breaking news
amputation
-
'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..
తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’ మూవీలో ఎలాగైతే మనుషులు ప్రవర్తిస్తారో అలా బిహేవ్ చేస్తారట ఈ జిలాజిన్ డ్రగ్ తీసుకుంటే. దీన్ని కొందరు మత్తు పదార్థలతో కలపి తీసుకుంటారట. దాంతో మనుషులు అచ్చం జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి మోతాదు ఎక్కువైతే శరీరం కుళ్లిపోయి..ప్రాణాలు కూడా కోల్పోతారట. ఇంతకీ అసలేంటి డ్రగ్..?. అసలు దేని కోసం దీన్ని తయారు చేశారు?, ఏవిధంగా మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారు అంటే..ప్రస్తుతం యూఎస్లో ఈ డ్రగ్ సంబంధిత మరణాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ఫెంటానిల్ అనే మత్తు మందుని యువకులు సేవిస్తుంటారట. దానిలో 'జోంబీ' అనే జిలాజిన్ డ్రగ్ కలిపి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. నిజానికి ఇది జంతువులను సులభంగా అదుపులోకి తెచ్చే మత్తుమందు. దీన్ని పశువైద్య మందుగా ఉపయోగిస్తారు. అలాంటి డ్రగ్ని అక్రమ మాదకద్రవ్యాల్లో కలిపేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫెంటానిల్ అనే మత్తు మందులో కలపడం వల్ల దాని దుష్ఫ్రభావం మరింత తీవ్రతరం అవుతుందట. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన మరణాలు అధికమవ్వడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్రస్తుతం దీనికి సంబంధించిన బాధితులను యూఎస్ ఫిలడెల్ఫియాలోని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రుల్లో వారానికి ఒకసారి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు వైద్యులు.జిలాజిన్ అంటే ఏమిటి?జిలాజిన్ అనేది శక్తివంతమైన α-2 అడ్రినెర్జిక్ అగోనిస్ట్. దీనిని మొదట 1962లో బేయర్ అనే శాస్త్రవేత్త రక్తపోటు ఔషధంగా సంశ్లేషణ చేశారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా పశువైద్య కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. తరువాత ఇది 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో వీధి ఔషధంగా దుర్వినియోగం అవడం ప్రారంభించి..రాను రాను వ్యసనంగా మారింది. ఈ మందుని ఇంజెక్ట్ చేయగానే..కండరాలు సడలించి, నొప్పిని తగ్గించి వ్యక్తులను ఒక విధమైన మత్తులో జోగేలా చేస్తుందట. సింపుల్గా చెప్పాలంటే నోర్పైన్ ఫ్రైన్ విడుదలను తగ్గించి..ట్రాన్స్ లాంటి స్థితిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా జోంబీ లాంటి ప్రభావం ఏర్పడుతుంది. అదేనండి జాంబీ రెడ్డి మూవీలో విధంగా మనుషులు మారిపోతారని మాట. Welcome to Michigan 🥴🥴🥴🥴😂 pic.twitter.com/CfE1vE2fiM— 0HOUR (@0HOUR1__) September 6, 2025 ప్రమాదకరమైన ప్రభావాలు..ఈ డ్రగ్ నెమ్మదిగా హృదయ స్పందన రేటు పడిపోయేలా చేస్తుందట. తర్వాత తక్కువ రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిగి కలిగిస్తుంది. రక్తనాళాలను సంకోచించేలా చేసి తీవ్రమైన చర్మగాయాలకు దారితీస్తుందట. దీన్ని ఎక్కడ ఇంజెక్ట్ చేశామో ఆ ప్రాంతంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందట. తద్వారా కణజాలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇది అచ్చం మాంసం తినే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పోలి ఉంటుందట. కొన్ని సందర్భాలలో కణజాల నెక్రోసిస్ కారణంగా అవయవాలు స్వయంచాలకంగా విచ్ఛిన్నమవడం, ఎముకలు బహిర్గతం అవ్వడం జరుగుతుందట. ఈ డ్రగ్ సంబంధిత గాయాలనేవి.. మోతాదు వినియోగం, వ్యక్తి స్థితిని బట్టి మారుతుంటుందట దాని ప్రభావం. ఆ డ్రగ్ ఇంజెక్ట్ అయిన ప్రాంతంలో నరాలకు కోలుకోలేనంత నష్టం ఏర్పుడతుంది కాబట్టి యథాస్థితి రావడం అసాధ్యమని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ వ్యసనం బారినుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని అనుభవించేలా మాత్రం చికిత్స అందించగలమని నిపుణులు చెబుతున్నారు. అలా బయటపడి పూర్తి స్థాయిలో కోలుకున్నవాళ్లుకూడా ఉన్నారని చెబుతున్నారు.📍For informational purposes:These chilling scenes are coming out of Philadelphia, USA, linked to the widespread use of a drug called Xylazine.It’s so potent that it’s been described as a drug that “zombifies” humans 😳Could this be the beginning of an apocalypse? pic.twitter.com/r8Uiq2rYCz— ADTed✨ (@Eduo_Prince) September 6, 2025 (చదవండి: తెర వెనుక డాక్టర్ అనస్థీషియా..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..) -
'బయోనిక్ బార్బీ': ఆమె చేయి ప్రాణాంతకంగా మారడంతో..!
కేన్సర్ వ్యాధి నిర్ధారణతోనే ఎన్నో కుటుంబాలు అతలాకుతలమైపోతాయి. నయం అయి బయటపడితే పర్లేదు..నరకయాతనల మారి బాధపెడితే అనుభవిస్తున్నవారికి, సన్నిహితులకు మాటలకందని వేదనను అనుభవిస్తారు. ఈ కేన్సర్లలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఏకంగా శరీరంలో కేన్సర్ సోకిన లేదా ప్రభావిత భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బాధితులు దివ్యాంగులుగా మారిపోతారు. అలాంటి అరుదైన కేన్సర్ వ్యాధి బారినే పడింది ఇక్కడొక మహిళ. అయితే ఆ కోల్పోయిన భాగానికి సరికొత్తగా వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఊహించని పరిస్థితి ఎదురైతే అవమానంతో కాదు..దాన్ని అంగీకరిస్తూ కొత్త జీవితానికి ఎలా ఆహ్వానం పలకాలో చెప్పింది. పైగా తనలాంటి ఎందరో కేన్సర్ బాధితులకు ప్రేరణగా నిలిచింది. ఆ మహిళ కేన్సర్ కన్నీటి గాథ వింటే..కళ్లు చెమ్మగిల్లకుండా ఉండవు. ఇంతకీ ఈ కథేంటంటే..అమెరికా(US)సంయుక్త రాష్ట్రాలకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్(social media influencer ) ఎల్డియారా డౌసెట్(Eldiara Doucette) అరుదైన కేన్సర్ సైనోవియల్ సార్కోమా(synovial sarcoma) బారిన పడింది. ఈ కేన్సర్తో పోరాటం కారణంగానే సోషల్ మీడియాలో “బయోనిక్ బార్బీ" గా పేరుగాంచింది. అలా తన అరుదైన కేన్సర్కి సంబంధించిన విషయాలు నెటిజన్లతో పంచుకోవడంతో ఇదే సమస్యతో బాధపడుతున్న ఎందరో ఆమెకు స్నేహితులుగా మారారు. అంతేగాదు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోయింగ్ని సంపాదించిపెట్టింది. ఆమెకు మూడేళ్లక్రితం ఈ అరుదైన కేన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయినప్పటి నుంచి ఈ సోషల్ మీడియా జర్నీ ప్రారంభమైంది. ఒక రకంగా ఈ వ్యాధి తనలాంటి ఎందరో భాధితులని ఆమెకు ఆత్మబంధువులుగా చేసింది. అదే ఆమెకు ఈ మహమ్మారితో పోరాడే శక్తిని, స్థైర్యాన్ని అందించింది. అయితే ఈ కేన్సర్ మహమ్మారి బయోనిక్ బార్బీగా పిలిచే ఎల్డియారాపై గెలవాలనుకుందో ఏమో..!. తన విజృంభణతో ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు కేన్సర్ పునరావృతమవుతూనే ఉంది. ఎడతెగని కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో అలిసిపోయింది. ఆ మహమ్మారిపై గెలుస్తున్న ప్రతిసారి దాడి చేసి తిరగబెడుతూనే ఉండేది. దీంతో ఆమె ఆరోగ్యం దిగజారడం మొదలైంది. ఇక ఆమె బతకాలంటే కేన్సర్కణాల ప్రభావం ఎక్కువగా ఉన్న కుడిచేతి(right arm)ని తొలగించక తప్పని స్థితికి వచ్చింది. ఆ కేన్సర్ వ్యాధిని కట్టడిచేయాలంటే ఆ చేతిని కోల్పోక తప్పని స్థితి. ఆ విషమ పరిస్థితుల్లోనే కుడిచేతి మెచేయి వరకు కోల్పోయి కేన్సర్ని విజయవంతంగా జయించింది. అయితే ఆ కోల్పోయిన కుడి చేతితో తాను చేసే పనులన్నీ గుర్తొచ్చి ఎల్డియారాకు కన్నీళ్లు ధారగా వచ్చేశాయి . పుట్టుకతో వికలాంగురాలిగా ఉండటం వేరు..మధ్యలో హఠాత్తుగా వచ్చి పడిన వైకల్యాన్ని అధిగమించడం అంత ఈజీ కాదు. ఇక తాను ఒంటి చేత్తోనే జీవించాలన్న ఆలోచన కూడా జీర్ణించుకోలేనంత బాధను కలుగజేసిందామెకు. అయితే ఈమె మాత్రం సోషల్ మీడియా పోస్ట్లో "తన చేయే తనన అంతం చేయాలనుకుంది. కట్చేస్తే..అదే బాధితురాలిగా మారిందని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. అయినా కేన్సర్ని ఓడించగలిగానూ, కాబట్టి తాను కోల్పోయిన చేతికి గ్రాండ్గా వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు చేయలని నిర్ణయించుకున్నట్లు స్థైర్యంగా చెప్పింది. ఇది తనలా కేన్సర్ కారణంగా అవయవాలు కోల్పోయిన వారిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలని చేస్తున్నట్లు పోస్ట్లో వివరించింది. ఇన్నాళ్లు ఎంతగానో ఉపకరించి ఎన్నో పనుల్లో హెల్ప్ చేశావు, అలాగే ఎందరినో ఓదార్చడానికి ఉపయోగపడ్డ ఆ చేతికి కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికింది. పైగా ఆ కోల్పోయిన చేతిని నైయిల్ పాలిష్తో డెకరేట్ చేసి మరీ అంతక్రియలు నిర్వహించింది. "మనకు ఇలా జరగాలని రాసి పెట్టి ఉంటే మార్చలేం లేదా ఆపలేం. అయితే దాన్ని అంగీకరిస్తూ అధిగమిస్తే అంతిమంగా మనమే గెలుస్తామని చెబుతుంది". ఎల్డియా. అలాగే తన జీవితంలోకి వచ్చిన వైకల్యాన్ని అంగీకరించడమే గాక రోబోటిక్ ప్రొస్థెటిక్ మెటల్ రాడ్ను అమర్చుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఆనందంగా ఉండటం అనేది మన చేతిల్లోనే ఉంది. కోల్పోయమనో లేదా పొందలేకపోయమనో బాధపడిపోవడం కాదు..ఆ పరిస్థితిని కూడా మనకు సంతోషాన్ని ఇచ్చేదానిగా మార్చుకుని ఆనందభరితంగా చేసుకోవడమే జీవితం అని చాటిచెబుతోంది ఎల్డియారా. అంతటి పరిస్థితులోనూ తాను ఆనందంగా ఉండటమే గాక ఇతరులు కూడా తనలా అలాంటి పరిస్థితిని అధిగమించి సంతోషంగా ఉండాలని కోరుకోవడం నిజంగా గ్రేట్ కదూ..!. View this post on Instagram A post shared by el deer uh ᯓ★ (@semibionicbarbie) (చదవండి: దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..) -
ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..?
బ్యాంకాక్: నడిచే ఎస్కలేటర్ లో పొరపాటున కాలు పడి ఇరుక్కోవడంతో 57 ఏళ్ల మహిళ మోకాలి పైభాగం వరకు కాలును తొలగించిన సంఘటన థాయ్ లాండ్లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. దీంతో పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో సౌకర్యాలపై అనుమానాలు కమ్ముకుని, ఇకపై బ్యాంకాక్ పర్యటన అంటే పర్యాటకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది. డాన్ ముయాంగ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కారంత్ తనకుల్జీరపత్ తెలిపిన వివరాల ప్రకారం నఖోన్ సి తమ్మారత్ వెళ్తోన్న ఒక మహిళ నడిచే ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్ లోపల ఇరుక్కుపోయింది. చాలాసేపు నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ మహిళకు విముక్తి కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేశామని అన్నారు. ఇరుక్కున్న కాలిని విడిపించేందుకు చాలాసేపు శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించి అనంతరం దగ్గర్లోని బుమ్రుంగ్రాండ్ అంతర్జాతీయ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు కారంత్. ప్రమాదానికి గల కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మా వలన ఆ మహిళకు జరిగిన నష్టానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని.. జరిగిన తప్పిదానికి మేము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తోపాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కారంత్. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నప్పటికీ కాలు తీసేయడంతో ఆమె గుండె బద్దలైందని ఒకే కాలితో జీవితాంతం ఎలాగన్న ఆలోచన తనను లోలోపలే తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
పనోడి సాయంతో పేషెంట్కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..
వైద్యులు రోగికి చికిత్స చేసేటప్పుడూ ట్రైయినింగ్ అవుత్ను నర్సు లేదా కనీసం వైద్యా విధానంపై కనీస అవగాహన ఉన్న వ్యక్తి సాయం తీసుకోవడం జరుగుతుంది. అలాకాకుండా ఏ మాత్రం వైద్యం గురించి అవగాహన లేని ఓ సాధారణ వ్యక్తి అదీకూడా ఆస్పత్రిని క్లీన్ చేసే వ్యక్తి సాయం తీసుకుంటే.. ఎవ్వరికైన వొళ్లు మండిపోతుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఒకవేళ పేషెంట్కి ఏదైన సమస్య ఎదురైతే ఆ తప్పుని సరిచేయడం అనేది అసాధ్యం. కానీ ఒక వైద్యుడు అలానే చేసి ఉద్యోగం పోగొట్టుక్నునాడు. ఈ షాకింగ్ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..జర్మనీలో మెయిన్జ్ యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రిలో ఓ వైద్యుడు ఒక పేషెంట్కి కాలు తీసేవేసే ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఐతే ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆయన ఓ క్లీనర్ సాయం తీసుకున్నాడు. పేషెంట్కి మత్తుమందు ఇచ్చిన తర్వాత అతని కాలుని పట్టుకోమని చెప్పి వైద్య పరికారలను అందించమని కోరాడు. దీంతో సదరు క్లీనర్ ఆ వైద్యుడు సర్జరీలో సాయం అందించి ఆపరేషన్ థియోటర్ నుంచి బయటకు రావడంతో గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఆ వైద్యుడిపై ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండగా, సర్జరీ చేయించుకున్న పేషెంట్కి ఎలాంటి హాని జరగలేదు. అతను సురక్షింతంగానే ఉన్నాడు. కానీ ఇలాంటి క్లిష్టమైన స్థితిలో సాయం చేసే మెడికల్ సిబ్బంది గురించి వాకబు చేయాలి లేదా ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకురావలి గానీ అలా చేయకూడదంటూ సదరు వైద్యుడికి ఆస్పత్రి యాజమాన్యం చివాట్లు పెట్టింది. ఈ ఘటన కారణంగా సదరు వైద్యుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన 2020లో జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్పై పట్టు సాధిస్తున్న రష్యా బలగాలు.. పుతిన్ అభినందనల వెల్లువ) -
బిడ్డకు జన్మనివ్వడంతోనే..వికలాంగురాలిగా మారిన ఓ తల్లి..
ఏ తల్లికి అయినా మాతృత్వం అనేది చాలా గొప్ప అనుభూతి. ఆ మధుర క్షణాలు ప్రతి తల్లికి గొప్ప జ్ఞాపకంలాంటివి. అలాంటి మాతృత్వమే ఆమెకు శాపంగా మారింది. డెలివరీ అయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. హాయిగా తన బిడ్డతో గడపాలనుకునేలోపే మళ్లీ ఆస్పత్రి పాలై వికలాంగురాలిగా మారిపోయింది. ఈ ఘటన యూఎస్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని క్రిస్టినా పచెకో అనే మహిళ రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఆమెకు సీజెరియన్ చేసి బిడ్డను తీశారు. ఆమె ఆపరేషన్ చేయించుకుని.. రెండు రోజుల అనంతరమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఐతే ఇంటికి వచ్చిన తర్వాత నుంచే నలతగా ఉండటం ప్రారంభించింది. ఆపరేషన్ వల్లే అలా అనిపిస్తుందంటూ నర్సు ఒక ఇంజక్షన్ని కూడా ఇచ్చింది. అయినా క్రిస్టినా ఇంకా అలా డల్గానే ఉంది. విపరీతమైన జ్వరంతో చాలా నీరసించిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా.. ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ ఆమె శరీరం సెప్టిక్కి గురయ్యిందని తేలింది. ఆ ఇన్ఫెక్షన్ అంతా కాళ్లు, చేతులకు వ్యాపించినట్లు వెల్లడించారు వైద్యులు. దీంతో ఆమె రెండు చేతులు, పాదాలను తొలగించాల్సి వచ్చింది. ఇలా మొత్తం ఆమె ఆస్పత్రిలోనే సుమారు నాలుగుల నెలల వరకు ఉండాల్సి వచ్చింది. ఈ మేరకు క్రిస్టినా మాట్లాడుతూ.. ఆరోజు ఇప్పటికి మర్చిపోలేనంటూ నాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగానే..అలా కళ్లు మూతబడిపోయాయని చెబుతుంది. తన భర్త ప్లీజ్ కళ్లు తెరు మన పిల్లలు అంటూ ఏడుస్తున్న మాటలు వినిపిస్తున్నా.. తాను లేవలేకపోతున్నట్లు అనిపించిందని, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తనకు తెలియదంటూ.. చెప్పకొచ్చింది. ఏది ఏమైతే తాను ఆ భయానక పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడిగలిగానూ అదే చాలు, ఇప్పుడూ నా ఇద్దరూ పిల్లలను బాగా చూసుకోవాలి అని ఆనందంగా చెబుతోంది. (చదవండి: ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!) -
ఇకపై క్యాన్సర్తో కాళ్లూ, చేతులు కోల్పోనక్కర్లేదు!
గతంలో క్యాన్సర్ కాళ్లూ లేదా చేతులకు సంబంధించిన ఎముకలకు సోకిందంటే... దాన్ని దేహం నుంచి వేరు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలా చేయడాన్ని ఇంగ్లిష్లో ‘యాంపుటేషన్’గా వ్యవహరిస్తారు. దాంతో ఇక ఆ వ్యక్తి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి రాకుండా కాపాడదామంటే క్యాన్సర్ అలా అలా ఆరోగ్యకరమైన కణజాలానికి పాకుతూ పరిస్థితిని మరింత దుర్భరం చేస్తుందన్న అంశం తెలిసిందే కదా. కానీ ఇప్పుడు సాంకేతిక పురోగతి, అధునాతన వైద్యవిజ్ఞానాల నేపథ్యంలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. గతంలో లాగా ఇప్పుడూ కాళ్లూ, చేతుల యాంపుటేషన్ లేకుండా... వాటిని రక్షించేందుకు చాలావరకు మార్గం సుగమమైంది. అందుకు దోహదపడేదే ‘లింబ్ సాల్వేజ్ సర్జరీ’. ఆ ప్రక్రియపై అవగాహన కలిగించే కథనమిది. లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటే..? క్యాన్సర్ గడ్డలనూ, వ్రణాలను శస్త్రచికిత్సతో తొలగిస్తారన్న విషయం తెలిసిందే. ఒకవేళ అది ఎముకకు పాకితే కేవలం ఆ గడ్డ (ట్యూమర్)ను మాత్రమే కాకుండా... చుట్టుపక్కల ఉండే కొంతభాగాన్ని కూడా తొలగిస్తారు. ఎందుకంటే ఒకవేళ అక్కడ పొరబాటున చిన్నపాటి క్యాన్సర్ కణం ఉన్నా... మళ్లీ అది పెరుగుతూ, వ్యాప్తిచెందుతూ నష్టం చేస్తుంది. కాలు లేదా చేయి విషయంలోనూ ఇదే జరుగుతుంది కాబట్టి గతంలో ప్రభావితమైన ప్రాంతాన్ని తొలగించడంలో భాగంగా కాలూ, చేతినీ తీసేయాల్సి వచ్చేది. అయితే అలా కాకుండా చాలా సునిశితంగా కేవలం ప్రభావితమైన గడ్డ మేరకు తొలగించి, ఎముకలోనూ ప్రభావితమైన ప్రాంతంలో కొత్త ఎముక భాగాన్ని తిరిగి అతికించేలా సర్జరీ నిర్వహించడాన్ని ‘లింబ్ సాల్వేజ్ సర్జరీ’గా చెప్పవచ్చు. మిగతా అవయవభాగాలతో పోలిస్తే ఎముక భాగంలో ఇలా కొత్త ఎముకను గ్రాఫ్ట్ చేయడం ఒకింత సవాలుతో కూడిన విషయం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి తేడా రాకుండా జాగత్తగా శస్త్రచికిత్స నిర్వహించాలి. ఇందుకోసం కొన్ని ప్రక్రియలు అవలంబించాల్సి వస్తుంది. అవి... అల్లోగ్రాఫ్ట్ బోన్ రీప్లేస్మెంట్ : అవయవదానంలో భాగంగా బ్రెయిన్డెడ్గా మృతిచెందిన వ్యక్తుల నుంచి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లు (కళ్ల విషయంలోనైతే మృతి చెందాక కూడా కొంతసమయం వరకు సేకరించవచ్చు) వంటివి సేకరించడం మామూలే. ఇదే తరహాలో... మృతిచెందిన ఆరోగ్యవంతుడి దేహం నుంచి ఎముకలను సేకరించి, బోన్బ్యాంక్లో సుస్థిరపరుస్తారు. ఇలా సుస్థిరపరచిన ఎముకను... బాధితుడి దేహం నుంచి క్యాన్సర్కు లోనైన ఎముక పరిసర భాగాన్ని తొలగించిన ప్రదేశంలో, అవసరమైన మేరకు గ్రాఫ్ట్ చేస్తూ అమర్చడమే ‘అల్లోగ్రాఫ్ట్ బోన్ రీప్లేస్మెంట్’. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు, పరిమితులు ఉన్నాయి. ఒక్కోసారి ఇలా చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు, గ్రాఫ్ట్ చేసిన చోట ఫ్రాక్చర్ కావడం వంటి సమస్యలు రావచ్చు. ఎండోప్రోస్థెసిస్ : ఈ ప్రక్రియతో లింబ్ సాల్వేజ్ చికిత్సలో పెను మార్పులు వచ్చాయి. ఎముకను రక్షించడంలో ఈ ఎండోప్రోస్థెసిస్ విప్లవాత్మకమైన భూమిక పోషిస్తోంది. ఇందులో మృతుడి శరీరం నుంచి కాకుండా... ఎలాంటి రసాయన చర్యలకు లోనుకాని లోహం (ఇనర్ట్ మెటల్)తో తయారు చేసిన... ఎముకకు ప్రత్యామ్నాయ భాగాన్ని అవసరమైన చోట అమరుస్తారు. సాధారణంగా ఆ భాగాన్ని ‘టైటానియమ్’ అనే లోహంతో రూపొందిస్తుంటారు. ఇందులోనూ కొన్ని ఇబ్బందులున్నాయి. ఇలా కృత్రిమంగా రూపొందించిన భాగాల జీవితకాలం చాలా పరిమితంగా ఏ పది లేదా పదిహేనేళ్లు ఉంటుంది. ఇది ఎండోప్రోస్థెసిస్ లో ఉండే పరిమితి. టీష్యూ రీజనరేషన్ : కాళ్లూ–చేతులను రక్షించే ఈ లింబ్ సాల్వేషన్ లో... టిష్యూ రీజనరేషన్ అన్నది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రంగం. బాధితుడి సొంత కణాలను సేకరించి, ‘ప్యూరిఫైడ్ ప్రోటీన్ గ్రోత్ ఫ్యాక్టర్’లాంటి చర్యలతోనూ, ‘సింథటిక్ మాట్రిక్స్ మెటీరియల్’ లాంటి కృత్రిమ పదార్థాలతో... బాధితుడు కోల్పోయిన అదే కణాలూ, కణజాలాలను... మళ్లీ ముందులాగే పెరిగేలా చేయడమే ఈ ‘టిష్యూ రీజనరేషన్’ ప్రక్రియ. ఇలా చేయడానికి కాలు లేదా చేతిలోని ఇతర కణజాలాలు, కండరాలూ, ఎముకలూ, కీళ్లు బలంగా ఉండాలి. ఆ తర్వాత కూడా... కృత్రిమంగా కణజాలం పెరిగిన చోట... అంతకుముందులాగే నాడీకణాల వ్యవస్థ–నరాలూ... అలాగే రక్తప్రసరణ వ్యవస్థలోని రక్తనాళాలూ అంతకుమునుపు ఉన్నట్లే పెరిగేలా చేయగలగాలి. అప్పుడే కాళ్లూ, చేతులు అంతకుముందులాగే పనిచేయగలుగుతాయి. ‘లింబ్ స్వాలేషన్’ సా«ధ్యం కాని పరిస్థితులు ►ఎముకకు క్యాన్సర్ సోకడం వల్ల అది బలహీనమై విరిగిన సందర్భంలో (పాథలాజికల్ ఫ్రాక్చర్స్). ►అంతకు మునుపు నిర్వహించిన బయాప్సీలో తేడాలు ►క్యాన్సర్ సోకిన ఎముకను క్యూరెటేజ్ చేసి తొలగించినప్పుడు ►కీమోథెరపీ తర్వాత కూడా క్యాన్సర్ ఆగకుండా అదేపనిగా విస్తరిస్తూ ఉండటం. పై కండిషన్స్ మినహా ఇప్పుడు చాలా సందర్భాల్లో కాళ్లూ–చేతులను కోల్పోవాల్సిన పరిస్థితులను వీలైనంతగా తగ్గించడమిప్పుడు సాధ్యమవుతోంది. ఇదీ ఇటీవలి కాలంలో వైద్యరంగంలో చోటు చేసుకున్న మంచి పురోగతి. డా. అజయ్ చాణక్య వల్లభనేని, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ -
రేప్ చేస్తే కాళ్లు, చేతులు తీసేయాలి
మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ల కాళ్లు, చేతులు తీసేయాలని పలువురు మహిళా ఎమ్మెల్సీలు అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద శాసన మండలిలో సోమవారం చర్చ జరిగింది. మహిళల కోసం 1090 హెల్ప్లైన్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండలికి తెలిపారు. అయితే, మహిళలపై దాడులను అరికట్టడానికి బహిరంగ చట్టాలు తేవాలని పలువురు ఎమ్మెల్సీలు కోరారు. ఈ దాడులకు పాల్పడేవాళ్లకు బెయిల్ ఇవ్వడం సరికాదని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు.