breaking news
Amaranth
-
ప్రేమ పేరుతో విద్యార్థిని నమ్మించి...
అనంతపురం : అనంతపురం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థిని నమ్మించి... వంచించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన కార్తీక్ అనే యువకుడు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఆ క్రమంలో ఆమెకు తెలియకుండా సెల్ ఫోన్తో నగ్నంగా ఫొటోలు తీసి వాటిని తన స్నేహితుడు అమర్నాథ్కి చూపించాడు. ఆ క్రమంలో ఇద్దరు కలసి సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. గత కొంత కాలంగా ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం సాగిస్తున్నారు. వాళ్ల వేధింపులు తాళలేక సదరు విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రెస్క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గంలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని.. ఈ తీరును జీర్జించుకోలేక ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలకు దూరంగా ఉంటున్నట్లు టీయూడబ్ల్యూ జే నేతలు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, దేవుల పల్లి అమర్ బషీర్ బాగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ కు సోమాజీ గూడలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కేటాయిస్తూ.. 1995లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని.. యూనియన్ వారసత్వంగా ఉన్న ప్రెస్ క్లబ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీయూడబ్ల్యూ జేకి అనుబంధంగానే కొనసాగాల్సి ఉంటుందని అన్నారు. కార్యవర్గంలోని కొందరు వ్యక్తులు జర్నలిస్టుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చట్టబద్దంగా ప్రెస్ క్లబ్ కు సంక్రమించిన అధికారాలను కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రెస్క్లబ్ పాలకమండలి పదవీకాలం ముగియగా, స్వర్ణోత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 50 సంవత్సరాలు ప్రెస్క్లబ్ను తీర్చిదిద్దిన వారిని కనీసం సంప్రదించకుండా, ప్రెస్క్లబ్కు మాతృసంస్థగా ఉన్న యూనియన్ నేతలను పరిగణలోకి తీసుకోకుండా స్వర్ణోత్సవాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 1965 మే 25న ఏర్పాటైన ప్రెస్క్లబ్కు ఆరునెలల తరువాత స్వర్ణోత్సవాలు నిర్వహించ డాన్ని తప్పుపట్టారు. ఈ సమావేశంలో ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు అమరనాథ్, ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, హెచ్యూజే అధ్యక్షుడు కోటిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రెస్క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
-
తేనియ రుచుల పానీయాలు!
వేసవి వేడితో జీవితం రసహీనమవుతుంటే దాన్ని మళ్లీ రసభరితం చేసేవే పానీయాలు. నిమ్మకాయ మొజిటోతో వదులుతుంది నీరసం. క్రమం తప్పక తాగితే ఊరుతుంది జఠర రసం. అప్పటివరకూ తోటకూర కాడల్లా సోలిపోయినా... ఆ తర్వాత మాత్రం ఒళ్లంతా చురుకు నిండిన పాదరసం. అందుకే ఈ మొజిటోను గెజిట్లో చేర్చాలనిపించకపోతే మీలో ‘రస’హృదయం అంతగా లేదనుకోవాల్సిందే. ఇక ఎండల వేడికి, మంటల గాడ్పుకు మీరు డస్సిపోతేసేద దీర్చే పానీయమవుతుంది పంజాబీ లస్సీ! మహా ఫ్రూట్పంచ్ మహత్యం అంతా ఇంతా కాదు... నిస్తేజాలకూ, నిరుత్సాహాలకూ అది ఇంచుకు ఒకటి చొప్పున ఇస్తుందో పంచ్. వెరసి... పానీయాలంటే మరేమిటో కాదు... స్వరూపం మార్చుకున్న తేనియలు. మొజిటో కావలసినవి: నిమ్మకాయ - 1 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి) పుదీనా ఆకులు - 20 (రసం చేయడానికి, గార్నిషింగ్కి) పంచదార - 2 టేబుల్ స్పూన్లు ఐస్ - కొద్దిగా సోడా - 100 మి.లీ. పంచదార - 2 టీ స్పూన్లు తయారీ: ఒక గిన్నెలో పుదీనా ఆకులు, చిన్నగా కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు, పంచదార వేయాలి. కవ్వం లాంటి దానితో వాటి మీద గట్టిగా ఒత్తి, కవ్వం తీసేసి, ఐస్ ముక్కలు జత చేయాలి. సోడా పోసి బాగా కలపాలి. పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. పార్టీ ఫ్రూట్ పంచ్ కావలసినవి: ఆపిల్ - 2 పుచ్చకాయ ముక్కలు - రెండు కప్పులు ద్రాక్షపళ్లు - 10 పైనాపిల్- ఒక ముక్క కమలాపండు తొనలు - 2 పుదీనా ఆకులు - 6 తయారీ: ఆపిల్ తొక్కు తీసి ముక్కలు చేసుకోవాలి పుచ్చకాయ ముక్కలలో గింజలు వేరు చేయాలి కమలాపండు తొనలు బాగు చేసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి అన్ని పండ్ల ముక్కలు ఒకదాని తరవాత ఒకటి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ద్రాక్షపళ్లు జత చేసి మెత్తగా చేసి రసం వేరు చేయాలి పైనాపిల్ ముక్కలు, కమలా తొనలు, పుదీనా ఆకులను చిన్నచిన్న ముక్కలుగా చేసి, గ్లాసులలో వేయాలి తయారుచేసి ఉంచుకున్న జ్యూస్ను గ్లాసులలో పోసి సర్వ్ చేయాలి. స్వీట్ పంజాబీ లస్సీ కావలసినవి: పెరుగు - 5 కప్పులు పంచదార - 10 టేబుల్ స్పూన్లు ఏలకుల పొడి - అర టీ స్పూను రోజ్ వాటర్ - టీ స్పూను చల్లటి పాలు - అర కప్పు కుంకుమపువ్వు - చిటికెడు బాదం పప్పులు - 7 (సన్నగా తురుముకోవాలి) ఐస్ ముక్కలు - తగినన్ని తయారీ: ఒక పాత్రలో పెరుగు, పంచదార, ఏలకుల పొడి, నీళ్లు, వేసి అన్ని పదార్థాలు కలిసే వరకు గిలక్కొట్టి, గ్లాసులలో పోయాలి రోజ్వాటర్ జత చేయాలి గిన్నెలో చల్లటి పాలు, కుంకుమపువ్వు వేసి కలిపి, గ్లాసులో ఉన్న పెరుగు మిశ్రమానికి జత చేయాలి ఐస్ ముక్కలు వేసి కలపాలి బాదం తురుము జత చేసి సర్వ్ చేయాలి. ఇండియన్ సమ్మర్ కావలసినవి: పంచదార - టేబుల్ స్పూను నీళ్లు - 3 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు చింతపండు రసం - టీ స్పూను (చిక్కగా ఉండాలి) ఐస్ - అర కప్పు (మెత్తగా పొడి చేయాలి) కమలాపండు తొనలు - 2 పైనాపిల్ ముక్కలు - 2 తయారీ: ఒక పాత్రలో... పంచదార, నీళ్లు, నిమ్మరసం, చింతపండు రసం, ఐస్ వేసి అన్నీ కలిసే వరకు కలపాలి. గ్లాసులలో కమలాపండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేయాలి. తయారుచేసి ఉంచుకున్న రసం పోసి చల్లగా సర్వ్ చేయాలి. ఫలూదా... కావలసినవి: పాలు - 2 కప్పులు ఫలూదా సేవ్ - 1 ప్యాకెట్ (సూపర్ మార్కెట్లో లభిస్తుంది) రోజ్ వాటర్ - 2 టీ స్పూన్లు నానబెట్టిన సబ్జా గింజలు - అర టీ స్పూను వెనిలా ఐస్ క్రీమ్ - కొద్దిగా తయారీ: ఒక పాత్రలో తగినన్ని నీళ్లు, ఫలూదా సేవ్ వేసి సుమారు 20 నిమిషాలు ఉడికించి, ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి గోరువెచ్చగా ఉన్న పాలలో ఫలూదా సేవ్ వేసి సన్న మంట మీద సుమారు 15 నిమిషాలు ఉంచాలి ఉడికించుకున్న సేవ్ చల్లబడటానికి ఐస్ జత చేయాలి సేవ్ను గ్లాసులలో వేసి, రోజ్ వాటర్ జత చేయాలి నానబెట్టుకున్న సబ్జా గింజలు వేయాలి పాలు జత చేయాలి వెనిలా ఐస్క్రీమ్తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. మామిడి-పుచ్చకాయ రసం కావలసినవి: మామిడిపండు - 1 (బాగా పండినది) పుచ్చకాయ ముక్కలు - కప్పు నీళ్లు - 2 కప్పులు ఐస్ - అర కప్పు (మెత్తగా పొడి చేయాలి) పంచదార - 4 టీ స్పూన్లు స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్ - 2 స్కూపులు తయారీ: మామిడిపండు తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పుచ్చకాయ ముక్కలు చేసి గింజలు వేరు చేయాలి మిక్సీలో మామిడిపండు ముక్కలు, 2 టీ స్పూన్ల పంచదార, కప్పు నీళ్లు పోసి మెత్తగా చేసి పాత్రలోకి తీసుకోవాలి. పుచ్చకాయ ముక్కలు, కప్పు నీళ్లు, 2 టీ స్పూన్ల పంచదార, ఐస్ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక గ్లాసులో ముందుగా పుచ్చకాయ పల్ప్ వేసి, ఆ పైన మామిడిపండు గుజ్జు వేయాలి స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి