breaking news
aryas
-
Dr. Neelima Arya: ‘షి నీడ్స్’ నీలిమ!
ఉరుకుల పరుగుల జీవితంలో మన ప్రయాసలే కనిపిస్తాయి. ఒకసారి ఆగి చుట్టూ చూస్తే.. ఇన్నాళ్లూ మనం మన కోసమే తప్ప చుట్టూ ఉన్న వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే స్పృహ కలుగుతుంది. కొందరు మనకెందుకులే అని మళ్లీ తమ పనుల్లో మునిగిపోతారు. డాక్టర్ నీలిమా ఆర్య లాంటివాళ్లు మాత్రం సున్నితమైన సమస్యలపై దృష్టి పెట్టి వాటికి సరైన పరిష్కారాలు వెదుకుతారు. హైదరాబాద్ వాసి నీలిమా ఆర్య నిరుపేద అమ్మాయిలకు లో దుస్తులను అందిస్తూ, శుభ్రతపైన అవగాహన కల్గిస్తూ వారి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఏడాదిలో రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నీలిమా ఆర్యను కలిసినప్పుడు ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘మా సొంతూరు బాపట్ల. అమ్మానాన్నలకు పెద్ద కూతురిని. ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ చేశాను. మా నాన్నగారు ఆర్మీ ఉద్యోగి కావడంతో నా చదువు అంతా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా భోపాల్లో జరిగింది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ పదేళ్లపాటు ఇంగ్లిష్ లెక్చరర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత తిరిగి భోపాల్కి వెళ్లాను. అక్కడ నుంచి సౌదీ గవర్నమెంట్కు ఆంగ్ల ప్రొఫెసర్గా వర్క్ చేశాను. ఆరేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి, మీడియా రంగంలో ఉండటంతో చాలా సామాజిక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే తపన అప్పుడే మొదలైంది. అమ్మానాన్నల దేశ సేవ స్ఫూర్తి కూడా నాలో ఉండటం అందుకు కారణమై ఉంటుంది. ► ఐదు ప్రాజెక్ట్స్తో సేవా రంగం ఐదేళ్ల క్రితం ఐదు ప్రాజెక్ట్స్తో ‘యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా’ ఫౌండేషన్ను ప్రారంభించాను. దీంట్లో భాగంగా ఎవరూ ఆకలితో పడుకోకూడదు అనే ఆలోచనతో మొదటిది ఫీడ్ ద నీడ్ ప్రాజెక్ట్ చేశాను. రోడ్సైడ్ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసి, నిరుపేదలకు ఆహారం అందేలా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ‘షీ నీడ్’ ద్వారా ముఖ్యంగా గ్రామీణ అమ్మాయిలకు, మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందజేశాం. ‘మిషన్ భద్రత’ పేరుతో ఒక్కో సెట్లో ఆరు నాణ్యమైన ఫ్యాబ్రిక్తో తయారుచేసిన లో దుస్తులను ఉంచి, ఏడాది నుంచి నిరుపేద అమ్మాయిలకు అందజేస్తున్నాం. వచ్చే ఏడాది వరకు రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రముఖ డిజైనర్ రవిత మేయర్ ఈ లో దుస్తులను డిజైన్ చేస్తున్నారు. కొన్ని సేవాసంస్థల సహకారంతో ఇండియా మొత్తంలో ఎవరికి అవసరం ఉందో గుర్తించి, వారికి లో దుస్తులను అందజేస్తాం. వీటితర్వాత రైతులు, నిరుద్యోగులు, వయసుపైబడినవారి కోసం సాయం అందించాలనేది మా ఉద్దేశ్యం. ► లో దుస్తుల ప్రాముఖ్యత.. నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని, వారికి అత్యవసరంగా కావాల్సినవి ఏమిటి అనే ఆలోచనలు ఎప్పుడూ చేస్తుంటాం. షీ నీడ్ ప్రాజెక్ట్ లో భాగంగా భవన నిర్మాణాలు జరిగే చోట, స్లమ్స్లలో, కూలీల పిల్లలను చూసినప్పుడు వారికి లో దుస్తుల సమస్య ఉన్నట్టు గుర్తించాం. 3 నుంచి 13 ఏళ్ల అమ్మాయిల వరకు లో దుస్తుల గురించి సరైన అవగాహన చేయగలిగితే వారిలో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనిద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలం. అలాగే, శానిటరీ ప్యాడ్స్ వాడాలన్నా సరైన లో దుస్తులు ఉండాలి. నిజానికి గ్రామీణ అమ్మాయిలు, మహిళలకు సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్, లో దుస్తులు అందుబాటులో ఉండవు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుందనే విషయాన్ని మనం విస్మరించకూడదు. ఈ విషయాన్ని పదే పదే ఆ కుటుంబాలకు తెలియజేయడానికి కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ►సాధికారతలో భాగంగా.. ఆర్య రసోయి–క్లౌడ్ కిచెన్ ద్వారా శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తున్నాను. ఎడ్యుకేటర్గా, అడ్మినిస్ట్రేటర్గా, ఆంట్రప్రెన్యూర్గా, ఇద్దరు పిల్లల తల్లిగా నా బాధ్యతలు కొనసాగిస్తూనే సమాజానికి నా వంతు సహకారాన్ని అందించాలనే లక్ష్యంతో కొనసాగతున్నాను. ధనం కన్నా ముందు జీవితాన్ని క్రమశిక్షణాయుతంగా మలుచుకోవడంలోనే విజయం దాగుంది అని నమ్ముతాను. ఆ క్రమశిక్షణే నన్ను నడిపిస్తుందని నమ్ముతాను’ అని వివరించారు నీలిమా ఆర్య. – నిర్మలారెడ్డి -
ఆర్య కోసం గెస్ట్గా నయన
చెన్నై : నటి నయనతార నటుడు ఆర్య కు మంచి స్నేహితురాలన్న విషయం తెలిసిందే. నయనతార ఏంటి హీరోయిన్లు అందరూ ఆర్యకు స్నేహితురాళ్లే అంటారా’ మీరెలాగైనా అనుకోండి. ఇక్కడ విషయం ఏమిటంటే ఆర్య కో సం నయనతార అతిథి పాత్ర పోషించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అదీ ఆయన ప్రేయసిగా. వివరాల్లోకెళితే అంజూమీనన్ దర్శకత్వం లో మలయాళంలో రూపొందిన చి త్రం బెంగళూర్ డేస్. అక్కడ మంచి విజయాన్ని సాధించిన ఆ చిత్రా న్ని పీవీపీ సినిమా సంస్థ తమిళంలో పునర్నిర్మాణం చేస్తోంది. టాలీవుడ్ బొమ్మరిల్లు చిత్రం ఫేమ్ భాస్కర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో దుల్కర్సల్మాన్, పహత్పాజిల్, నివిన్బాలీ నటించిన పాత్రల్ని ఆర్య, రాణా, బాబిసింహా, శ్రీదివ్య పోషిస్తున్నారు. పార్వతీమీనన్ పాత్రను ఆమే చేస్తున్నారు. కాగా నిత్యామీనన్ కూడా తన పాత్రను తమిళంలోనూ తనే పోషిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడాపాత్రల్లో ఆర్య కోరిక మేరకు నయనతార పోషించడానికి సిద్ధం అవుతున్నారన్నది కోలీవుడ్ సమాచారం. విశేషం ఏవిటంటే ఈ చిత్రంలో నయనతార ఆర్యకు లవర్గా అతిథి పాత్రలో నటించనున్నారట. ఈ చిత్రానికి మొదట సింగపూర్ డేస్ అనే పేరు ప్రచారంలో ఉంది. ఆ తరువాత ఇదువుం కడందుపోగుం అన్నారు. తాజాగా చిత్రంలోని ప్రధాన పాత్రల పేర్లు అర్జున్, దివ్య, మట్రుం కార్తీక్లలోని మొదటి అక్షరాలు తీసుకుని ఏడీఎంకే అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.