-
హైదరాబాద్ చేరుకున్న ‘ఫ్లయింగ్ రాబిట్స్’
సాక్షి, హైదరాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 11వ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ రీయూనియన్ వేడుకల్లో భాగంగా నవంబర్ 30న గయలో ప్రారంభమైన ఆర్మీ మైక్రోలైట్ ఎక్స్పెడిషన్ బృందం ఆదివారం హకీంపేట్లోని ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరింది. ఈ బృందం 17 రోజుల్లో 5000 కి.మీ ప్రయాణించనుంది. సాహసయాత్రలను చేపట్టే ‘ఫ్లయింగ్ రాబిట్స్’బృందంతో గయలోని నోడల్ సెంటర్ (మైక్రోలైట్) ఆర్మీ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ ఆధ్వర్యంలో ఈ యాత్రను ప్రారంభించారు. ఇందులోభాగంగా తక్కువ బరువున్న నాలుగు విమానాలు బిహార్, ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మైదాన ప్రాంతాల మీదుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పయనిస్తాయి. హైదరాబాద్కు చేరిన ఫ్లయింగ్ రాబిట్స్ బృందానికి ఆర్మీ ఆధ్యర్యంలో ఘనస్వాగతం పలికారు. -
ఆందోళన కలిగిస్తున్న ‘ముతక’ దాడులు
జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరం మీద ముతక డ్రోన్లను ఉపయోగించి చేసినట్టుగా చెబుతున్న దాడి కొత్త సవాళ్లను ఎత్తిచూపుతోంది. కల్లోలిత ప్రాంత మైన జమ్మూకశ్మీర్లోకి విషమ యుద్ధం ప్రవేశించడం చెడుకు సంకేతం. 2018లో అధికంగా రష్యా కార్య నిర్వహణలో ఉన్న సిరియాలోని హుమాయ్మిమ్ వైమానిక స్థావరం ఈ డ్రోన్ల దాడికి గురైంది. ఇందులో స్థావరంలో ఉంచిన రష్యా విమానాలు, ఇతర పరికరా లకు తీవ్ర నష్టం జరిగింది. స్వల్ప శ్రేణి ప్రతి–వైమానిక క్షిపణులు, రేడియో జామర్ల సాయంతో కొన్ని డ్రోన్లను కూల్చినట్టుగా రష్యా ప్రకటించింది. జమ్మూలో జరిగిన దాడి హుమాయ్మిమ్ దాడిని దాదాపుగా పోలివుంది. ఏమైనా వ్యర్థాలు, డక్ట్ టేపు ఉపయోగిస్తూ ‘ఐఈడీ’ (మెరుగుపరిచిన పేలుడు పదార్థాలు)లను మోసుకు పోయేలా తయారుచేసిన డ్రోన్లు కోట్లాది రూపాయల విలువైన నేలమీది సంప్రదాయ విమానాలకు నష్టం కలిగించగలవు. వైమానిక విధాన నిర్ణేతలకు ఇది కొత్త సవాళ్లను విసురుతోంది. తీవ్రవాద గ్రూపుల చేతుల్లోకి డ్రోన్లు రావడం 2013–15 మధ్యకాలంలో సిరియా గ్రామాల్లో మొద లైంది. కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఇస్లామిక్ స్టేట్ లోకి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువత యూరప్, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి చేరడం, తమకూ ఒక వైమానిక శాఖ ఉండాలన్న ఆలోచన రావడంతో ఏమీ లేనిచోట సిరియా, ఇరాక్ యుద్ధ క్షేత్రాల్లోని తుక్కును ఉపయోగించి డ్రోన్లు తయారు చేశారు. క్రమంగా వాణిజ్యంగా అందుబాటులో ఉన్న క్వాడ్కాప్టర్లను నవీ కరిస్తూ ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలు మోయ డానికి ఉపయోగించారు. ఇస్లామిక్ స్టేట్ ఉధృతి కొనసాగుతున్న కాలంలో, రోజువారీ ఎలక్ట్రానిక్స్ దుకాణాల్లో కొనుగోలుకు అందుబాటులో ఉండి సినిమాలు, క్రీడలను షూట్ చేయడానికి ఉపయోగించే క్వాడ్కాప్టర్లు స్మగ్లర్ల ద్వారా సిరియా, ఇరాక్లోకి ప్రవేశించాయి. కాన్ఫ్లిక్ట్ ఆర్మ మెంట్ రీసెర్చ్ ప్రకారం, 2016 ఆగస్ట్లో ఇండియాలో కొనుగోలు చేసిన ఒక డ్రోన్ అదే సంవత్సరం అక్టో బర్లో యునైటెడ్ కింగ్డమ్లో యాక్టివేట్ అయింది. అనంతరం అది ఉత్తర ఇరాక్లోని తాల్ అఫార్ చేరింది. తమ డ్రోన్ల దళం ఒకే వారంలో 39 మంది ఇరాకీ సైనికులను చంపడమో, గాయపరచడమో చేశా యని అదే ఏడాది కొద్ది రోజుల తర్వాత ఇస్లామిక్ స్టేట్ చెప్పుకుంది. ఈ ప్రతి దాడినీ అందులో ఉంచిన కెమె రాల సాయంతో రికార్డ్ చేశారు. దీనివల్ల వారి ప్రచార వ్యాప్తికి ప్రచండమైన మేత దొరికినట్టయింది. అయితే, ఈ తరహా దాడుల నుంచి ఎదురయ్యే భయాలను అవగతం చేసుకోవడంలో ఆటంకాలు న్నాయి. టర్కీ తయారీ బేరక్తార్ టీబీ2 డ్రోన్లను అర్మేని యాకు వ్యతిరేకంగా నగోర్నో–కరబాఖ్ యుద్ధంలో అజర్బైజాన్ విజయవంతంగా ఉపయోగించింది. ఇది ఈ తరహా డ్రోన్ల నాణ్యత విశేషంగా పెరగడానికి కార ణమైంది. అంతమాత్రాన ఆ డ్రోన్ల వాడకాన్ని జమ్మూ ఘటనతో పోల్చరాదు. అజర్బైజాన్– అర్మేనియా యుద్ధం సంప్రదాయబద్ధమైనది, రెండు దేశాల మధ్య జరిగినది, పైగా బేరక్తార్ డ్రోన్లు పూర్తిగా సైనికావస రాల కోసం ఉద్దేశించినవి. ఇవి ముతక డ్రోన్లు కావు. ఎందుకు నొక్కిచెప్పాలంటే, దేశంలో జరుగుతున్న చర్చల్లో ఈ సామ్యాన్ని తేవడంలో సవరణ అవసరం కాబట్టి. గత కొన్నేళ్లుగా ముతక డ్రోన్ల వాడకం పెరిగింది. కొన్ని నివేదికలు సూచిస్తున్నట్టుగా 2019లో మావోయి స్టులు కూడా ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఒక పారామిలి టరీ క్యాంపు మీద నిఘా వేయడానికి డ్రోన్ ఉపయో గించారు. సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి క్షేత్రాల మీద దాడుల నుంచి, 2018లో వెనిజులా నాయకుడు నికోలస్ మదురో మీద హత్యాయత్నం దాకా, ఈ సాంకేతిక పరిజ్ఞాన వాడకం పెరిగింది. ఈ డ్రోన్ల లాంటి విషమ యుద్ధవాతావరణం భారతీయ కోణం నుంచి చూస్తే కొత్తేమీ కాదు. ఈ మోసపు డ్రోన్లను ఒక ప్రమాదంగా 2020 డిసెంబర్లోనే ఎయిర్ఫోర్స్ ప్రధానాధికారి నొక్కి చెప్పారు. కాబట్టి ఈ అంశం ఇప్పటికే స్థావరాల సంరక్షణ, ప్రతిక్రియలోకి వచ్చి చేరవలసింది. మొత్తంగా సాంకేతిక పరిజ్ఞానం గురించే ఒక ప్రతిక్రియ అవసరం ఉండగా, జమ్మూ సంఘటన ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం కేవలం సైన్యానికో, దేశానికో పరిమితం కాదని ఎత్తిచూపింది. కబీర్ తనేజా, ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (హిందుస్తాన్ టైమ్స్ సౌజన్యంతో) -
డ్రోన్ దాడి పాక్ పనే: జమ్ము కశ్మీర్ డీజిపీ
జమ్మూ: జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరంపై సంచలనాత్మక డ్రోన్ దాడి వెనుక నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నట్లు జమ్ము కాశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ తెలిపారు. పాక్ సరిహద్దు ఆవల నుంచే ఆ డ్రోన్లు వచ్చాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు ఆదివారం డ్రోన్లతో దాడులు జరపగా ఇద్దరు జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే. డ్రోన్ కాక్టైల్ భాగంలో ఆర్డీఎక్స్ను పేలుడుకు ఉపయోగించినట్లు అధికారులు అంచనాకొచ్చారు. భారత వైమానిక దళం స్థావరం వద్ద ప్రస్తుత పరిస్థితిని ఐపిఎస్ అధికారి సింగ్ పర్యవేక్షిస్తున్నాడని ఆయన అన్నారు. జమ్మూలో అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు వరుసగా సోదాలు జరుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో అనధికారికంగా డ్రోన్లను ఉపయోగించవద్దని ప్రజలకు హెచ్చరిక కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. మరో ఉగ్రకుట్ర భగ్నం జమ్మూకశ్మీర్లో డ్రోన్ల సాయంతో ప్రయత్నించిన మరో ఉగ్రకుట్రను భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అదే తరహా ఘటన పునరావృతమవడం సంచలనం రేపింది. ఈసారి సైనిక స్థావరాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. డ్రోన్లతో దాడికి ప్రయత్నించారు. ఆర్మీ జవాన్లు అప్రమత్తమై ఎదురుదాడికి దిగడంతో డ్రోన్లు తోకముడిచాయి. జమ్మూకశ్మీర్లోని రత్నుచక్–కలుచక్ సైనిక స్థావరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్, సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరో డ్రోన్ సైనిక స్థావరం వైపు దూసుకొచ్చాయని తెలిపారు. వాటిని నేలకూల్చడానికి విధుల్లో ఉన్న సెంట్రీలు దాదాపు రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరపడంతో డ్రోన్లు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్మీ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ వివరించారు. చదవండి: మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా -
నేటి నుంచి సూర్యలంక తీరంలో మిస్సైల్ ఫైరింగ్
బాపట్ల టౌన్: గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక తీరంలో మంగళవారం నుంచి మిస్సైల్ ఫైరింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. భారతదేశంలో ఉన్న ఎయిర్ఫోర్స్ స్టేషన్లలో తీరప్రాంతానికి దగ్గరగా దట్టమైన అడవుల మధ్య ఫైరింగ్ చేసేందుకు అనుకూలంగా ఉండటంతో మిస్సైల్ ఫైరింగ్కు ఈ తీరాన్ని ఎన్నుకున్నారు. ఆకాశమార్గం గుండా దేశంలోకి చొరబడే శత్రు విమానాలను నింగిలోనే గుర్తించి ఆ విమానాలను వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే మట్టికరిపించడం ఈ మిస్సైల్ ఫైరింగ్ ముఖ్య ఉద్దేశం. ఫైరింగ్కు కేరాఫ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో సహజసిద్ధమైన తీరంగా ఖ్యాతిని సొంతం చేసుకుంది సూర్యలంక తీరం. వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడంలోనూ ప్రత్యేకత చాటుతోంది. త్రివేండ్రం కమాండ్ పరిధిలో ఉన్న వాటిలో ఫైరింగ్కు అనుకూలమైన స్టేషన్ సూర్యలంక ఒక్కటే. ఫైరింగ్ చేసే ప్రతిసారీ మిస్సైల్ తయారీకి ఉపయోగించే శకలాలు భూమ్మీద పడితే వాటి నుంచి వెలువడే రసాయనాలు, ఇనుప వస్తువులు, ఉక్కుసామగ్రి వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే, సూర్యలంక ఎయిర్ఫోర్స్ స్టేషన్ సముద్రానికి ఆనుకుని ఉండటంతో మిస్సైల్ ఫైరింగ్ అనంతరం శకలాలు సముద్రంలో పడిపోతుంటాయి. దీంతో ఎవరికీ ఎలాంటి హాని వాటిల్లే అవకాశం లేదు. అందుకే దేశంలో ఉన్న అన్ని ఎయిర్ఫోర్స్ స్టేషన్లకంటే సూర్యలంక స్టేషన్ శిక్షణ రంగంలో ముందంజలో ఉంది. తీరప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు జారీ సూర్యలంక సముద్ర తీరంలో మంగళవారం నుంచి డిసెంబర్ 2 వరకు జరిగే మిస్సైల్ ఫైరింగ్కు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్, రాష్ట్ర రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖాధికారులు తీరప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తం చేశారు. ఫైరింగ్ జరిగే ప్రాంతం నుంచి తీరం వెంబడి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ప్రజలు ఉండకూడదని, ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు ఫైరింగ్పై అవగాహన కల్పించారు. సూర్యలంకకు ప్రత్యేక స్థానం భారతదేశంలో మొత్తం 7 కమాండ్లు ఉన్నాయి. వాటిలో డబ్ల్యూఏసీ (వెస్ట్రన్ ఎయిర్ కమాండ్– ఢిల్లీ), సౌత్ ఎయిర్ కమాండ్ (త్రివేండ్రం), సౌత్ వెస్ట్ ఎయిర్ కమాండ్ (గుజరాత్), మెయింటెనెన్స్ కమాండ్ (నాగపూర్), సెంట్రల్ కమాండ్ (అలహాబాద్–యూపీ), ట్రైనింగ్ కమాండ్ (బెంగళూరు), అండమాన్ నికోబార్ కమాండ్ (పోర్ట్బ్లెయిర్)లో ప్రధానమైన కమాండ్లు ఉన్నాయి. ఒక్కో కమాండ్ పరిధిలో పదుల సంఖ్యలో ఎయిర్ఫోర్స్ స్టేషన్లు ఉంటాయి. త్రివేండ్రంలో ఉన్న సౌత్ ఎయిర్ కమాండ్ (సదరన్ కమాండ్) పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన 15 ఎయిర్ఫోర్స్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఏకైక ఎయిర్ఫోర్స్ స్టేషన్ సూర్యలంక మాత్రమే. -
చైనా సరిహద్దులో సుఖోయ్ గల్లంతు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement