breaking news
Andhra Pradesh Non-Gazetted Officers Association (APNGOA)
-
ఎన్నికల షెడ్యూల్ను వెనక్కు తీసుకోవాలి: ఏపీ ఎన్జీవో
సాక్షి, విజయవాడ: ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను వెనక్కి తీసుకోవాలని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనాతో చాలా మంది ప్రజలు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఎన్నికలు వద్దని ఇప్పటికే ఎస్ఈసీకి అనేక సార్లు విన్నవించాం. అయినా మొండిగా షెడ్యూల్ విడుదల చేయడం దారుణం. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదు' అని అన్నారు. చదవండి: (సంక్షేమ కార్యక్రమాల అమలు ఆపండి) ఈ సందర్భంగా టీడీపీ నేత అశోక్బాబుకు చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'ఉద్యోగ సంఘాల్లో పనిచేసి రాజకీయాల్లోకి వెళ్లి ఆరోపణలు చేస్తున్నారు. మీ రాజకీయ పార్టీల సంగతి మీరు చూసుకోండి. మీలాగా రాజకీయ పార్టీలకు మస్కాలు కొట్టడం మాకు చేతకాదు. ఉద్యోగ సంఘాలపై అశోక్ బాబు ఆరోపణలు సిగ్గుచేటు' అంటూ మండిపడ్డారు. చదవండి: (నిమ్మగడ్డ ‘కోడ్’ ముందే కూత) -
ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో
సాక్షి, అమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోవిడ్ స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఎన్నికల విధులు బహిష్కరిస్తామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతోందని ఇలాంటి సమయంలో నోటిషికేషన్ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేసిన విషయం తెలిసిందే.(చదవండి: నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విస్మయం) ఈ విషయంపై స్పందించిన చంద్రశేఖర్రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలు దఫాలుగా ఎన్నికల కమీషనర్కు తెలియజేశాం. సీఎస్ కూడా ఇదే విషయాన్ని ఆయనకు వివరించారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ అప్రజాస్వామికం. తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికల తరువాత కరోనా వ్యాపించింది. ఎన్నికల కమీషనర్ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలు పెడితే ప్రజలు కూడా కరోనాతో భయబ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో పాలన కుంటుపడలేదు. 9లక్షల కు పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తాం’’ అని పేర్కొన్నారు. వ్యవస్థ కోసం పనిచేయాలి కానీ.. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నేత సుధీర్బాబు అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరని పేర్కొన్నారు. ఇక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులందరూ వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని, ప్రభుత్వ అభ్యర్థనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఎన్నికల కమిషన్ వ్యక్తుల కోసం కాదు.. వ్యవస్థ కోసం పనిచేయాలని హితవు పలికారు. -
ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతి
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ వీబీ కమలాసన్రెడ్డి మంగళవారం వెల్లడించారు. ‘ఇది కేవలం ఉద్యోగులు నిర్వహిస్తున్న సభ’ అంటూ అనుమతి కోరిన నేపథ్యంలో కేవలం గుర్తింపు కార్డులు చూపించిన ఉద్యోగుల్ని మాత్రమే స్టేడియం లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను కూడా అనుమతించబోమన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని, ర్యాలీలు తీయడం మాత్రం నిషేధమని పేర్కొన్నారు. భద్రతా కారణాల నేపథ్యంలో సభా ప్రాంగణంలోకి వాటర్ బాటిళ్లు, బ్యాగులు తదితర వస్తువులను తీసుకురావటానికి అనుమతించబోమని చెప్పారు. ఏపీఎన్జీవోలు నిర్వహించే సభను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని కొందరు ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలను చేపడుతున్నారు. నగర పోలీసులతోపాటు సాయుధ విభాగం, కేంద్ర బలగాలను సైతం స్టేడియం చుట్టూ మోహరించనున్నారు. స్టేడియానికి దారి తీసే అన్ని మార్గాల్లోనూ ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక నిఘా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి అపశ్రుతులు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సభను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాలనుంచీ ప్రముఖుల హాజరు! ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తెలంగాణ జిల్లాల నుంచి కొంతమంది ప్రముఖులను సభావేదికపైకి తేవడం ద్వారా తమ సభ కేవలం 13 జిల్లాల సభ కాదన్న సందేశం ఇవ్వడానికి ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. జంట నగరాల్లో సమైక్యవాదం వినిపిస్తున్న ఎమ్మెల్యేలను గుర్తించడానికి ఇప్పటికే కసరత్తు మొదలైంది. సభకు ఎమ్మెల్యేలను పంపించాలని ఎంఐఎం నాయకత్వానికి విజ్ఞప్తి చేయగా.. సభకు తమ ప్రతినిధులను పంపిస్తామని, అరుుతే, ఎమ్మెల్యేలను పంపించే విషయమై తర్వాత తవు నిర్ణయం చెబుతామని ఆ పార్టీ నేతలు చెప్పినట్లు తెలిసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులును కూడా సభకు ఆహ్వానించగా, పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతామని ఆయన చెప్పారని సమాచారం. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న తెలంగాణ నేతలను సభకు తీసుకురావడానికి ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. సభ నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు సారధ్యంలో 25 మందితో సమన్వయ కమిటీ ఇప్పటికే ఏర్పాటైంది. ఏర్పాట్లపై హైదరాబాద్లోని పలు కాలనీవాసులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సభకు తరలించే విధంగా ప్రణాళిక రూపొందించారు. జిల్లాల నుంచి జన సమీకరణకు కూడా కసరత్తు చేస్తున్నారు. శాంతి ర్యాలీలకు అనుమతి ఇస్తారా? హైదరాబాద్లో 7వ తేదీనాడే శాంతిర్యాలీల నిర్వహణకు అనుమతించాలని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) జేఏసీ, తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిజాం కళాశాల నుంచి గన్పార్కు వరకు శాంతి ర్యాలీకి ఓయూ జేఏసీ, సిటీ కాలేజీ నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీకి తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించారుు. రెండు ర్యాలీలూ ఎల్బీ స్టేడియం మీదుగానే సాగనున్నాయి. అయితే ఈ ర్యాలీలకు ఇప్పటివరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎల్బీ స్టేడియం మీదుగా సాగే ర్యాలీలకు అనుమతి వచ్చే అవకాశం లేదని పోలీసు వర్గాలు చెప్పాయి. అయితే ర్యాలీ వూర్గాన్ని మార్చుకుంటే అనుమతి విషయం పరిశీలించే అవకాశం ఉందని ఆవర్గాలు పేర్కొన్నాయి.