-
కరోనా: వైద్యుడి సాహసం.. ప్రాణాలను పణంగా పెట్టి
సాక్షి, న్యూఢిల్లీ : తమను తాము రక్షించుకోవడమే సవాలుగా మారిన ప్రస్తుత కరోనా కాలంలో ఓ వైద్యుడు చేసిన సాహసం అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. తన ప్రాణాలను పణంగా పెట్టి.. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి ప్రాణ వాయువును అందించారు. ఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి చెందిన జహీద్ అబ్దుల్ మజీద్ అనే వైద్యుడు ట్రామా సెంటర్లో విధులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగిని రక్షించే క్రమంలో తన వ్యక్తిగత భద్రతను పూర్తిగా తొలగించారు. (కరోనా: ఒక్కడి ద్వారా 20 మందికి..!) వివరాల ప్రకారం.. కరోనాతో బాధపడుతున్న ఓ రోగిని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించారు. ఈ క్రమంలోనే అంబులెన్స్లో రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. దీనికి గమనించిన మసీద్.. రోగికి శ్వాస అందడం కోసం గొంతులో వేసిన గొట్టం బయటకు వచ్చినట్లు గుర్తించారు. పక్కనున్న వైద్యులకు సమాచారం అందించగా.. బాధితుడు కరోనా రోగి కావడంతో అతన్ని ముట్టుకునేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. మసీద్ పీపీఈ (మాస్క్, కళ్ల అద్దాలు, ముఖ కవచం) వంటి భద్రతను కలిగి ఉండటంతో అతనికి సహాయం చేయడానికి ఇబ్బందిగా మారింది. (లాక్డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదు!) ఇంతలోనే శ్వాస అందక రోగి పరిస్థితి విషయంగా మారుతుండటంతో మసీద్ చలించిపోయారు. రోగి నుంచి భారీగా వైరస్ అంటుకునే ప్రమాదం ఉందని తెలిసినా ఏమాత్రం బయపడలేదు. పీపీఈ కిట్ను పూర్తిగా తొలిగించి శ్వాస అందించే గొట్టాన్ని సరిచేసి అతనికి ప్రాణం పోశారు. అనంతరం వైద్యుల సూచనమేరకు 14 రోజుల పాటు క్వారెంటైన్కు వెళ్లారు. పరీక్షల్లోనూ అతనికి కరోనా నెగటివ్గా వచ్చింది. మసీదు సాహసంపై ఎయిమ్స్ వైద్యులతో పాటు సోషల్ మీడియాలో సైతం ప్రశంసలు అందుతున్నాయి. -
త్వరలో ఎయిమ్స్కు వీణావాణి
* అనుమతులు వచ్చిన తర్వాత తరలింపు * ఎయిమ్స్లో ఆపరేషన్ సాధ్యమే: వైద్య బృందం సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిలను త్వరలో ఢిల్లీ తీసుకెళ్లి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) వైద్య బృందం తెలిపింది. వారం రోజుల పాటు అక్కడే ఉంచుకుని రక్తనాళాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఎయిమ్స్ న్యూరోసర్జన్స్ డాక్టర్ అశిష్ సూరి, డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్షన్ సర్జన్ డాక్టర్ మనీష్ సింగాల్ బృందం నిలోఫర్ ఆస్పత్రికి చేరుకుని వీణావాణిల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. సుమారు రెండు గంటల పాటు పిల్లలతో గడిపారు. వీణావాణిలను ఎయిమ్స్కు తీసుకెళ్లి వారం రోజుల పాటు అక్కడే ఉంచి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే శస్త్రచికిత్సపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎయిమ్స్లో శస్త్రచికిత్స సాధ్యమేనని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్ డెరైక్టర్కు లేఖ రాయాల్సి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయి.. ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత వీణావాణిలను ఢిల్లీ తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement