేషన్ ఇవ్వడంలేదని వివరించారు. దీనికి స్పందించిన అధికారులు సర్వర్లో కార్డుల డేటా మాయమైందని, హైదరాబాద్ నుంచి ఇంజినీర్లను పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని సమాధానమిచ్చారు. పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల్లో శుక్రవారం జరగాల్సిన రచ్చబండను పలు కారణాల నేపథ్యంలో వాయిదా వేశారు.