breaking news
Aditya Engineering College
-
సాక్షి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కు అనూహ్య స్పందన
-
బలానికి కమలదళం కసరత్తు
⇒13 జిల్లాల్లో బీజేపీలో కొత్తగా చేరిన వారికి శిక్షణ ⇒ ప్రారంభించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ⇒ వేదిక సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల జగ్గంపేట / గండేపల్లి : కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి రాగా కాంగ్రెస్ చావుదెబ్బ తింది. దీంతో గట్టి పునాదిని నిర్మించుకోవడానికి ఇదే తగిన సమయమని బీజేపీ భావిస్తోంది. 13 జిల్లాల పరిధిలో కొత్తవారిని చేర్చుకుంటూ వారికి బీజేపీ విధి విధానాలు, సిద్ధాంతాల గురించి తెలియజేసేందుకు శిక్షణ తరగతులకు తెరతీసింది. దీనిలో భాగంగా జిల్లాలోని గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సీమాంధ్ర పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మూడురోజుల రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించింది. మీడియాను అనుమతించకుండా గోప్యత పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం శిక్షణ తరగతులను ప్రారంభిర చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రారంభోపన్యాసం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. శిక్షణ తరగతులు జరిగే సెమినార్ హాల్లోకి మీడియాను అనుమతించకుండా గోప్యత ప్రదర్శించారు. కాగా.. అందిన సమాచారం ప్రకారం.. శిక్షణ తరగతుల్లో వెంకయ్యనాయుడు పార్టీలోకి కొత్తగా చేరిన వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు, పనితీరుపై అవగాహన కల్పించేందుకు, బీజేపీని సంస్థాగతంగా సీమాంధ్రలో బలపర్చేందుకు పలు సూచనలు చేశారు. అలాగే బీజేపీని బలపర్చేందుకుగల అనేక మార్గాలు, ఆలోచనలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్, ఇతర పక్షాలు చేస్తున్న దుష్ర్పచారం పైన అవగాహన కల్పించారు. తొలిరోజు శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్రాజు, మాజీ ఎంపీలు కన్నా లక్ష్మీనారాయణ, ఎర్నేని సీతాదేవి, మాజీ మంత్రులు పురందేశ్వరి, మారెప్ప, జిల్లా పార్టీ అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, పైడా సత్యమోహన్, మాలకొండయ్య, వత్సవాయి వరహాల బాబు, జిల్లా ఇన్చార్జి తిరుపతిరావు, ఆల్డా చైర్మన్ యాళ్ళ దొరబాబు, శ్రీకాకుళం, రాయలసీమ, గుంటూరు జిల్లాల మాజీ జెడ్పీ చైర్మన్లు, ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ సింగిలిదేవి సత్తిరాజు, జగ్గంపేట, గండేపల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా శిక్షణను ప్రారంభించేందుకు ఆదిత్య కళాశాలకు వచ్చిన కేంద్రమంత్రి వెంక య్యనాయుడికి విద్యాసంస్థల చైర్మన్, వైస్చైర్మన్లు ఎన్. శేషారెడ్డి, సతీష్రెడ్డి స్వాగతం పలికారు. -
టెక్కలి ఆదిత్య కాలేజీలో కెరీర్ అరేనా
-
ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఆదిత్య సంచలనం
బాలాజీచెరువు(కాకినాడ): తూర్పు గోదావరి జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించి విజయ పతాకాన్ని ఎగురవేశారు. ఉద్యోగాల సాధనలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులదే పై చేయి అని మరోసారి రుజువు చేస్తూ అత్యధిక సంఖ్యలో ఎంపికై సత్తా చాటారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్. శేషారెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో 163 మంది ఉద్యోగాలు సాధించడం వెనుక అపారమైన శ్రమ ఉందన్నారు. ఇన్ఫోసిస్ వంటి బహుళజాతి సంస్థలో ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ విభాగం అధ్యాపకులను అభినందించారు. ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఎన్. సతీష్రెడ్డి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.కష్ణదీపక్రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులతో తరచుగా సమావేశాలు నిర్వహించడం, ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో సరికొత్త విధానాలను అమలుచేయడం, విద్యార్థులకు మరింత సమయాన్ని క్యాంపస్ ఇంటర్వ్యూల శిక్షణ కోసం వినియోగించడం తదితర అంశాలు ఉపయోగపడ్డాయన్నారు. నాయుడు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం నుంచే సాఫ్ట్స్కిల్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంశాల పట్ల ప్రత్యేక దష్టి సారించి ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, ప్రత్యేక శిక్షణను అందించామన్నారు. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.2 లక్షల 20 వేలు వేతనంతోపాటు, ప్రముఖ విద్యాసంస్థలలో ఎం.ఎస్. చేసే అవకాశం కల్పిస్తారని డెరైక్టర్స్ ఎస్పీ గంగిరెడ్డి, శ్రీరాఘవరెడ్డి, ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల సమన్వయకర్త బీఈవీఎల్ నాయుడు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలను ఇన్ఫోసిస్ క్యాంపస్ అనుసంధాన ప్రతినిధి డాక్టర్ కె.సుధీర్రెడ్డి, ప్రాజెక్టు నిర్వాహకులు నర్రా సురేష్, ఎంపిక ప్రతినినిధి సుందరం, ప్రోగ్రాం మేనేజర్ అనిల్, ప్రసాద్ నిర్వహించారు.