-
Hyderabad: నెట్ఫ్లిక్స్లో వచ్చిన వెబ్సిరీస్ చూసి.. కిడ్నాప్ చేసి..
సాక్షి, హైదరాబాద్: నెట్ఫ్లిక్స్లో వచ్చిన ‘మనీ హెయిస్ట్’ చూసి కిడ్నాప్లకు తెగబడి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ తప్పించుకుంటున్న ఓ ఘరానా నేరగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘరానా నిందితుడితోపాటు అతడి గ్యాంగ్ను ఆసిఫ్నగర్ పోలీసులు పట్టుకున్నట్లు కొత్వాల్ సీవీ ఆనంద్ వెల్లడించారు. మెహిదీపట్నంలోని భోజగుట్టకు చెందిన గుంజపోగు సురేశ్ 2011 నుంచి నేరాలు చేయడం మొదలెట్టాడు. ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో 14 చోరీ కేసులు నమోదయ్యాయి. 2019 డిసెంబర్లో జైలుకు వెళ్లి 2020 ఫిబ్రవరిలో బయటకు వచ్చాడు. ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్లో వచ్చిన ‘మనీ హెయిస్ట్’వెబ్ సిరీస్ అతడిని ఆకర్షించింది. దీంతో అదే పంథాలో అపహరణలు చేసి బాధితుల నుంచి డబ్బు రాబట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారంలో తనకు సహకరించడానికి భోజగుట్ట ప్రాంతానికే చెందిన ఎం.రోహిత్, ఐ.జగదీశ్, కె.కునాల్లతోపాటు జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన శ్వేతాచారిని ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు ఇచ్చేవాడు. తన స్నేహితుల ద్వారా పరిచయమైన వారి ఫోన్ నంబర్లు సంగ్రహించేవాడు. వారితో సంప్రదింపులు జరపడానికి ప్రత్యేకంగా ఫోన్, నంబర్ ఏర్పాటు చేసుకున్నాడు. శ్వేతాచారి ఫొటోను డీపీగా పెట్టి, ఆమెతోనే వాయిస్ మెసేజ్లు సందేశాలు పంపి టార్గెట్ చేసిన వ్యక్తుల్ని ముగ్గులోకి దించేవాడు. పగటిపూట ఆమెతో, రాత్రిళ్లు స్వయంగా చాటింగ్ చేసేవాడు. అడుగడుగునా జాగ్రత్తలు: ఓ దశలో డేటింగ్ కోసం కలుద్దామంటూ శ్వేతతో సందేశం పంపించి ఏదో ఒక చోటుకు బాధితులను రప్పించేవాడు. అక్కడకు వచ్చిన తర్వాత తన గ్యాంగ్తో కలసి కిడ్నాప్ చేసేవాడు. గుర్తుపట్టకుండా ఉండటానికి తమతోపాటు బాధితులకూ మాస్కులు, ఫేస్కవర్లు చేయించేవాడు. బాధితుడి ఫోన్ నుంచి కాల్స్ చేయడమో, అతడి నుంచి హాట్స్పాట్ తీసుకుని తన ఫోన్ ద్వారా వాట్సాప్ కాల్స్ చేసి బాధితుల కుటుంబాన్ని బెది రించేవాడు. డిమాండ్ చేసిన నగదును బాధితుడి ఖాతాలో వేయించి, బాధితుడితోనే ఏటీఎంల నుంచి డ్రా చేయించి డబ్బు తీసుకున్నాక అతడిని విడిచిపెట్టేవాడు. ఇలా 2021 నుంచి సంగారెడ్డి జిల్లా సదాశివపేట, హైదరాబాద్లోని లంగర్హౌ స్, జీడిమెట్ల, ఆసిఫ్నగర్, రాజేంద్రనగర్తోపాటు తెనాలి రూరల్లో ఆరు నేరాలకు పాల్పడ్డాడు. సురేశ్ ఒక్కోసారి బాధిత కుటుంబీకులను డబ్బులు తీసుకొని హైదరాబాద్లోని అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కిందకు రమ్మనేవాడు. కిందికి తాడు సహాయంతో డబ్బు సంచిని పైకి లాగి తీసుకునేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఆసిఫ్నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ఈ నెల 5న కిడ్నాప్ చేసి, రూ.50 వేలు వసూలు చేశాక మరుసటిరోజు విడిచి పెట్టాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆసిఫ్నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారనే విషయం తెలుసుకున్న సురేశ్ తన కారును కర్నూలులో రిపేరుకు ఇచ్చి ఆ షెడ్ యజమాని నుంచి తాత్కాలికంగా మరో వాహనం తీసుకున్నాడు. ఇలా పది రోజులుగా సంచరిస్తున్న సురేశ్ హైదరాబాద్ చేరుకోగానే ఆసిఫ్నగర్ పోలీసులు పట్టుకున్నారు. సురేశ్ ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్వేత కోసం గాలిస్తున్నారు. -
గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం
మెహిదీపట్నం బోజగుట్టలో ఘటన హైదరాబాద్: నగరంలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు గోడ కూలి దుర్మరణం పాలయ్యారు. ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై కుమారస్వామి వివరాలను మీడియాకు తెలిపారు. మహారాష్ట్ర, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన నాగేశ్(30), కృష్ణ (35) మెహిదీపట్నం బోజగుట్టలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అయోధ్యనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నం. 28 వద్ద ఓ భవన నిర్మాణ పనుల్లో ఉండగా, పక్కనున్న మరో భవనం ప్రహరీ వీరిపై కూలింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతులకు న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు, ఇతర కార్మికులు బైఠాయించారు. ఏసీపీ గౌస్ మొహియుద్దీన్, డీఐ రాజరాజేశ్వర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదు పులోకి తీసుకొచ్చారు. భవన నిర్మాణంలో సెల్లార్, 6వ అంతస్తులను అనుమతి లేకుండా నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మృతదేహాలను తరలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.6 లక్షల బీమాతో పాటు రూ. 30 వేల దహన సంస్కారాల ఖర్చును అందిస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అ«ధ్యక్షుడు పి.రామారావు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement