-
ఆ రోగాలకు ఫార్మా ఇండస్ట్రీలో శాశ్వత పరిష్కారం ఉందా?
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్య విధానం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి భారీ విమర్శలు మూటగట్టుకున్న తర్వాత క్షమాపణలు చెప్పిన యోగా గురు రాందేవ్ బాబా సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) 25 ప్రశ్నలు సంధించారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటివాటికి శాశ్వత పరిష్కారం అల్లోపతి వద్ద ఉందా అంటూ ప్రారంభించారు. అల్లోపతికి కేవలం 200 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందన్నారు. థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఆస్తమా వంటి రోగాలకు ఫార్మా ఇండస్ట్రీలో శాశ్వత పరిష్కారం ఉందా అని ప్రశ్నించారు. కొలెస్టరాల్కు, మైగ్రేన్కు, అమ్నీసియాకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని చికిత్స ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గుండెలో ఏర్పడే రంధ్రాలకు నొప్పి లేకుండా చికిత్స చేయగలరా అని అడిగారు. వయస్సును వెనక్కు మళ్లేలా చేసి హీమోగ్లోబిన్ను పెంచే చికిత్స ఉందా అన్నారు. అల్లోపతి అన్నింటికి సమాధానం ఇస్తే డాక్టర్లకు ఏ రోగమూ రాకూడదని అభిప్రాయపడ్డారు. -
చదివింది హోమియోపతి.. చేసేది అల్లోపతి..
భూపాలపల్లి, న్యూస్లైన్ : భూపాలపల్లి పట్టణంలో నకిలీ వైద్యులు యథేచ్ఛగా తమ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. సరిైయెున అర్హ తలు లేకుండానే హంగుఆర్భాటాలతో ఏకంగా నర్సిం హోంలు ప్రారంభించి నడిపిస్తున్నారు. రోగుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ వారిని గుల్ల చేస్తున్నారు. చదివింది.. ఒక కోర్సు అయితే మరో కోర్సుకు సంబంధించిన మందులు రాస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భూపాలపల్లి పట్టణంలో సుమారు 10కిపైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఇందులో రెండింటిలో మాత్రమే ఎంబీబీఎస్ వైద్యులు ఉన్నారు. మిగతా ఆస్పత్రుల్లో వైద్యులంతా బీహెచ్ఎంఎస్(హోమియోపతి), బీఏఎంఎస్(ఆయుర్వేదం) విద్యను అభ్యసించినవారు. అయి నా వీరంతా వచ్చీరాని అల్లోపతి(ఇంగ్లీషు) వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోగులకు సరిగ్గా ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఇక మాతో కాదు హన్మకొండకు తీసుకెళ్లండి అంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 100 మందికిపైగా రోగులను పరీక్షిస్తూ ఒక్కో రోగికి సుమారు రూ800 నుంచి వేయి వరకు విలువ చేసే మందులు రాస్తూ నిలువు దోపిడి చేస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి అవసరం లేకున్నా రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేగాక ఏకంగా ప్రసవాలు, శస్త్ర చికిత్స సైతం చేస్తున్నట్లు తెలిసిం ది. స్థానిక బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ వైద్యులు ఇతర ప్రాంతాలకు చెందిన ఎంబీబీఎస్ వైద్యుల పేరిట తమ ఆస్పత్రులను రిజిస్ట్రేషన్ చేయించుకుని నిబంధనలకు విరుద్ధంగా వీరే అల్లోపతి వైద్యం కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకుగాను సదరు ఎంబీబీఎస్ వైద్యుడికి ఏటా సుమారు రూ60 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. సీజ్ చేసినా ఎలా తెరుచుకున్నాయి.. 2012, మే 11న భూపాలపల్లి పట్టణంలోని పలు ఆస్పత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సాంబశివరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో సాయి క్లినిక్లోని సాంబ య్య అనే వైద్యుడు హోమియోపతి విద్యనభ్యసించి అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు ధ్రువీకరించారు. అంతేగాక ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ మిషన్, ఈసీజీ, ఎక్స్రే, ప్లేట్లెట్ కౌంటింగ్ మిషన్లకు ఎలాంటి అనుమతులు లేకపోగా అర్హత కలిగిన సిబ్బంది లేరు. దీంతో అదేరోజు సాయి క్లినిక్ ఆస్పత్రిని డీఎంఅండ్హెచ్ఓ సాంబశివరావు సీజ్ చేశారు. అయితే అదే వైద్యుడు సరిగ్గా నెల రోజులు కూడా తిరగకముందే డీఎంఅండ్హెచ్ఓ సీజ్ చేసిన తాళాలను పగులగొట్టి ఆస్పత్రిని తెరిచి వైద్యం చేశారు. ఇటీవలే తన ఆస్పత్రిని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల మూడంతస్థుల సొంత భవనంలోకి మార్చుకున్నారు. ఇక్కడ కూడా అనుమతి లేని యంత్రాలను వాడుతూ అదే సిబ్బందిని నియమించుకుని అల్లోపతి వైద్యం కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీజ్ అయిన ఆస్పత్రు ల నిర్వాహకులు ఓ ఉన్నతాధికారికి భారీగా ముడుపులు అందజేసి ఆస్పత్రులను తిరిగి తెరిచినట్లు ప్రచారం జరుగుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement