breaking news
Arka Media
-
'ఆహా'లో భయపెట్టనున్న సైకలాజికల్ హర్రర్ వెబ్ సిరీస్
Regina Anyas Tutorial Web Series OTT Release Date Announced: 'బాహుబలి' చిత్ర నిర్మాణ సంస్థ 'అర్కా మీడియా వర్క్స్' తాజాగా వెబ్ సిరీస్ రంగంలోకి ప్రవేశించింది. ఈ సంస్థ తెలుగు, తమిళం భాషల్లో రూపొందిన వెబ్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్'. ఈ వెబ్ సిరీస్ ద్వారా పల్లవి గంగి రెడ్డి దర్శకురాలిగా పరిచయం అయ్యారు. హీరోయిన్ రెజీనా, నివేదిత సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ జులై 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయం గురించి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ఇది తమ తొలి తమిళ వెబ్ సిరీస్ అని, ఆహాతో కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దర్శకురాలు పల్లవి మాట్లాడుతూ తాను ఆహాలో పనిచేశానని, ఈ సంస్థ మంచి కథలనే ఇష్టపడుతుందన్నారు. ఈ వెబ్ సిరీస్ రెండు భాషల్లో రూపొందించడం వల్ల ఎక్కువ శ్రమించాల్సి వచ్చిందన్నారు. 'అన్యాస్ ట్యుటోరియల్' వంటి సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రావడం సంతోషకరం అని హీరోయిన్ రెజీనా పేర్కొంది. కాగా ఇటీవల విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలకు మంచి స్పందన లభిస్తోంది. (చదవండి: హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు..) -
పరంపర వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: పరంపర కథ: హరి యేలేటి దర్శకత్వం: కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్ నేపథ్య సంగీతం: నరేష్ కుమారన్ ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్స్టార్ విడుదల: 24 డిసెంబర్ 2021 బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ 'ఆర్కా మీడియా' వెబ్ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెబ్ సిరీస్ పరంపర. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆర్కా మీడియా ఒక వెబ్ సిరీస్ తీస్తుందనే వార్తలు వినిపించడంతో 'పరంపర'పై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. మురళి మోహన్, జగపతి బాబు, శరత్ బాబు వంటి, ఆమని వంటి సీనియర్ నటీనటుమణులతో తెరకెక్కిన 'పరంపర' మొదటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే హాట్స్టార్ ఒరిజినల్స్ మొదటిసారిగా చేసిన తెలుగు వెబ్ సిరీస్ ఇది కావడం విశేషం. యాక్షన్, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ: రాజకీయం, పవర్, మోసం, కుటుంబం విలువలు వంటి అంశాలతో రూపొందించిన వెబ్ సిరీస్ పరంపర. విశాఖ జిల్లాకు చెందిన వీర నాయుడు (మురళి మోహన్) ప్రజల మనిషి. రాజకీయాల్లో తనదైన శైలిలీ పట్టు సాధిస్తూ ప్రజలకు అండగా నిలుస్తాడు. వీర నాయుడికి మోహన రావు (జగపతి బాబు), నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) ఇద్దరు కుమారులు. రాజకీయాలు, ప్రజలను ఆదుకోవడం వంటి పనులను పెద్ద కుమారుడైన మోహన రావుకు కట్టబెడుతూ ప్రాముఖ్యతనిస్తాడు వీర నాయుడు. ఇది చూసిన నాగేంద్ర నాయుడుకు ఈర్శ్య, ద్వేషం కలుగుతాయి. దీంతో ఎలాగైన తాను కింగ్మేకర్గా అవ్వాలనుకుంటున్న నాగేంద్ర నాయుడికి తన తండ్రి మరణం మంచి అవకాశంగా మారుతుంది. ఈ ఒక్క సంఘటనతో రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్ని నాగేంద్ర నాయుడి చేతుల్లోకి వెళతాయి. అక్కడినుంచి నాగేంద్ర నాయుడి ఆధిపత్యం కొనసాగుతోంది. సెంటిమెంట్తో తన తండ్రిని పక్కన పెట్టి బాబాయ్ అధికారం చేజిక్కించుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు గోపి (నవీన్ చంద్ర). ఎలాగైన తిరిగి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడతాడు. ఇందుకోసం నాగేంద్ర నాయుడితో అంతర్యుద్ధానికి తెర లేపుతాడు గోపి. ఈ యుద్ధాన్ని కాలేజీ ప్రెసిండెట్ ఎన్నికల్లో నాగేంద్ర నాయుడు కుమారుడు సురేష్ (ఇషాన్)తో పోటీకి దిగుతాడు. అక్కడినుంచి నాగేంద్ర నాయుడితే గోపి యుద్ధం ప్రారంభమవుతుంది. అయితే ఈ యుద్ధంలో గోపి గెలిచాడా ? అధికారాన్ని చేజిక్కుంచుకున్నాడా ? అతనికి ఎదురైన పాత్రలు తనపై ఎలాంటి ప్రభావం చూపాయి ? అనేదే కథ. విశ్లేషణ: కథ అంత కొత్తగా అనిపించదు. అన్నదమ్ముల మధ్య ఉండే ఆధిపత్య పోరు, కుటుంబం కన్నా రాజకీయం ముఖ్యమనిపించే కథలు ఇది వరకు చాలానే చూశాం. అయితే కథను ఆవిష్కరించిన విధానంలో మాత్రం దర్శకులు విజయం సాధించారు. నాగేంద్ర నాయుడిపై అటాక్తో 'ప్రారంభం' అనే ఎపిసోడ్తో ప్రారంభమవుతుంది 'పరంపర' వెబ్ సిరీస్. ఈ యాక్షన్ సీన్తోనే పాత్రల పరిచయం చేస్తూ గోపి మోటివ్ను చూపించారు దర్శకులు. పొలిటికల్ డ్రామా, అధికారానికి ఉన్న శక్తిని చూపిస్తూనే కుటుంబం విలువలు, ఎమోషన్ను బాగా చూపించారు. రాజకీయం, అధికారమే తప్ప దేన్ని పట్టించుకోని అత్యంత కఠినమైన పాత్ర నాగేంద్ర నాయుడిది. అలాంటి పాత్ర కూడా ఎమోషనల్ అయి వెంటనే ఈర్శ్య కలగడం వంటి సీన్లతో అహంకారం ముందు ప్రేమ ఎలా నిలవలేదో చూపించి ఆకట్టున్నారు. హరి యేలేటి కథ అందించిన ఈ వెబ్ సిరీస్లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి కృష్ణ విజయ్. ఎల్ డైరెక్ట్ చేయగా మిగతా ఎపిసోడ్లన్నింటిని విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి డైరెక్ట్ చేశారు. అయితే వెబ్ సిరీస్ నిడివి కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అన్ని ఎపిసోడ్లు కలిపి సుమారు ఐదున్నర గంటలకుపైగా ఉంటుంది. కాకపోతే వెబ్ సిరీస్ ప్రారంభం నుంచి ఎంగేజింగ్గా తీశారు. అస్సలు బోర్ కొట్టదు. నాగేంద్ర నాయుడు, గోపి మధ్య పోటీ, నాగేంద్ర నాయడిపై గెలవాలని గోపి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. మోహన రావును నాగేంద్ర నాయుడు ఎంత తొక్కిపెట్టిన తిరగబడక పోవడం, మోహన రావుపై నాగేంద్ర నాయుడి ఈర్శ్యకు గల కారణాలను బానే ప్రజెంట్ చేశారు. చివరి రెండు ఎపిసోడ్లు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ప్రేక్షకులు నిరాశ పడతారు. అయితే క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్లా ఉండదు. ఇంకా వెబ్ సిరీస్ కొనసాగుతుందేమో అనే ఫీలింగ్ను క్రియేట్ చేస్తుంది. వెబ్ సిరీస్కు ఇదే ఆరంభం మాత్రమే అనే హింట్ ఇచ్చేందుకే దర్శకులు క్రైమాక్స్ అలా ప్లాన్ చేశారేమో అని తెలుస్తోంది. క్లైమాక్స్తో అసలు కథ ఇంకా మిగిలే ఉందని, ఈ వెబ్ సిరీస్కు సీక్వెల్ కూడా రానుందని అర్థమైపోతుంది. అక్కడక్కడ కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్లు ఉంటాయి. ఇవి కాస్త ఫ్యామిలీ ఆడియెన్స్కు ఇబ్బంది కలిగిస్తాయి. సిరీస్లో పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, డైలాగ్లు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే: నలుగురికి సహాయపడే పాత్రలో మురళి మోహన్, జగపతి బాబు చక్కగా ఒదిగిపోయారు. సాధారణంగా కుటుంబంలో పెద్ద కుమారుడి డామినేషన్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో చిన్న కుమారుడు నాగేంద్ర డామినేషన్, నెగెటివ్ పాత్ర అయిన నాగేంద్ర నాయుడిగా శరత్ కుమార్ వెల్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. మోహన రావును తొక్కిపెట్టి కపటధారిగా ఆకట్టుకున్నారు. అలాగే మోహన రావు, నాగేంద్ర నాయుడు యుక్త వయసు పాత్రల్లో శ్రీతేజ్, ప్రవీణ్ యండమూరి మంచి నటనతో మెప్పించారు. మోహన రావు భార్య, గోపి తల్లి భానుమతిగా ఆమని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాబాయ్ అధికారాన్ని అంతం చేయాలనే గోపి పాత్రతో నవీన్ చంద్రకు మంచి ఛాలెంజింగ్ రోల్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు నవీన్ చంద్ర. అప్పటివరకు సైలెంట్గా ఉండి చివరిలో పూర్తి వ్యూహాత్మకంగా వ్యవహరించే సురేష్ పాత్రలో ఇషాన్ (రోగ్ ఫేమ్) నటించి పర్వాలేదనిపించాడు. రచనగా హీరోయిన్ ఆకాంక్ష ఆకట్టుకోగా.. గోపి లవర్గా జెన్నీ పాత్రలో తన అందాలతో గ్లామర్ను యాడ్ చేసింది నైనా గంగూలి. నాగేంద్ర నాయుడి అధికారానికి నలిగిపోయే ఇందిరా పాత్రలో కస్తూరి తనదైన పరిధిలో ఆకట్టుకుంది. నరేశ్ కుమరన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అక్కడక్కడ వచ్చే పాటలు సన్నివేశాలకు అవసరం లేదనిపిస్తాయి. కథ కొత్తగా అనిపించకపోయిన టేకింగ్ మాత్రం థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. మొత్తంగా చూసుకుంటే 'పరంపర'ను చూసి కొనసాగించవచ్చని చెప్పుకోవచ్చు. -
తెలుగులో భారీ జానపద సీరియల్
-
బాహుబలి నిర్మాతల భారీ సీరియల్
తెలుగు సినిమాగా తెరకెక్కి అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా మార్కెట్ వందకోట్లు దాటడమే కష్టంగా ఉన్న సమయంలో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ.. తెలుగు సినిమాకు సరికొత్త మార్కెట్ లను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ బుల్లితెర మీద సంచలనాలకు తెర తీసింది. బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ స్వర్ణ ఖడ్గం పేరుతో ఓ భారీ జానపద సీరియల్ ను నిర్మిస్తున్నారు. వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరియల్ లో బుజ్జిగాడు ఫేం సంజన గల్రాని కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సీరియల్ కోసం సంజన గుర్రపు స్వారీ, కత్తియుద్థాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. త్వరలో ఈ సీరియల్ ప్రసారం కానుండటంతో దర్శకుడు పూరి జగన్నాథ్ సీరియల్ యూనిట్ కు ప్రత్యేకంగా సంజనకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
శర్వాతో శైలజ..!
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించిన ఈ బ్యూటీ, నాని సరసన నేనులోకల్తో మరోసారి ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళనాట కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో నటిస్తున్న కీర్తి మరో క్రేజీ ఆఫర్ను సొంతం చేసుకుంది. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా బ్యానర్లో తెరకెక్కుతున్న నెక్ట్స్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనుంది. రాఘవేంద్రరావు తనయుడు కేయస్ ప్రకాష్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మహానటితో పాటు తెలుగులో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో లీడ్ హీరోయిన్గా నటిస్తుంది కీర్తి సురేష్. -
బల్గేరియాలో పది రోజులు
మదగజ ఘీంకారాలు, రథచక్రాల ధాటికి నలిగిపోతున్న అభాగ్యుల ఆర్తనాదాలు, గుర్రపు డెక్కల చప్పుళ్లు, కరవాల విన్యాసాలు, రాజకీయ యుక్తులు, కుయుక్తులు... వెరసి ‘బాహుబలి’. మహాభారతాన్ని తలపించే కథాంశంతో, కురుక్షేత్రాన్ని గుర్తుకు తెచ్చే యుద్ధ విన్యాసాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘బాహుబలి’ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. తండ్రీ కొడుకులుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో రానా ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా కథానాయికలు. కె.రాఘవేంద్రరావు సమర్పణలో అర్కా మీడియా పతాకంపై యార్లగడ్డ శోభు, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. పది రోజుల పాటు అక్కడే కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్తో ‘బాహుబలి’ తుది దశకు చేరుతుంది. తెలుగు తెరపై ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరింపజేసే సినిమా ఇదనీ, హాలీవుడ్ సినిమాను చూస్తున్న అనుభూతి ప్రేక్షకుల్లో కలగడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా చెబుతున్నారు. ‘బాహుబలి’ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తొలి భాగాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక భూమికలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, కెమెరా: కె.కె.సెంథిల్ కుమార్, సంగీతం: ఎం.ఎం. కీరవాణి.