breaking news
adivasi bhavan
-
‘భవనాలు నిర్మించగానే సరిపోదు.. గిరిజన బిడ్డల సమస్యలు తీరాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రూ. 50 కోట్ల చొప్పున వ్యయంతో ప్రభుత్వం రెండు భవనాలను నిర్మించింది. కాగా, బంజారా భవన్కు సంత్ సేవా లాల్ పేరును అలాగే, ఆదివాసీ భవన్కు కొమరం భీమ్ పేర్లను పెట్టారు. ఈ రెండు భవనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ గిరిజన బిడ్డలందరికీ అభినందనలు. భవనాలు నిర్మించగానే సరిపోదు.. గిరిజన బిడ్డల సమస్యలు తీరాల్సిన అవసరం ఉంది. గిరిజన బిడ్డల విషయంలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వారి చదువుల విషయంలో, విదేశాలకు వెళ్లే విషయంలో, గిరిజన పోడు భూముల విషయంలోగానీ, రక్షణ విషయంలో గానీ.. ప్రభుత్వం సహకరిస్తోంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం కావాల్సిన అవసరముంది. ఈ భవనం తెలంగాణ గిరిజన బిడ్డల హక్కుల పరిరక్షణకు వేదిక కావాలి. వారి సమస్యల పరిరక్షణకు మార్గం కావాలి. ఆదివాసీ మేధావి వర్గం ఒక్కటై.. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. -
సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం: కేసీఆర్
హైదరాబాద్ : అందరికి సమాన హక్కులు కల్పించేందుకు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన గురువారం బంజారాహిల్స్లోని రోడ్ నం.10 లో బంజారా, ఆదివాసీ భవన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి బంజారా, ఆదివాసీ భవన్లను నిర్మిస్తున్నామన్నారు. కమ్యూనిటీ హాల్ కట్టుకోగానే సరిపోదని, అది గిరిజనుల అభివృద్ధికి వేదిక కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ట్రైబల్ సబ్ప్లాన్ నిధులు మళ్లించబడవని కేసీఆర్ తెలిపారు. అంతకు ముందు కేసీఆర్కు బంజారాలు, ఆదివాసీలు డబ్బులు, వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆహ్వానం పలికారు. -
గిరిజనుల అభివృద్ధికి ఇదే వేదిక కావాలి..!