-
ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్లో ఆస్తులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ఆసక్తికర అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఢిల్లీలో మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్లో భూములు కొనుగోలు చేశారని, ఇందులో సౌత్గ్రూపుదే కీలకపాత్ర అని పేర్కొంది. భూముల కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్కుమార్ ప్రమేయం ఉందని తెలిపింది. గౌతమ్ మల్హోత్రా, అమన్దీప్, మాగుంట రాఘవ, అరుణ్ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను సోమవారం ఈడీ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుల్ని కస్టడీలోకి ఇవ్వాలని ఈడీ కోరింది. రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్పాల్ ఈడీ చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ చార్జిషీట్లలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శరత్చంద్రారెడ్డి, కవిత సన్నిహితుడు వి.శ్రీనివాసరావు, ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్, ఫీనిక్స్ గ్రూపు, ఎన్గ్రోత్ క్యాపిటల్, క్రియేటివ్ డెవలపర్స్ తదితరుల పేర్లను ప్రస్తావించింది. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా అసాధారణ అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పింది. చార్జిషీటులోని ముఖ్యాంశాలు ఆప్ నేతలకు సౌత్గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది. ► అరుణ్పిళ్లైకి క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వాములు, రవిశంకర్ చెట్టి రూ.5 కోట్లకు హైదరాబాద్లో భూమి అమ్మారన్న ఆరోపణలున్నా వారెవరూ అరుణ్పిళ్లైను కలవలేదు. ఈ ఒప్పందాన్ని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ గ్రూప్నకు చెందిన శ్రీహరి చర్చలు జరిపి ఖరారు చేశారు. భూమి కొనుగోలు నిమిత్తం సంస్థకు ఒకరు డబ్బులు బదిలీ చేస్తారని చెప్పిన శ్రీహరి.. ఎవరు డబ్బులు బదిలీ చేశారనేది రవిశంకర్ చెట్టికి చెప్పలేదు. అయితే, ఎన్గ్రోత్ కాపిటల్ పేరుతో ఫీనిక్స్ గ్రూపునకు చెందిన శ్రీహరి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పారు. ఆ సమయంలో ఫీనిక్స్ గ్రూపునకు సీవోవోగా శ్రీహరి ఉన్నారు. దీంట్లో కవిత భర్త అనిల్కుమార్ కూడా భాగస్వామి. కవిత తెలంగాణలో పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే భూమి కొనుగోలు చేశారు. దీంతోపాటు కవిత మరో ప్రాపర్టీ కూడా కొనుగోలు చేశారు. 25వేల చదరపు అడుగుల ప్రాపర్టీకి సంబంధించిన పేపర్ వర్క్ను బుచ్చిబాబు, శ్రీహరి పూర్తిచేశారు. మార్కెట్ ధర చదరపు అడుగు రూ.1,760 ఉంటే రూ.1,260 మాత్రమే చెల్లించారు. కవితతో గణనీయమైన ఆర్థిక లావాదేవీలున్న వ్యక్తి రవిశంకర్తో భూమి కొనుగోలుకు చర్చలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇండోస్పిరిట్స్లో కవిత తరఫున అరుణ్ పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించి రూ.32.86 కోట్లు అందుకున్నారు. పిళ్లై సూచన మేరకు రూ.25.5 కోట్లు నేరుగా ఇండోస్పిరిట్స్ నుంచి పిళ్లై ఖాతాకు బదిలీ అయ్యాయి. ► ఢిల్లీ ఎయిర్పోర్టులో మద్యం దుకాణం నిమిత్తం ఎన్వోసీ కోసం జీఎంఆర్ గ్రూపునకు చెందిన బీవీ నాగేశ్వరరావుతో మాగుంట రాఘవ, ఎంపీ ఎంస్ రెడ్డి చర్చలు జరిపారు. ఎంఎస్ రెడ్డి వాట్సాప్ సందేశాల ద్వారా ఇది వెల్లడైంది. వ్యాపారంలో భాగస్వాములై ఎన్వోసీ ఇవ్వాలని జీఎంఆర్ను కోరినట్లు తేలింది. ఇండోస్పిరిట్స్లో అరుణ్ పిళ్లై ప్రాక్సీ భాగస్వామి. ఇండోస్పిరిట్స్ నుంచి లాభాలు తన నుంచి కవితకు చేరడంపై అరుణ్పిళ్లై సేట్మెంట్ల ద్వారా వెల్లడైంది. ► ఏప్రిల్ 2022లో ఢిల్లీలోని ఓ హోటల్లో విజయ్నాయర్తో కవిత, అరుణ్పిళ్లై సమావేశమయ్యారు. వ్యాపార కార్యకలాపాలు కుంటుపడుతున్న నేపథ్యంలో చెల్లించాల్సిన లంచాలు రికవరీ చేయడంపై చర్చించారు. హోటల్ రికార్డుల దీన్ని ధ్రువీకరించుకున్నాం. దినేష్ ఆరోరా, అరుణ్పిళ్లై వాంగ్మూలాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ► కిక్బ్యాక్ల రూపంలో సొమ్ములు వెనక్కి మళ్లించే పనులను అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై నిర్వహించినట్లు ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలమిచ్చారు. సౌత్గ్రూప్ నుంచి కిక్బ్యాక్లను విజయనాయర్ అందుకుంటున్నారన్నారు. విజయ్నాయర్కు డబ్బు అవసరమని బుచ్చిబాబు ఫోను నంబర్ల ద్వారా చేసిన వాట్సాప్ సందేశాల ద్వారా ధ్రువీకరణ అయింది. దీంట్లో ‘వీ’కి డబ్బు కావాలి అంటే విజయ్నాయర్కు డబ్బు అవసరమని అర్థమని బుచ్చిబాబు తెలిపారు. ► ఢిల్లీ, హైదరాబాద్ హోటళ్లలో జరిగిన సమావేశాల్లో సౌత్గ్రూపు నుంచి విజయ్నాయర్కు డబ్బులు పంపడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా బుచ్చిబాబు తెలిపారు. క్రియేటివ్ డెవలపర్స్ ఖాతాకు డబ్బు మళ్లించడం కూడా బుచ్చిబాబు నోట్స్ ద్వారా తెలిసింది. కవిత తరఫున ఇండోస్పిరిట్స్ నుంచి వచ్చిన లాభాలను అరుణ్ పిళ్లై అందుకొని ఆమె ఆదేశాల మేరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ధ్రువీకరణ అయింది. భూముల కొనుగోలులో శ్రీహరి సూచనల మేరకు కవిత తరఫున సొమ్ములు బదిలీ చేయడం వరకే పిళ్లై పాత్ర పరిమితమని తేలింది. అయితే, మే 2022 నుంచి రిజిస్టర్ కాకుండా ఉన్న భూమి 11.10.22న అరుణ్పిళ్లై భార్య పేరు మీద రిజిస్టర్ కావడం అరుణ్పిళ్లై ప్రయోజనం కోసమేనని, కవితకు లాభదాయకం కాదని దర్యాప్తులో తేలింది. అరుణ్పిళ్లై ఆదేశాల మేరకే ఇండో స్పిరిట్స్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్లకు రూ.కోటి, రూ.70 లక్షలు బదిలీ చేసినట్లు సమీర్ మహేంద్రు తెలిపారు. దీనికి మద్దతుగా ఎలాంటి రికార్డు లేదు. అయితే, అరుణ్ పిళ్లై చెప్పినట్లుగా ఈ సంస్థలు ఇండో స్పిరిట్స్ లేదా అరుణ్ పిళ్లైకి ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆయా సంస్థలకు ఇచ్చిన సొమ్ము ఇప్పటివరకూ వెనక్కి ఇవ్వలేదు. గౌతమ్ ముత్తాకు అరుణ్పిళ్లై బదిలీ చేసిన రూ.4.76 కోట్లు, అభిషేక్కు రూ.3.85 కోట్లు బదిలీ రుణం తిరిగి ఇవ్వమని చెప్పినప్పటికీ కాలక్రమేణా ఎలాంటి రుణం లేదని పిళ్లై పేర్కొన్నారు. -
తెచ్చిందెవరు.. వాడిందెవరు?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాడిసన్బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సూత్రధారులతోపాటు మాదకద్రవ్యాలు వినియోగించిన వారిని గుర్తించేందుకు బంజారాహిల్స్ పోలీసులు పలు కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం అరెస్టయిన మహాదారం అనిల్కుమార్, ఉప్పాల అభిషేక్లను సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసులో వీరమాచినేని అర్జున్, పి.కిరణ్రాజులను కూడా నిందితులుగా చేర్చారు. పబ్ మేనేజర్గా ఉన్న అనిల్కుమార్ ఈ కేసులో కీలకమని.. అతడితోపాటు అభిషేక్ను వారం పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు: ఫుడింగ్ అండ్ మింక్ పబ్పై ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి.. డ్రగ్స్, రేవ్ పార్టీ గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సం దర్భంగా బిగ్బాస్ విన్నర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్ధార్థ్తోపాటు పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డా రు. పోలీసులు వారందరి వివరాలు నమోదు చేసు కుని పంపేశారు. ఈ వ్యవహారంపై ఎన్డీపీఎస్ చట్టంలోని 8సీ, 22 బీ, 29 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం మాదకద్రవ్యాలు దొరికిన ప్రాంగణం యజమానులు నిందితులుగా మారతారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది పబ్ను లీజుకు తీసుకున్న అభిషేక్, అర్జున్, కిరణ్లను నిందితులుగా చేర్చారు. పబ్లోని బార్ కౌంటర్పై స్ట్రాలు పెట్టే క్యాడీ (ప్లాస్టిక్ డబ్బా) నుంచి 5 కొకైన్ పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మొత్తం 4.64 గ్రాముల కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ బార్ కౌంటర్ మేనేజర్ అనిల్కుమార్ ఆధీనంలో ఉండటంతో అతడు నిందితుడిగా మారాడు. వీరిలో అభిషేక్, అనిల్ లను అరెస్టు చేయగా.. అర్జున్, కిరణ్రాజ్ ఇద్దరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పబ్ యజమా నుల్లో ఒకరైన కిరణ్రాజ్ ఓ కేంద్ర మాజీ మంత్రి అల్లుడిగా తెలుస్తోంది. దీన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. సీసీ కెమెరాల్లో దొరకలే.. పబ్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సోమవారం విశ్లేషించారు. 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ పబ్లో ఓ పక్కగా బార్ కౌంటర్ ఉంది. పార్టీ జరిగే సమ యంలో అంతా కిక్కిరిసి, కౌంటర్కు అడ్డుగా ఉండటంతో.. అనిల్కుమార్ కదలికలు కనిపించలేదని పోలీసులు చెప్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే.. అతడి ఫోన్, ఐపాడ్లను విశ్లేషిస్తే.. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకున్నారన్న అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక పబ్లో డ్రగ్స్ వాడినవారిని గుర్తించడానికి అవసరమైన ప్రతి ఆధారాన్నీ పోలీసులు సేకరిస్తున్నారు. పబ్లో ఆదివారం చేసిన దాడుల్లో క్లూస్టీం 216 సిగరెట్ బడ్స్ను సీజ్ చేసింది. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం ద్వారా ఎవరైనా డ్రగ్స్ వాడారా అనేది తేల్చాలని భావిస్తున్నారు. వాటిని వినియోగించిన వారి లాలాజలం సిగరెట్ పీకలకు అంటుకుని ఉం టుందని.. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయిస్తే, ఎవరు కాల్చారనేది బయటపడుతుందని అధికారులు చెప్తున్నారు. దీనితోపాటు అనిల్కుమార్ను విచారించి డ్రగ్స్ వాడినవారి పేర్లను రాబట్టాలని.. వారి నుంచి రక్తం, తల వెంట్రుకల శాంపిల్స్ తీసుకుని ఫోరెన్సిక్ పరీక్షలు చేయించాలని భావిస్తున్నారు. రాడిసన్ హోటల్ బార్ లైసెన్సు రద్దు రాడిసన్బ్లూ రెస్టారెంట్ అండ్ బార్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాత్రి హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎన్ఏ అజయ్రావు ఉత్తర్వులు జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 6లో ఉన్న ఈ రెస్టారెంట్ అండ్ బార్లోని పబ్లో డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో 2బి లైసెన్స్ను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తొలుత ఈ విషయంగా షోకాజ్ నోటీసు జారీ చేసిన అధికారులు.. కొద్దిగంటల్లోనే లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. -
చినపులిపాక సర్పంచ్పై టీడీపీ వర్గీయుల దాడి
-
చినపులిపాక సర్పంచ్పై టీడీపీ వర్గీయుల దాడి
తోట్లవల్లూరు (పామర్రు), లబ్బీపేట (విజయవాడ తూర్పు): కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చినపులిపాక గ్రామంలో ఓ స్థలం వ్యవహారంలో వైఎస్సార్సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ ఆరేపల్లి శివరామకృష్ణ (రాము)పై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. చినపులిపాక–వల్లూరుపాలెం మధ్య ఆర్ అండ్ బీ రహదారి పక్కన ఉన్న ఓ స్థలానికి సంబంధించి, గ్రామానికి చెందిన నాగరాజును టీడీపీ వర్గీయుడు కాగిత శ్రీనివాసరావు, అతని కుటుంబ సభ్యులు ఆదివారం దుర్భాషలాడారు. దీనిపై ప్రశ్నించటానికి వెళ్లిన సర్పంచ్ ఆరేపల్లి శివరామకృష్ణతో వాగ్వాదానికి దిగారు. తీవ్రంగా దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది. ఈ దశలో సర్పంచ్ వర్గీయులు ప్రతిఘటించడంతో శ్రీనివాసరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాయపడిన సర్పంచ్ను తొలుత కంకిపాడు ఆస్పత్రికి, తర్వాత విజయవాడకు తరలించారు. ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, చినపులిపాకలో సర్పంచ్పై దాడి చేసిన టీడీపీ నేత తనపైనే దాడి జరిగిందంటూ తలకు కట్టుకట్టుకుని ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. వైద్యులు పరీక్షించి, పెద్దగా దెబ్బలు లేక పోవడంతో వెంటనే పంపించి వేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, వీరపనేని శివరామ్, వీరంకి గురుమూర్తి మరికొందరు డ్రామాకు తెరలేపారు. అనుకూలమైన టీవీ చానళ్ల విలేకరులను పిలిచి రెండు గంటలు డ్రామా నడిపించారు. దాడి చేసి రాజకీయమా? అనవసరంగా ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించిన సర్పంచ్పై తండ్రీ కొడుకులు ఇనుప రాడ్డుతో దాడి చేయడం దుర్మార్గమని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ మండిపడ్డారు. దాడి చేయడమే కాకుండా, తమ వారిపైనే వైఎస్సార్సీపీ సర్పంచ్ దాడి చేశాడంటూ టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ శివరామకృష్ణను ఆదివారం రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ వాతావరణాన్ని కలుషితం చేసేలా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. ఆక్రమణలను ప్రశ్నిస్తుంటే దాడులకు తెగబడుతున్నారన్నారు. శివరామకృష్ణ తలకు బలమైన గాయమైందని, ఐదు కుట్లు వేశారని చెప్పారు. టీడీపీ వర్గీయుడికి ఒక్క కుట్టు పడకున్నా, పెద్ద పెద్ద కట్లు కట్టుకుని డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. -
సంక్షేమం..అభివృద్ధే గెలిపించాయి..
తాడేపల్లి: ప్రజల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు, చేసిన అభివృద్ధి మున్సిపల్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాయని జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిధిని, 108, 104 సేవలను కూడా పెంచామన్నారు. కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. నూతనంగా, 3 పోర్టులు, 4 షిప్పింగ్ హర్బర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలవరం, రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకొచ్చామన్నారు. తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉందన్నారు. మాట మాట్లాడితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రజలు చెంప చెళ్లుమనిపించేలా బుద్ధి చెప్పారన్నారు. అధికార పార్టీని ఏం పీకుతారు అన్న బాబుకి , ప్రజలే డిపాజిట్లు కూడా లేకుండా జెండా పీకేశారని విమర్షించారు. 2019 అసెంబ్లి ఎన్నికల్లో ప్రజలు బాబుని పీకేశారు. ఇక 2024లో టీడీపీ జెండాను కూడా పీకి పడేస్తారని అన్నారు. అయితే తమకు ఇంత భారీ మెజార్టీనిచ్చిన ప్రజలకు తమ ప్రభుత్వం ఎప్పటికి రుణపడి ఉంటుందని అన్నారు. చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement