airbase
-
రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
మాస్కో: ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్ దాడులతో విరుచుకు పడింది. రష్యన్ భూభాగంలోని ఐదు ఎయిర్బేస్(Airbase)లపై ఉక్రెయిన్ దాడి చేసింది. దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ‘కైవ్ (ఉక్రెయిన్)ప్రభుత్వం.. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవనోవో, రియాజాన్,అముర్ ప్రాంతాలలోని వైమానిక స్థావరాలపై ఎఫ్పీవీ డ్రోన్లను ఉపయోగించి, ఉగ్ర దాడికి పాల్పడింది. అయితే తమ సైన్యం ఆ ఉగ్ర దాడులను తిప్పికొట్టింది. సైనికులకు, పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ దాడుల్లో పాల్గొన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది.ఈ దాడులలో తమ విమానాలు కొన్ని ఆహుతయ్యాయని రష్యా తెలిపింది. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్ ప్రాంతాలలోని సైనిక వైమానిక స్థావరాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుండి ఎఫ్పీవీ డ్రోన్(FPV drone)లను ప్రయోగించడంతో పలు విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఆ తరువాత మంటలు ఆరిపోయాయని రష్యా పేర్కొంది. అయితే తాము చేపట్టిన ఈ దాడిలో రష్యాకు చెందిన 40 విమానాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్బీయూ) ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిందని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది.రష్యా- ఉక్రెయిన్లు ఇస్తాంబుల్లో రెండవ దఫా శాంతి చర్చలు ప్రారంభించనున్న తరుణంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్ ప్రచురణ సంస్థ ప్రావ్దా అందించిన వివరాల ప్రకారం ఉక్రెయిన్ ఈ దాడులకు ఏడాదిగా ప్లాన్ చేసింది. డ్రోన్లు బయటకు దూసుకువచ్చి, లక్ష్యంగా ఎంచుకున్న వైమానిక స్థావరాలపై దాడులు చేశాయి. క్షిపణుల ఆయుధాగారం లేని ఉక్రెయిన్ దానికి బదులుగా దాడులకు తెగబడేందుకు భారీగా డ్రోన్లను సమకూర్చుకుంది. ఇది కూడా చదవండి: దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు -
ఔను ఆ రోజు జరిగింది ఇదే.. నిజం ఒప్పుకున్న పాక్
భారత ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని పాకిస్థాన్.. పచ్చి అబద్ధాలతో నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం జరగలేదంటూ బీరాలు పలికిన పాక్.. నిజాలను ఒక్కొక్కటిగా ఒప్పుకుంటోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ (Shehbaz Sharif) భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని స్వయంగా ఆయనే చెప్పారు.భారత్ రావల్పిండిలోని ఎయిర్బేస్తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసిదని.. తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందంటూ షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. పాక్ మిత్ర దేశమైన అజర్ బైజాన్లో పర్యటిస్తున్న షెహ్బాజ్ షరీఫ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.మే 10న ఉదయం ప్రార్థనల తర్వాత భారత్పై దాడి చేయాలని పాక్ ప్లాన్ చేసింది. అయితే, పాకిస్తాన్ చర్య తీసుకునే ముందే భారత్ మరో బ్రహ్మోస్ను ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించిందని షెహ్బాజ్ చెప్పుకొచ్చారు. కాగా, దౌత్య యుద్ధం దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చిన సంగతి తెలిసిందే. భారత్తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని మూడు రోజుల క్రితం కీలక ప్రకటన చేశారు. కశ్మీర్ సహా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ వేదికగా ప్రకటించారాయన. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిల పక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో.. ఇరాన్ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ శాంతి ప్రస్తావన తెస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘భారత్తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీర్, ఉగ్రవాదంపై పోరు, నీటి పంపకం, వాణిజ్యం.. ఇలా అన్ని వివాదాలపై ఇరు దేశాలం సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్ గనుక సమ్మతిస్తే.. మేం శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్లకు తెలియజేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని షెహ్బాజ్ షరీఫ్ ప్రకటనను పాక్ పత్రిక ది డాన్ ప్రముఖంగా ప్రచురించింది. -
‘ట్రైలర్ మాత్రమే చూశారు.. పాక్ తీరు మారకపోతే పూర్తి సినిమా చూపిస్తాం’
గాంధీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) ముగియలేదు. ట్రైలర్ మాత్రమే చూశారు. పాక్ తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తాం’ అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (rajnath singh) హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం గుజరాత్లోని భుజ్ ఎయిర్ బేస్లో ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్తో రాజ్నాథ్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం, ఆయన మీడియా మాట్లాడారు. పాకిస్తాన్పై భారత్ విజయానికి ఎయిర్బేస్ సాక్ష్యం.పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ను ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశాం. బ్రహ్మోస్ మిస్సైల్ పవరేంటో పాకిస్తాన్కు చూపించాం. బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. పాకిస్తాన్ ముఖ్య ఉగ్ర కేంద్రాన్ని ధ్వంసం చేశాం. నయా భారత్ ఎంటో ప్రపంచానికి తెలిసింది.మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహార్కు పాక్ రూ.14కోట్లు ఇచ్చింది. ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం. మన వాయిసేన అసమాన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థులను వణికించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఫండింగ్ చేస్తోంది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే.. పాక్కు అసలు సినిమా ముందుంది’ అంటూ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. Addressing the brave Air Warriors at the Air Force Station in Bhuj (Gujarat). https://t.co/3TGhBlyxFH— Rajnath Singh (@rajnathsingh) May 16, 2025 -
భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)
-
#AeroIndia2025 : ఆకాశంలో అద్భుతాలు చేసిన యుద్ధ విమానాలు (ఫోటోలు)
-
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
లద్దాఖ్ దగ్గరలో చైనా కొత్త ఎయిర్బేస్
న్యూఢిల్లీ: సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారకముందే చైనా మరో దుశ్చర్యకు దిగుతోంది. లద్దాఖ్లోని షాక్చే వద్ద చైనా నూతనంగా ఎయిర్బేస్ను అభివృద్ది చేస్తున్న విషయాన్ని భారతీయ ఏజెన్సీలు గమనించాయి. ఇది పూర్తయితే లైన్ఆఫ్ కంట్రోల్ పొడుగునా చైనాకు వైమానిక మద్దతు పెరగనుంది. షాక్చేలోని ఎయిర్బేస్ను పూర్తిస్థాయి మిలటరీ బేస్గా చైనా రూపుదిద్దుతోందని, ఫైటర్ ఆపరేషన్స్కు అనుకూలంగా దీన్ని మారుస్తోందని భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఓసీ వద్ద గతేడాదిగా నెలకొన్న ఉద్రిక్తతలను ఈ చర్య మరింత ఎగదోస్తుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. యుద్దమే వస్తే తమ కన్నా వేగంగా భారతీయ వైమానిక దళం ఎల్ఓసీ వద్దకు చేరుకుంటుందని చైనా ఎప్పుడో గమనించింది. ఇందుకు సమాధానంగానే షాక్చే వద్ద మిలటరీ ఎయిర్బేస్ను అభివృద్ధి చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఖష్గర్, హోగాన్ మధ్యలో ఒక కొత్త బేస్ను కూడా చైనా నిర్మిస్తోంది. గతేడాది నుంచి సరిహద్దుకు దగ్గరలోని 7 చైనా ఎయిర్బేస్లపై భారతీయ ఏజెన్సీలు కన్నేసి ఉంచాయి. ఇటీవల కాలంలో ఈ బేస్లను మరింతగా బలోపేతం చేస్తున్నట్లు గమనించాయి. -
యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం
ఇస్లామాబాద్: సరిహద్దుల్లోని యుద్ధ విమానాలను భారత్ తరలిస్తే తప్ప తమ దేశం గుండా వాణిజ్య విమానాలకు గగనతలం తెరవబోమని పాకిస్తాన్ విమానయాన కార్యదర్శి షారుక్ నుస్రత్ స్పష్టంచేశారు. పుల్వామా తీవ్రవాద దాడి అనంతరం పాక్లోని బాలాకోట్లో జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 26 తర్వాత నుంచి పాక్ తన గగనతలంపైనుంచి భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. నుస్రత్ ఆదేశాలతో పాక్ విమానయాన శాఖకు చెందిన సెనేట్ స్టాండింగ్ కమిటీ భారత అధికారులకు సమాచారమిచ్చింది. ‘పాక్ గగనతలం తెరవాలని భారత ప్రభుత్వం సంప్రదించింది. మేం అందుకు సిద్ధం. అయితే ముందుగా సరిహద్దుల్లోని వైమానిక స్థావరాల నుంచి యుద్ధ విమానాలను భారత్ ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని నుస్రత్ పేర్కొన్నారు. గగనతలం తెరవడంపై ఓ పాక్ సీనియర్ అధికారి స్పందించడం ఇదే మొదటిసారి. పాక్ గగనతలం మూసివేతపై ఆంక్షలు జూలై 12 వరకు పొడిగించారు. ఏదిఏమైనా పాక్ గగనతల మూసివేతతో భారత విమానయాన పరిశ్రమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. పాక్ గగనతల మూసివేత కారణంగా దూరపు మార్గాల్లో విమానాలు ప్రయాణించడం ద్వారా ఎయిరిండియా రూ.430 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. -
గుజరాత్ సరిహద్దులో పాక్ ఎయిర్ బేస్ కలకలం
న్యూఢిల్లీ : గుజరాత్ సరిహద్దు వెంబడి సింధ్ ప్రోవిన్స్లో భోలారి ప్రాంతంలో పాకిస్తాన్ ఆధునిక ఎయిర్బేస్ను అభివృద్ధి చేసింది. ఈ ఎయిర్బేస్లో పాకిస్తాన్ తన చైనా జేఎఫ్-17 యుద్ధ విమానాలను మోహరిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎయిర్బేస్ గత కొద్దికాలంగా పనిచేస్తున్నా యుద్ధ విమానాల విన్యాసాలు ఈ స్థాయిలో జరగడంఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత వాయుసేనకు దీటుగా పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ పెద్దసంఖ్యలో చైనా నుంచి జేఎఫ్-17 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది. ఇదే ఎయిర్బేస్కు చేరువలోనే పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (నేవీ) కమాండోలను సైతం రంగంలోకి దింపింది. సముద్ర మార్గం గుండా భారత్లో దాడులకు లష్కరే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఎయిర్బేస్ను వాడతారే ప్రచారం సాగుతున్న క్రమంలో కమాండోలను ఇక్కడికి రప్పించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ సన్నాహాలకు దీటుగా గుజరాత్ బోర్డర్లోని దీసా వద్ద యుద్ధ ఎయిర్బేస్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే అక్కడ రన్వే ఏర్పాటు, యుద్ధ విమానాల తరలింపు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు కనీసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. -
సిరియా సంక్షోభం.. మళ్లీ వైమానిక దాడులు..!
డమస్కస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో తాజాగా సోమవారం ఉదయం వైమానిక దాడులు జరిగాయి. ప్రభుత్వ ఆధ్యర్యంలోని తాయ్ఫుర్ వైమానిక స్థావరం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. హామ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ వైమానిక స్థావరంపై జరిగిన వైమానిక క్షిపణి దాడుల్లో పలువురు చనిపోయారని, పెద్దసంఖ్యలో గాయాలపాలయ్యారని ప్రభుత్వ మీడియా సంస్థ సనా తెలిపింది. సిరియా ప్రభుత్వ వైమానిక స్థావరంపై అమెరికా సైన్యమే వైమానిక దాడులు జరిపినట్టు భావిస్తున్నారు. అయితే, అమెరికా ఈ వార్తలను ఖండించింది. తాము వైమానిక దాడులు నిర్వహించలేదని స్పష్టం చేసింది. తాజాగా తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై విషరసాయనిక దాడులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 42మందిని పొట్టనబెట్టుకొని, వందలమంది గాయపడటానికి కారణమైన గ్యాస్ దాడిపై అంతర్జాతీయ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వం తన సొంత ప్రజల్నే చంపుకుంటుందని మండిపడ్డాయి. సిరియా అధ్యక్షుడు అసద్ జంతువులాంటి వాడని, అతనితోపాటు అతనికి అండగా నిలుస్తున్న రష్యా, ఇరాన్ ఈ గ్యాస్ భారీ మూల్యం చెల్లించకతప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
చైనా చేష్టలకు భారత కౌంటర్ షురూ
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కవ్వింపు చర్యలకు భారత సైన్యం కౌంటర్ యాక్షన్ మొదలుపెట్టేసింది. డెహ్రాడూన్(ఉత్తరాఖండ్)లోని జాలీ గ్రాంట్ ఎయిర్పోర్టును భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తమ ఆధీనంలోకి తీసేసుకుంది. ఇక్కడి నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలతో గస్తీని నిర్వహణకు సిద్ధమైపోయింది. ‘రెండు సుఖోయ్(సు-30 ఎంకేఐ) విమానాలు ఫిబ్రవరి 19వ తేదీ ఉదయాన్నే బయలుదేరుతాయి. రెండు రోజులపాటు గస్తీ నిర్వహించి 20వ తేదీ సాయంత్రం తిరిగి ఎయిర్ బేస్కు చేరుకుంటాయి. సినో(చైనా)-భారత్ సరిహద్దు వెంబడి ఇవి క్షుణ్ణంగా తనిఖీలు చేపడతాయి. కొన్ని రోజులకు దీనిని దీర్ఘకాలికంగా కొనసాగిస్తాం’ అని ఐఏఎఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది మాములు చర్యే అని ప్రకటించుకున్నప్పటికీ.. దీనివెనుక ముందు చూపు ఉన్నట్లు స్పష్టమౌతోంది. రెండు దేశాల మధ్య దాదాపు 4000 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంది. భవిష్యత్తులో చైనా సరిహద్దు(గగనతలం గుండా) ఉల్లంఘనకు పాల్పడితే అరుణాచల్ ప్రదేశ్తోపాటు, ఉత్తరాఖండ్ ప్రాంతాలు లక్ష్యాలుగా మారే అవకాశం ఉంది. అంతేకాదు గతంలో భారత సరిహద్దుల దాకా చైనా యుద్ధ విమానాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణాన అయినా దాడులు జరిగే అవకాశం ఉందని భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే ధాటిగా సమాధానం ఇచ్చేందుకే భారత సైన్యం ఈ ఎయిర్ బేస్ను నెలకొల్పినట్లు అధికారి ఒకరు స్పష్టం చేశారు. -
దొంగదెబ్బ కొడుతున్న చైనా
న్యూఢిల్లీ : పాకిస్తాన్-చైనా మధ్య ఆర్థిక, సైనిక సంబంధాలు రోజురోజుకూ బలోపేతమవుతున్నాయి. భారత్కు వ్యతిరేకంగా డ్రాగన్ కంట్రీ పాక్కు అన్ని రకాల సహకారాలు అందిస్తోంది. తాజాగా పొరుగుదేశానికి అవసరమైన సైనిక సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో భాగంగా సైనికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కమ్యూనిస్ట్ కంట్రీ అందిస్తోంది. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకూ ఉన్న సరిహద్దు వెంబడి.. పాకిస్తాన్ సైనికుల కోసం చైనా అత్యాధునిక బంకర్లను నిర్మిస్తోంది. కీలకమైన రాజస్తాన్ సరిహద్దు వద్ద ఎయిర్ బేస్ను ఆధునీకరించడంతో పాటు, 350 స్టోన్ బంకర్లను డ్రాగన్ దేశం నిర్మించింది. అంతేకాక బోర్డర్ అవుట్ పోస్ట్లను కలుపుతూ.. రోడ్నెర్క్ను సైతం అభివృద్ధి చేస్తోంది. ఒక వేళ యుద్ధం సంభవిస్తే.. సైన్యానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా సరిహద్దు వెంబడి బంకర్స్తో పాటు కెనాల్స్కు చైనా ఏర్పాటు చేస్తోంది. భారత్ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖైరాపూర్ ఎయిర్బేస్లో కొన్ని నెలలుగా చైనా సైన్యం తిష్ట వేసింది. ఈ ఎయిర్బేస్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేస్తోంది. ఇదిలావుండగా.. పాక్కు అవసరమైన సహజవాయువు, ముడిచమురు, ఖనిజ వనరులను చైనానే అందిస్తోంది. -
పఠాన్ కోట్ ఎయిర్బేస్ వద్ద హై అలర్ట్
-
ముక్కలైన రష్యా హెలికాప్టర్లు.. ట్రక్కులు
సిరియా: రష్యాపై ఆగ్రహాన్ని మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చూపించారు. తమపై సిరియా దేశ ప్రభుత్వ బలగాల అండతో దాడులకు దిగుతున్న రష్యా బలగాలు ఉపయోగించుకుంటున్న సిరియా వ్యూహాత్మక ప్రాంతంపై పదేపదే ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడింది. తియాస్ వద్ద ఉన్న ఎయిర్ బేస్ను దాదాపు ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను బీబీసీ సాధించి బయటపెట్టింది. గత కొద్ది రోజులుగా సిరియాలోని ఉగ్రవాదులను నిలువరించేందుకు రష్యా ఆ దేశంలోని తియాస్ ఎయిర్ బేస్ను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే రష్యా యుద్ధ హెలికాప్టర్లు.. 20 ట్రక్కులు ఇక్కడ నిలిపి ఉంచుతుంది. ప్రస్తుతం వాటన్నింటిని కూడా ఇస్లామిక్ స్టేట్ ధ్వంసం చేసినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. -
ఎన్ఎస్జీ, గరుడ కమాండోల మోహరింపు