-
యథార్ధ సంఘటనల ఆధారంగా అమ్మణి
ఆరోహణం వంటి మంచి విలువలతో కూడిన ఉత్తమ కథా చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్. ఓ వైపు నటిగా నటిస్తూనే తన దర్శక తృష్ణను తీర్చుకుంటున్న లక్ష్మీరామకృష్ణన్ దర్శక శైలి ప్రత్యేకంగా ఉంటుందనడానికి ఆమె గత చిత్రాలే సాక్ష్యం. అలాంటి నటి,దర్శకురాలు తాజాగా తెరపై ఆవిష్కరించిన చిత్రం అమ్మణి. టాగ్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వెణ్.గోవింద నిర్మించిన ఈ చిత్రంలో లక్ష్మీరామకృష్ణన్తో పాటు ప్రధాన పాత్రల్లో నితిన్సత్య, సుబ్బులక్ష్మి, రోబోశంకర్, జార్జ్మరియన్, శ్రీబాలాజీ, రెజిన్ రోస్, సి.రేణుక, ఎస్.అన్న తదితరులు నటించారు. కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి వీ.శివరాజ్ సహ నిర్మాతగా వ్యవహరించారు.నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ మాట్లాడుతూ బిడ్డను 10 నెలలు కడుపులో మోసి కన్న తల్లిలా ఉంది తన పరిస్థితి అని పేర్కొన్నారు. అమ్మణి లాంటి చిత్రాలను చేయడానికి చాలా తక్కువ మంది నిర్మాతలు ఉంటారన్నారు. ఎలాంటి వ్యాపార దృక్పథం లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత వెణ్.గోవిందకు కృతజ్ఞలు చెప్పుకుంటున్నానని అన్నారు. సినిమాలో ఒక్క ఎంటర్టెయిన్ మాత్రమే కాకుండా చాలా అంశాలు ఉంటాయన్నారు. అలాంటి చిత్రాలు చేసేటప్పుడు పర్ఫెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమాజంలోని పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం అమ్మణి అని తెలిపారు. ఒక మంచి నవల చదివిన భావన అమ్మణి చిత్రం చూసినప్పుడు తనకు కలిగిందని నిర్మాత వెణ్.గోవింద పేర్కొన్నారు. వాస్తవ సంఘటనలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన అన్నారు. -
యశోద... ఇద్దరు తల్లులు!
ఠమధిర, న్యూస్లైన్: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిప్రేమ ఒకరిది... ఆరేళ్లపాటు ఆలనాపాలనాచూసి పెంచిన ప్రేమ మరొకరిది. ఇరువురు తల్లులు ఆబిడ్డ తమకే కావాలంటూ వివాదానికి దిగి పోలీసులను ఆశ్రయించారు. మధిరలో శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు.... మధిర పట్టణానికి చెందిన పరిగంజి నాగరాజు, అమ్మణ్ణ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, మూడోసారి కుమారుడు పుడతాడనే ఆశతో ఉండగా ఆకాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది. పెంచే స్తోమతలేక 20రోజుల పసికందుగా ఉన్న మూడో అమ్మాయిని తమ బంధువులైన మడుపల్లి గ్రామానికిచెందిన ఏసుపోగు బాబు, దానమ్మ దంపతులకు 2007, డిసెంబర్ 7న గ్రామస్తుల సమక్షం లో అనధికారికంగా దత్తత ఇచ్చారు. ఈ సంతోషంలో బాబు దంపతులు నాగరాజు దంపతులకు రూ.5వేలు బహుమతిగా అందజేశారు. ఆరు సంవత్సరాలనుంచి ఎటువంటి వివాదం లేకుండా ఇరుకుటుంబాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పెంచిన తల్లిదండ్రులు పాప పేరుతో రూ.20వేలు బ్యాంకులో డిపాజిట్చేశారు. ఆ పాపకు యశోద అని పేరు పెట్టుకుని గత ఆరుసంవత్సరాలుగా ఆలనాపాలనాచూస్తూ ప్రేమానురాగాలు పెంచుకున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా కన్న తల్లిదండ్రులు శనివారం ఆ గ్రామానికి వె ళ్లి తమకుమార్తెను తమకే ఇవ్వాలని బలవంతంగా తీసుకుని వెళ్లారు. ఇన్ని సంవత్సరాలు యశోదను పెంచిన బాబుదంపతులు ఈ పరిణామంతో కలతచెంది స్థానిక పెద్దలను ఆశ్రయించారు. అయితే పెద్ద మనుషులు సైతం ఏమీ చేయలేక నిస్సహాయత వ్యక్తంచేశారు. ఈ క్రమంలో వారు టౌన్పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న ట్రైనీ డీఎస్పీ ఎస్. మల్లారెడ్డి ఇరుకుటుంబాల వాదనను విని దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు ఉండాలన్నారు. అవి లేనందున కన్న తల్లిదండ్రులకే యశోదను అప్పగించాలని పెంచిన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ద్వారా చెప్పి ఆపాపను ఇప్పించారు. ఈ క్రమంలో కన్నతల్లిదండ్రులు ఆపాపను తీసుకువెళుతుండటంతో బాబుదంపతులు బోరున విలపించారు. పాప సైతం కన్నతల్లిదండ్రుల వద్దనుంచి విడిపించుకుని, పెనుగులాడుతూ పెంచిన తల్లివద్దకు వెళ్లేందుకు ప్రయత్నించి రోదించిన తీరు పలువురి హృదయాలను ద్రవింపచేసింది. అమ్మా... అమ్మా...అంటూ ఆ చిన్నారి విలపిస్తుండటం తో సమీపంలో ఉన్న పోలీసులు, పట్టణ ప్రజలు సైతం కంటతడి పెట్టారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
Advertisement