breaking news
the Ashes series
-
డే అండ్నైట్గా యాషెస్ సిరీస్
సిడ్నీ: వచ్చే ఏడాది ఆసీస్లో జరిగే యాషెస్ సిరీస్ను డే అండ్ నైట్గా మార్చే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంకా ఇంగ్లండ్ బోర్డుతో మాట్లాడలేదని చెప్పారు. అలాగే తమ దేశంలో పర్యటించే పాక్, దక్షిణాఫ్రికా జట్లతో కూడా ఇదే విధంగా ఆడేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. -
సొంత గడ్డపై ఇదే చివరి టెస్టు: రోజర్స్
సిడ్నీ: వచ్చే యాషెస్ సిరీస్తో టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పాలనుకుంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ స్వదేశంలో చివరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 6 నుంచి భారత్తో జరిగే సిడ్నీ టెస్టు స్వదేశీ గడ్డపై ఆఖరిదని ప్రకటించాడు. ‘భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని యాషెస్ సిరీస్ అనంతరం ఆటను ముగిద్దామనుకుంటున్నాను. అయితే ఇక్కడ చివరి టెస్టును ఘనంగా ముగించాలనుకుంటున్నాను’ అని 19 టెస్టులు ఆడి 1,384 పరుగులు చేసిన 37 ఏళ్ల రోజర్స్ అన్నాడు. ధోని గైర్హాజరీతో ఆసీస్కు లాభం: వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలికిన ఎం.ఎస్.ధోని గైర్హాజరీ... నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాకు కలిసొస్తుందని డాషింగ్ ఓపెనర్ వార్నర్ అన్నాడు. మ్యాచ్ గురించి మహి చాలా రకాలుగా ఆలోచిస్తాడని, అతను ఆటపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని ప్రశంసించాడు. ధోని స్థానంలో పగ్గాలు చేపట్టిన కోహ్లి జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలన్న ఆతృత ఎక్కువైందని వార్నర్ అన్నాడు.