assam assembly elections 2016
-
గిరిజనుల అభివృద్ధికి రోడ్ మ్యాప్
గువాహటి: అస్సాంలోని గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్ధం చేసి ఉంచారని, ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలుపుతో అమలు చేయడం తథ్యమని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గోల్పారా, కామ్రూప్ జిల్లాల్లో శుక్రవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మంత్రి ప్రసంగించారు. ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతిగా అన్నేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేకపోయిందని విమర్శించారు. ద్రౌపదీ ముర్మును దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. పలాశ్బరిలో ఐఐఎం ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.‘మీరు ఎంతగా అడ్డుకున్నా, ఐఐఎం ఏర్పాటును ఏమాత్రం ఆపలేరు’ అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మినీ అస్సాంగా పేరున్న గోల్పారా జిల్లాలోని పలు గిరిజన తెగల అభివృద్ధికి పాటుపడేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా నొక్కి చెప్పారు. అదే సమయంలో, గిరిజనులు మెజారిటీగా ఉన్న జిల్లాలు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు పరిధిలోకి రావని వివరించారు. ప్రతి గిరిజన కుటుంబానికీ ఒక ఆవు, ఒక గేదెను పంపిణీ చేస్తామని సహకార శాఖ మంత్రిగా ఇది తన హామీ అంటూ ఆయన ప్రకటించారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ధుబ్రి జిల్లా గోలక్గంజ్లో ఆయన పాల్గొనాల్సిన ఎన్నికల ర్యాలీ రద్దయింది. -
నా పేరు మోదీ కాదు.. నేను అబద్దాలు చెప్పడానికి రాలేదు
గువాహటి: దేశానికి నిత్యం (24/7) అబద్ధాలు చెప్పే మోదీని తాను కాదంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘నా పేరు నరేంద్ర మోదీ కాదు. నేను అబద్దాలు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మోదీ అబద్ధాలను వినాలనుకుంటే కేవలం టీవీ ఆన్ చేయండి చాలు. దేశానికి ఆయన నిత్యం అబద్ధాలు చెబుతూనే ఉంటారు’ అని రాహుల్ విమర్శించారు. అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో మేము అయిదు హామీలిస్తున్నాం. రాష్ట్రంలో సీఏఏను అమలు కానివ్వబోం. అయిదేళ్లలో అయిదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. తేయాకు కార్మికుల వేతనాలను రూ. 193 నుంచి రూ. 365కు పెంచుతాం. గృహిణులకు నెలకు రూ. 2 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. ఇవే మేమిస్తున్న అయిదు హామీలు. మేము బీజేపీలాగా కాదు. హామీలిస్తే అమలు చేసి చూపిస్తాం. పలు రాష్ట్రాల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేసి చూపించామన్నారు. చదవండి: (బీజేపీ నియంతృత్వాన్ని ఎదిరిద్దాం) -
భార్య బీజేపీకి ఓటు వేసిందని..
గువాహటి: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిందనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సోనిత్పూర్ జిల్లాలోని దొనా అద్దాహతి గ్రామానికి చెందిన అయినుద్దీన్ తన భార్య దిల్వారా బేగంకు తాజాగా 'తలాఖ్' (విడాకులు) ఇచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామవాసులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను బీజేపీకి ఓటు వేసినట్టు దిల్వారా భర్తకు చెప్పింది. దీంతో కోపగించుకున్న అయినుద్దీన్ తమ పదేళ్ల వైవాహిక జీవితానికి చరమగీతం పాడాడు. బీజేపీకి ఓటువేసిందని తెలియగానే ఆమెకు విడాకులు ఇచ్చాడని స్థానిక మీడియా పేర్కొంది. అయితే, గ్రామస్తులు మాత్రం ఈ దంపతులు వ్యక్తిగత కారణాలతోనే విడాకులు తీసుకున్నారని, బీజేపీకి ఓటు వేయడం కారణం కాదని చెప్తున్నారు.


