పశ్చిమాసియా యుద్ధంలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా సౌదీ అరేబియాలోని యుఎస్ ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకపడింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక బోయింగ్ సెంట్రీ నిఘా విమానం దెబ్బతినట్లు ఇరాన్ పేర్కొంది. అదేవిధంగా దాదాపు 15మంది అమెరికా సైనికులకు గాయాలయ్యాయని తెలిపింది.
ఇరాన్, అమెరికా యుద్ధం మెుదలై దాదాపు నెలరోజులు గడుస్తోన్నా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓ వైపు చర్చలు జరుపుతామని ట్రంప్ పేర్కొంటూనే మరోవైపు అమెరికా అదనపు బలగాల్ని ట్రంప్ మిడిల్ ఈస్ట్కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. కాగా తాజాగా సౌదీలోని అమెరికా ఎయిర్బేస్పై అమెరికా దాడి చేసింది.
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇరాన్ 6 బాలిస్టిక్ మిస్సైళ్లు, 29 డ్రోన్లతో దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ అటాక్లో దాదాపు $700 మిలియన్ల రూ.5,800 కోట్లు విలువైన బోయింగ్ E-3 సెంట్రీ నిఘా విమానం ధ్వంసమైనట్లు పేర్కొంది. కాగా ఇరాన్ జరిపిన దాడిలో 15 మంది అమెరికా సైనికులు గాయపడగా వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ దాడిపై అమెరికా ఇదివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయు. USA తన యుద్ధనౌకలతో పాటు వేలాది మంది సైన్యాన్ని మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. దీంతో కంబాట్ ఆపరేషన్ చేపట్టనుందేమో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.


