-
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
లద్దాఖ్ దగ్గరలో చైనా కొత్త ఎయిర్బేస్
న్యూఢిల్లీ: సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారకముందే చైనా మరో దుశ్చర్యకు దిగుతోంది. లద్దాఖ్లోని షాక్చే వద్ద చైనా నూతనంగా ఎయిర్బేస్ను అభివృద్ది చేస్తున్న విషయాన్ని భారతీయ ఏజెన్సీలు గమనించాయి. ఇది పూర్తయితే లైన్ఆఫ్ కంట్రోల్ పొడుగునా చైనాకు వైమానిక మద్దతు పెరగనుంది. షాక్చేలోని ఎయిర్బేస్ను పూర్తిస్థాయి మిలటరీ బేస్గా చైనా రూపుదిద్దుతోందని, ఫైటర్ ఆపరేషన్స్కు అనుకూలంగా దీన్ని మారుస్తోందని భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఓసీ వద్ద గతేడాదిగా నెలకొన్న ఉద్రిక్తతలను ఈ చర్య మరింత ఎగదోస్తుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. యుద్దమే వస్తే తమ కన్నా వేగంగా భారతీయ వైమానిక దళం ఎల్ఓసీ వద్దకు చేరుకుంటుందని చైనా ఎప్పుడో గమనించింది. ఇందుకు సమాధానంగానే షాక్చే వద్ద మిలటరీ ఎయిర్బేస్ను అభివృద్ధి చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఖష్గర్, హోగాన్ మధ్యలో ఒక కొత్త బేస్ను కూడా చైనా నిర్మిస్తోంది. గతేడాది నుంచి సరిహద్దుకు దగ్గరలోని 7 చైనా ఎయిర్బేస్లపై భారతీయ ఏజెన్సీలు కన్నేసి ఉంచాయి. ఇటీవల కాలంలో ఈ బేస్లను మరింతగా బలోపేతం చేస్తున్నట్లు గమనించాయి. -
యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం
ఇస్లామాబాద్: సరిహద్దుల్లోని యుద్ధ విమానాలను భారత్ తరలిస్తే తప్ప తమ దేశం గుండా వాణిజ్య విమానాలకు గగనతలం తెరవబోమని పాకిస్తాన్ విమానయాన కార్యదర్శి షారుక్ నుస్రత్ స్పష్టంచేశారు. పుల్వామా తీవ్రవాద దాడి అనంతరం పాక్లోని బాలాకోట్లో జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 26 తర్వాత నుంచి పాక్ తన గగనతలంపైనుంచి భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. నుస్రత్ ఆదేశాలతో పాక్ విమానయాన శాఖకు చెందిన సెనేట్ స్టాండింగ్ కమిటీ భారత అధికారులకు సమాచారమిచ్చింది. ‘పాక్ గగనతలం తెరవాలని భారత ప్రభుత్వం సంప్రదించింది. మేం అందుకు సిద్ధం. అయితే ముందుగా సరిహద్దుల్లోని వైమానిక స్థావరాల నుంచి యుద్ధ విమానాలను భారత్ ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని నుస్రత్ పేర్కొన్నారు. గగనతలం తెరవడంపై ఓ పాక్ సీనియర్ అధికారి స్పందించడం ఇదే మొదటిసారి. పాక్ గగనతలం మూసివేతపై ఆంక్షలు జూలై 12 వరకు పొడిగించారు. ఏదిఏమైనా పాక్ గగనతల మూసివేతతో భారత విమానయాన పరిశ్రమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. పాక్ గగనతల మూసివేత కారణంగా దూరపు మార్గాల్లో విమానాలు ప్రయాణించడం ద్వారా ఎయిరిండియా రూ.430 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. -
గుజరాత్ సరిహద్దులో పాక్ ఎయిర్ బేస్ కలకలం
న్యూఢిల్లీ : గుజరాత్ సరిహద్దు వెంబడి సింధ్ ప్రోవిన్స్లో భోలారి ప్రాంతంలో పాకిస్తాన్ ఆధునిక ఎయిర్బేస్ను అభివృద్ధి చేసింది. ఈ ఎయిర్బేస్లో పాకిస్తాన్ తన చైనా జేఎఫ్-17 యుద్ధ విమానాలను మోహరిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎయిర్బేస్ గత కొద్దికాలంగా పనిచేస్తున్నా యుద్ధ విమానాల విన్యాసాలు ఈ స్థాయిలో జరగడంఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత వాయుసేనకు దీటుగా పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ పెద్దసంఖ్యలో చైనా నుంచి జేఎఫ్-17 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది. ఇదే ఎయిర్బేస్కు చేరువలోనే పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (నేవీ) కమాండోలను సైతం రంగంలోకి దింపింది. సముద్ర మార్గం గుండా భారత్లో దాడులకు లష్కరే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఎయిర్బేస్ను వాడతారే ప్రచారం సాగుతున్న క్రమంలో కమాండోలను ఇక్కడికి రప్పించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ సన్నాహాలకు దీటుగా గుజరాత్ బోర్డర్లోని దీసా వద్ద యుద్ధ ఎయిర్బేస్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే అక్కడ రన్వే ఏర్పాటు, యుద్ధ విమానాల తరలింపు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు కనీసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. -
సిరియా సంక్షోభం.. మళ్లీ వైమానిక దాడులు..!
డమస్కస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో తాజాగా సోమవారం ఉదయం వైమానిక దాడులు జరిగాయి. ప్రభుత్వ ఆధ్యర్యంలోని తాయ్ఫుర్ వైమానిక స్థావరం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. హామ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ వైమానిక స్థావరంపై జరిగిన వైమానిక క్షిపణి దాడుల్లో పలువురు చనిపోయారని, పెద్దసంఖ్యలో గాయాలపాలయ్యారని ప్రభుత్వ మీడియా సంస్థ సనా తెలిపింది. సిరియా ప్రభుత్వ వైమానిక స్థావరంపై అమెరికా సైన్యమే వైమానిక దాడులు జరిపినట్టు భావిస్తున్నారు. అయితే, అమెరికా ఈ వార్తలను ఖండించింది. తాము వైమానిక దాడులు నిర్వహించలేదని స్పష్టం చేసింది. తాజాగా తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై విషరసాయనిక దాడులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 42మందిని పొట్టనబెట్టుకొని, వందలమంది గాయపడటానికి కారణమైన గ్యాస్ దాడిపై అంతర్జాతీయ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వం తన సొంత ప్రజల్నే చంపుకుంటుందని మండిపడ్డాయి. సిరియా అధ్యక్షుడు అసద్ జంతువులాంటి వాడని, అతనితోపాటు అతనికి అండగా నిలుస్తున్న రష్యా, ఇరాన్ ఈ గ్యాస్ భారీ మూల్యం చెల్లించకతప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement