breaking news
Andhra Pradesh State Skill Development Corporation
-
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భారీ స్కామ్.. వారందరికీ ఈడీ నోటీసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2014-19 మద్య కాలంలో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చంద్రబాబు హయాంలో రూ.3,350 కోట్ల ప్రాజెక్టు ఒప్పందం చేసుకుంది. అందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.370 కోట్లు. ఇందులో నుంచి రూ.241 కోట్లు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్డెవలప్మెంట్లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ మేరకు నిర్ధారణ అయింది. దీంతో స్కాంలో నిందితులుగా ఉన్న 26 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. పలు షెల్ కంపెనీల ద్వారా నిధులను దారి మళ్లించినట్లు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మినారాయణ, ఓఎస్డీ కృష్ణప్రసాద్లకు నోటీసులు ఇచ్చారు. సోమవారం రోజున హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఆదేశించింది. చదవండి: (Hyderabad: రేవ్పార్టీ భగ్నం.. పట్టుబడిన 33 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు) -
దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్
సాక్షి,విశాఖపట్నం: దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ అవార్డులను ఆతిథ్య ఏపీ సొంతం చేసుకుంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ నైపుణ్య పోటీలు ఘనంగా ముగిశాయి. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరై విజేతలందరికీ అవార్డులను ప్రదానం చేశారు. మొబైల్ రొబోటిక్స్, ఐటి ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ కన్ స్ట్రక్షన్ వంటి నైపుణ్య విభాగాల్లో రాష్ట్ర యువత పురస్కారాలు దక్కించుకున్నారు. గతం కంటే ఈసారి పోటీల్లో రాష్ట్ర యువత మెరుగ్గా రాణించారు. 2018లో జరిగిన నైపుణ్య పోటీల్లో రాష్ట్రానికి 8 అవార్డులు దక్కగా.. ఈసారి జరిగిన పోటీల్లో 18 అవార్డులు దక్కాయి. అందులో 11బంగారు, 7 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచిన వీరంతా జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొంటారు. జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు మనదేశం తరుఫున 2022 అక్టోబర్ నెలలో చైనాలోని షాంఘై నగరంలో జరిగే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కుతుంది. ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఉన్నత ఆలోచనలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం విశాఖకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి నైపుణ్య పోటీల్లో పాల్గొనడం ద్వారా యువత కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడంతోపాటు పోటీ తత్వాన్ని కూడా అలవాటు చేసుకోగలుగుతారని అన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన ఉత్సాహంతోనే జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.యువత తమలో నైపుణ్యాలు పెంచుకుని దేశాభివృద్ధిలో భాగం కావాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు యువతకు ఉద్యోగ, ఉాపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టిసారించారన్నారు. ఎపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణా కార్యాక్రమాలను అమలు చేయడంతోపాటు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లు, జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీతోపాటు యూనిర్సిటీ కూడా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన గుర్తు చేశారు. ఈ నైపుణ్య పోటీలు విజయవంతంగా ముగియడానికి కారణమైన ఎన్ఎస్డిసీ, ఎపిఎస్ఎస్డిసి, సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ సభ్యులతోపాటు పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రాయూనివర్సిటీ ఇతర వేదికల ప్రతినిధులను ఆయన అభినందించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ) చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి అభినందనలు తెలిపారు. జనవరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు మరింత శ్రద్ధతో సిద్ధంమై అక్కడా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలన్నారు. వరల్డ్ స్కిల్స్ అకాడమీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఎన్.ఎస్.డి.సి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయస్థాయి నైపుణ్యాలు మన రాష్ట్రంలోని యువతకు కూడా అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆయన అన్నారు. అందుకు అనుగుణంగానే ఐటి, ఆక్వా, మ్యానుఫ్యాశ్చురింగ్, అగ్చికర్చర్, ఫార్మా లాంటి రంగాల్లో ఉపాధి అకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని.. ఇందుకోసం ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో 25 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. రెండు రోజులపాటు 11 వేదికల్లో దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు విజయంతంకావడానికి కృషి చేసిన జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆతిథ్యం ఇచ్చిన వేదికల సిబ్బందిని చల్లా మధుసూదన్ రెడ్డి అభినందించారు. చివరగా ఎపిఎస్ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన అందిరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికంటే మెరుగ్గా రాణించి వచ్చే పోటీల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా ముందుకు వెళ్తుందని ఎపిఎస్ఎస్డిసి ఎండీ బంగారరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో మొత్తం 51 టెక్నికల్ ట్రేడ్స్ లో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన 124 మందిని నైపుణ్య పోటీల్లో విజేతలుగా జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. కేరళ-32, కర్ణాటక -29, తమిళనాడు- 21, ఆంధ్రప్రదేశ్- 18, తెలంగాణ- 2; విజేతలుగా నిలిచారు. ఇతర ప్రాంతాల్లో నిర్వహించని విభాగాలకు ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవకాశం కల్పించి పోటీలు నిర్వహించారు. 100 మందికిపైగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొనగా వీరిలో 22 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, వరల్డ్ స్కిల్స్ ఇండియా సీనియర్ హెడ్ కల్నల్ అరుణ్ చందేల్, ఎపిఎస్ఎస్డిసి ఎండీ బంగారరాజు, విశాఖ మేయర్ హరివెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, డీసీఎం చైర్పర్సన్ పల్లా చినతల్లి తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశం గర్వించతగ్గ ఘటన.. ఆ చిరస్మరణీయ విజయానికి విశాఖ వేదికైంది. -
భవితకు భంగపాటు
సీఆర్డీఏలో శిక్షణ పొందిన 113 మంది విద్యార్థులు ఉద్యోగాలు ఇవ్వకపోడమేగాక తాత్కాలిక రాజధాని నిర్మాణంలోనూ వీరికి మొండిచెయ్యే.. విద్యార్థులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే ఆర్కే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం..ఉద్యోగం రాని నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇదీ ఎన్నికలకు ముందు గ్రామ గ్రామాన టీడీల నాయకులు వేసి హామీల గాలం..రాజధాని ప్రాంతంలో వారికైతే అమరావతి నిర్మాణంలో భాగస్వాములను చేయడంతోపాటు ఉద్యోగమిచ్చి ఉపాధి పట్టం కడతాం..ఇదీ నిరుద్యోగుల భవితపై ఆశలు రేపుతూ నాయకులు పలికిన చిలక పలుకులు..తీరా చూస్తే ఉద్యోగాలూ లేవు..రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యమూ లేదు..కేవలం దక్కింది మాత్రం ముద్ద అన్నం పెట్టని తూతూమంత్రం శిక్షణ ఒక్కటే.. మంగళగిరి: సీఆర్డీఏ అధకారుల ప్రచారాన్ని ఏపీఎస్ఎస్డీసీ(ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) అధికారుల హామీలను నమ్మిన 113 మంది బీటెక్, ఎంసీఏ విద్యార్థులు 2015లో ఆరు నెలల శిక్షణకు హాజరయ్యారు. శిక్షణ కోర్సుల వారీ(సివిల్, మెకానిక్, ఐటీ, సీఎస్)గా ఉంటుందని అంతర్జాతీయ కంపెనీలతో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. శిక్షణ పూర్తవగానే సీఆర్డీఏలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో అప్పటికే చేస్తున్న ఉద్యోగాలు సైతం వదులుకుని శిక్షణలో చేరారు. తొలుత నాగార్జున యూనివర్సిటీ శిక్షణ ఇచ్చిన అధికారులు రిషితేశ్వరి ఘటనతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని గురుకులంలోకి మార్చారు. నెలలు గుడుస్తున్నా ఆశించిన కంపెనీలు కోర్సులు వారీగా శిక్షణ ఇవ్వ లేదు. మరో వైపు శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో ఆగ్రహం చెంది తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దీంతో కంగుతిన్న అధికారులు తాము సీఆర్డీఏలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదని, ఏపీఎస్ఎస్డీసీ ప్రకటనలో తప్పు దొర్లిందని తాపీగా సెలవిచ్చారు. దీంతో హతాశులైన నిరుద్యోగులు అధికారుల తీరుపై మండిపడ్డారు. శిక్షణ పొందిన కాలానికి స్టైఫండ్ ఇవ్వలేదని, ఏడాది కాలన్ని కోల్పోయామని విన్నవించినా వీరి రోదన ఆలకించే వారే కరువయ్యూరు. కనీసం వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన తమకు తాత్కాలిక రాజధాని నిర్మాణంలోనైనా అవకాశం కల్పించాలంటున్న వారి అభ్యర్థననూ పక్కన పెట్టారు. ఇదేనా రాజ ధాని విద్యార్థులపై ప్రభుత్వాన్నికున్న ప్రేమంటూ మండిపడుతున్నారు. ప్రైవేటు ఉద్యోగం వదిలేసి వచ్చా బీటెక్ పూర్తరుుంది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ సీఆర్డీఏ ప్రకటనతో ఇక్కడ శిక్షణకు వచ్చా. కోరుకున్న కోర్సులో శిక్షణ ఇస్తామని చెప్పిన అధికారులు ఎలక్ట్రికల్ వైరింగ్లో శిక్షణ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే అనుభవం అడిగారు. ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేశాయి. - ముదిగొండ మధుప్రసాద్ శిక్షణ పూర్తరుునా పట్టించుకోలేదు బీటెక్ ఈసీ పూర్తి చేసి, సీఆర్డీఏ శిక్షణలో ఐటీఐ సివిల్లో శిక్షణ తీసుకున్నా. ఏడాది కాలం శిక్షణలో స్టైఫండ్ ఇవ్వడంతోపాటు శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. రాజధానిలో ప్రభుత్వం చెప్పేది ఏది చేయడం లేదు. అనేక మంది శిక్షణ తీసుకుని ఖాళీగా ఉంటున్నాం. - సురేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది రాజధానిలో రైతులనేగాక ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం మోసం చేస్తోంది. శిక్షణ పేరుతో యువకుల భవిష్యత్తును నాశనం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇచ్చిన ప్రభుత్వమే తాత్కాలిక రాజధాని నిర్మాణంలో అనుభవం అడ గడమేమిటి. యువకులకు అండగా నిలిచి వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతాం. - ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్యే