breaking news
Ashok Parnami
-
బీజేపీలో మరో బిగ్ వికెట్ డౌన్
జైపూర్: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు అశోక్ పర్నామి పదవి నుంచి తప్పుకున్నారు. ఆదర్శ్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగానూ కొనసాగుతున్న ఆయన బుధవారం ఉన్నపళంగా రాజీనామా ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే, వ్యక్తిగత కారణాల వల్లే ఆయన రాజీనామా చేశారని, ఈ మేరకు పార్టీ జాతీ అధ్యక్షుడు అమిత్షాకు సమాచారం ఇచ్చారని పర్నామీ వర్గీయులు తెలిపారు. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఎన్నికల రాష్ట్రాల్లో బీజేపీ మరిన్ని సంస్థాగత మార్పులు చేపట్టవచ్చనే భావన వ్యక్తమవుతున్నది. -
ఆ ఇద్దరికీ ముప్పు తప్పినట్టే(నా)!
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో చిక్కుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజెలపై బీజేపీ ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. బీహార్ ఎన్నికల ముందు ఎలాంటి చర్య వద్దని, విపక్షాల ఒత్తిడికి తలొగ్గకూడదని ఆర్ఎస్ఎస్ ఉద్బోధించడంతో మహిళా నేతలకు ముప్పు తప్పినట్టే కనబడుతోంది. మరోవైపు 'లలిత్ గేట్'పై బీజేపీ అగ్రనాయకులు శుక్రవారం మంతనాలు సాగించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీ అయ్యారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఇరువురు నాయకులు మంతనాలు సాగించినట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి జైట్లీ వ్యూహం ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది. కాగా వసుంధర రాజె ప్రభుత్వం శాసనసభలో బలం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు అశోక్ పర్నామి స్పష్టం చేశారు. 'లలిత్ గేట్'లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మ, రాజె తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.