breaking news
All Stars T20
-
ఉత్కంఠ పోరు.. వారియర్స్ జోరు
లాస్ ఏంజెలెస్: ఆల్ స్టార్ టి20 క్రికెట్ సిరీస్ ను షేన్ వార్న్ సేన 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఉత్యంఠభరితంగా జరిగిన చివరి మ్యాచ్ లో సచిన్ బ్లాస్టర్స్ పై వార్న్ వారియర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్లాస్టర్స్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని మరొక బంతి మిగులుండగానే చేరుకుంది. 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేసింది. చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో షేన్ వార్న్ సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. సంగక్కర 42 (21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కల్లిస్ 47 (23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), పాంటింగ్ 43 (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. సైమండ్స్ 31, హేడన్ 12, జాంటి రోడ్స్ 17 పరుగులు చేశారు. స్వాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆంబ్రోస్, హూపర్, సెహ్వాగ్ తలో వికెట్ తీశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సచిన్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. సచిన్ 56, గంగూలీ 50 పరుగులు చేశారు. -
చెలరేగిన సచిన్, గంగూలీ
లాస్ ఏంజెలెస్: ఆల్ స్టార్ టి20 క్రికెట్ సిరీస్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ చెలరేగారు. వార్న్ వారియర్స్ తో జరుగుతున్న మూడో మ్యాచ్ లో అర్ధసెంచరీలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సచిన్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. వారియర్స్ కు 220 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. సచిన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు సాధించాడు. గంగూలీ 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. సెహ్వాగ్ 27, జయవర్ధనే 41, హూపర్ 33 పరుగులు సాధించారు. వారియర్స్ బౌలర్లలో వెటోరి 3 వికెట్లు పడగొట్టాడు. సైమండ్స్, వాల్ష్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ ల్లో వారియర్స్ గెలిచింది.