-
ఓటు ప్రాధాన్యతపై అవగాహన
కలెక్టరేట్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై, వినియోగంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో ఎన్నికల పరిశీలకులు వివిధ కమిటీల సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల కోరకు 260 మంది సెక్టోరల్ అధికారులు, 400 వాహనాలు ఎన్నికల విధుల కొరకు వినియోగిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామాల్లో 420 ఈవీఎంలతో ఓటర్లకు అవగాహన నిర్వహించడం జరుగుతుందన్నారు. దాదాపు 1100 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 24, 25 తేదీల్లో నియోజకవర్గాలవారీగా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నెల 26,27వ తేదీల్లో మండల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. శిక్షణ కార్యక్రమాల ద్వారా పూర్తి అవగాహన పెంచుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఫొటో ఓటరు జాబితా పంపించామని, రాజకీయ పార్టీల నాయకులకు ఓటరు జాబితా అందజేయాలని రిటర్నింగ్ ధికారులను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టి ఇప్పటివరకు రూ.58 లక్షల విలువ చేసే లిక్కర్ను సీజ్ చేయడం జరిగిందన్నారు. పోలింగ్శాతం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని, 95 శాతం పోలింగ్ నమోదు చేసిన నోడల్ అధికారులకు రూ.10 వేల చొప్పున పారితోషకం ఇస్తాం. అనంతరం ఎన్నికల పరి శీలకులకు పంకజ్ జోషి మాట్లాడుతూ సింగిల్ విండో విధానం ద్వారా అభ్యర్థుల వాహనాలకు అనుమతి తీసుకోవాలని, ఖర్చుల వివరాలు పూర్తిగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రవర్తనా నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎస్పీ గజరావు భూపాల్ మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,241 మందిని బైండోవర్ కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.50 వేల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికలకు 6 వేల మంది పోలీసు సిబ్బందితోపాటు 11 కంపెనీల సీఆర్పీఎఫ్, 18 సెక్షన్ల పారామిలటరీ బృందాలను వినియోగించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో జేసీ లక్ష్మీకాంతం, సబ్ కలెక్టర్ప్రశాంత్ జీవన్పాటిల్, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఓఎస్డీ పనసారెడ్డి, ఏఎస్పీ జోయేల్ డేవిస్, రిటర్నింగ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
సమస్యలు ఉంటే తెలపాలి
కలెక్టరేట్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులకు సమస్యలు, సందేహాలు ఉంటే తెలపాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సీడీలను, హార్డ్ కాపీలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల జాబితా కూడా అతికించడం జరుగుతుందన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఈవీఎంల కమిషనింగ్ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతుందన్నారు. ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన కల్పించాలని, సెక్టోరల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కమిటీలు, ఫ్లయింగ్ స్క్వాడ్, గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. పోలింగ్ ఏజెంట్ల జాబితా ఈ నెల 28న ఆయా రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలను సక్రమంగా అందజేయాలని, అనుభవం గల అకౌంటెంట్లను నియమించుకోవాలన్నారు. ప్రచార కార్యక్రమాలకు అనుమతి తీసుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సారి 90 శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో వాహన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నెల 30న పోలింగ్ ఉండడం వల్ల జిల్లా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఈనెల 28లోగా తిరిగి వెళ్లిపోవాలన్నారు. అక్రమ మద్యం రవాణాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, ఎలాంటి సమాచారమైన ఫోన్ ద్వారా తెలపవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జేసీ లక్ష్మీకాంతం, పార్టీల నాయకులు ఎం. ప్రభాకర్రెడ్డి, యూనిస్ అక్బానీ, ప్రశాంత్ కుమార్, బండి దత్తాత్రి, సురేష్ జోషి, ఓంకార్ మల్ శర్మ, లక్ష్మణ్, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
పోల్చిట్టీలు లేవని బయటకు పంపొద్దు
ఉట్నూర్, న్యూస్లైన్ : సాధారణ ఎన్నికల సందర్భంగా ఓటర్ల వద్ద పోల్ చిట్టీలు లేవని ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించొద్దని కలెక్టర్ అహ్మద్ బాబు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారులకు స్థానిక పీఎమ్మార్సీ భవనంలో ఈవీఎంల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. రెండో రోజు సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడానికి ఉన్న గుర్తింపుకార్డుల్లో ఓటర్ స్లిప్పు ఒక ఆధారం మాత్రమేనని చెప్పారు. పోల్ చిట్టీ లేకున్నా ఓటరు జాబితా ప్రకారం ఏదో ఒక గుర్తింపు కార్డుతో ఓటు వేసే అవకాశం కల్పించాలని తెలిపారు. సాధారణ ఎన్నికల నిర్వహణ రోజున పోలింగ్కు గంట ముందు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ తప్పనిసరిగా లోక్సభ, శాసనసభకు వేర్వేరుగా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకువాలని పేర్కొన్నారు. గర్భిణులు, అంధులు, వికలాంగులు నేరుగా ఓటు వేసే అవకాశం కల్పించాలని తెలిపారు. రేషన్కార్డు, ఆరోగ్యశ్రీ, జాబ్కార్డు వంటివి ఓటరు గుర్తింపుకార్డు కిందికి రావని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో రవాణా సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించిందని అన్నారు. ఈ సమావేశంలో లోక్సభ సాధారణ పరిశీలకులు పంకజ్ జోషి, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆర్డీవో రామచంద్రయ్య, పోలింగ్ నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. -
సార్వత్రిక భేరి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు, ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి జిల్లా ఎన్నికల ప్రధానాధికారి, కలెక్టర్ అహ్మద్బాబు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. మొదటి రోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. పదుల సంఖ్య లో నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 5నప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 9వ తేదీగా గడువు విధించా రు. ఈనెల 10న పరిశీలన, 12న ఉపసంహరణతో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోనుంది. పోలింగ్ 30న ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 16న ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది. రెండు చోట్ల నామినేషన్లు ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి టీడీపీ ఎంపీ రాథోడ్ రమేష్ నామినేషన్ దాఖలైంది. ఆయ న తరఫున ఆయన భార్య సుమన్ రాథోడ్ కలెక్టరేట్లోని ఎంపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అహ్మద్బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ స్థానానికి ఆయన కొడుకు రితేష్రాథోడ్ కూడా నామినేషన్ వేశారు. ఆయన కూడా అహ్మద్బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానానికి కూడా రాథోడ్ రమేష్ నామినేషన్ దాఖలైంది. ఆయన తరఫున సివిల్ కాంట్రాక్టర్ అబ్దుల్ ఫయాజ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్పాటిల్కు నామినేషన్ సమర్పించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే స్థానానికి కూడా రాథోడ్ రమేష్తోపాటు, ఆయన కొడుకు రాథోడ రితేష్ నామినేషన్ వేశారు. ఉట్నూర్ ఆర్డీవో, ఖానాపూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాంచంద్రయ్యకు నామినేషన్ పత్రాలు అందజేశారు. జిల్లాలో ఉన్నా.. నామినేషన్కు దూరం.. బుధవారం రాథోడ్ రమేష్ జిల్లాలోనే ఉన్నప్పటికీ ఆయన నామినేషన్ను మాత్రం ఆయన భార్య సుమన్ రాథోడ్తో పంపారు. ఆయనతోపాటు, ఆయన కొడుకు రితేష్రాథోడ్ నామినేషన్ సమర్పించిన సమయంలో ఆయన ఇచ్చోడలో ఉన్నారు. అక్కడి బ్రహ్మంగారి ఆలయంలో జరిగిన కల్యాణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలో ఉండి కూడా నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. జిల్లావ్యాప్తంగా ఓటర్లు 19.18 లక్షలు జిల్లాలో పది అసెంబ్లీ, రెండు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి లోక్సభ పరిధిలో బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 19,18,267 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 9.60 లక్షల మంది పురుషులు ఉండగా, 9.57 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,256 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,500 ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వినియోగించనున్నారు. -
విద్యాశాఖలో కలకలం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్లైన్ : పదో తరగతి ఇన్విజిలేటర్లపై కలెక్టర్ అహ్మద్బాబు కొరడా ఝుళిపించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినా విద్యాశాఖ తీరు మారకపోవడంతో వేటు వేశారు. ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యంగా, అలసత్వంగా వ్యవహరించడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు మాస్కాపీయింగ్కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. మొదటి రోజు 9, రెండో రోజూ ఐదుగురు, మూడో రోజూ 13 మంది డిబార్ అయ్యారు. ఈ మేరకు మాస్ కాపీయింగ్కు ప్రోత్సహించిన ఇన్విజిలేటర్ల వివరాలు, కేంద్రాలను డీఈవో వద్ద తీసుకుని 24 మంది ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ ఉలిక్కిపడింది. దీంతో మిగతా ఇన్విజిలేరట్లు, సీఎస్లు, డీవోలు భయాందోళనకు గురవుతున్నారు. వీరితోపాటు ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించిన 18 మందిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీకి, ఐటీడీఏ పీవోకు, సాంఘీక సంక్షేమ శాఖ డీడీకి ఉత్తర్వులు పంపారు. వీరిపై కూడా సస్పెషన్ వేటు పడే అవకాశాలు లేకపోలేదు. జంకుతున్న ఉపాధ్యాయులు పదో తరగతి ఇన్విజిలేషన్ చేయడానికి ఉపాధ్యాయులు జంకుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోని కొంత మంది సీఎస్, డీవోలు మామూళ్లకు ఆశపడి పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయిం గ్ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంతో ఆ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మొదటి రెండు పరీక్షలకే 24 మంది ఉపాధ్యాయులు సస్పెండ్ కావడంతో మిగతా పరీక్షల పరిస్థితి ఎలా ఉం టుందో అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సస్పెండ్ చేయడం సరికాదు.. - రవీంద్ర, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జిల్లాలో మాస్ కాపీయింగ్కు ప్రోత్సహించారని ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సరికాదు. వారికి షోకాజ్ నోటీసులు ఇస్తే సరిపోయేది. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయుల మనోధైర్యం దెబ్బ తింటుంది. మానసిక ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకే ఉపాధ్యాయులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కానీ అధికారులు సస్పెన్షన్ విషయంలో మరోసారి ఆలోచించాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement