-
ముగిసిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల మధ్య తొలిసారిగా జరిగిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో ఈ నెల 20న మారిటైమ్ విన్యాసాలు మొదలయ్యాయి. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌక భారత్కు ప్రాతినిధ్యం వహించగా.. రాయల్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. మూడు దేశాల మధ్య భాగస్వామ్యం బలోపేతం చేయడం, సామర్థ్యాల్ని మెరుగుపరిచేందుకు పరస్పర సహకారంతోపాటు ఇండో– పసిఫిక్ సముద్ర జలాల్లో స్థిరమైన శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఈ త్రైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజున వ్యూహాత్మక విన్యాసాలు, క్రాస్డెక్ ఆపరేషన్స్, హెలికాప్టర్ల క్రాస్డెక్ ల్యాండింగ్ తదితర విన్యాసాలు నిర్వహించారు. -
కబడ్డీ నింపిన విషాదం.. వారం రోజులు మృత్యువుతో పోరాడి
కబడ్డీ ఆట ఒక నిండుప్రాణం తీసింది. దాదాపు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసి చివరికి ఆగస్టు 15న ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని అరని టౌన్లో మరియమ్మన్ గుడి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇదే వేడుకల్లో కబడ్డీ పోటీలు నిర్వహించారు. కాగా 34 ఏళ్ల వినోద్ కుమార్ మురట్టు కాలై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కూతకు వెళ్లే సమయంలో దొమ్మరిగడ్డ(Somersualt) వేసే ప్రయత్నంలో తప్పుడుగా ల్యాండ్ అయ్యాడు. దీంతో అతని తల భాగం నేలకు బలంగా తాకడంతో అక్కడే సృహ తప్పాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మిగతా ఆటగాళ్లు, సిబ్బంది వచ్చి లేపినప్పటికి లాభం లేకుండా పోయింది. దీంతో వెంటనే ఆంబులెన్స్లో అరానీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వినోద్ కుమార్ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వేలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వినోద్ కుమార్ తాజాగా భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ(ఆగస్టు 15న) ప్రాణాలు విడిచాడు. కాగా వినోద్ కుమార్కు భార్య శివగామి, సంతోష్, కలైరాసన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వినోద్ కుమార్ మృతితో అరనీలో విషాదచాయలు అలుముకున్నాయి. கரணம் அடித்த போது திடிரென மயங்கி விழுந்த கபடி வீரர் உயிரிழப்பு#Aarani | #Kabaddi pic.twitter.com/Qx49VeJz4j — News18 Tamil Nadu (@News18TamilNadu) August 16, 2022 చదవండి: ప్రజ్ఞానంద సంచలనం Anderson Peters: అథ్లెట్పై అమానుష దాడి.. వీడియో వైరల్ -
క్వార్టర్ ఫైనల్స్కే ఇంత రచ్చ.. మరి కప్ గెలిస్తే!
మ్యాచ్ గెలిచినప్పుడు ఆటగాళ్ల సంతోషం పట్టలేనంతగా ఉంటుంది. కొందరు విజయం తాలుకా భావోద్వేగాలను తమలోనే అణుచుకుంటే.. మరికొందరు మాత్రం మాటల్లోనూ.. తమ చేష్టలతోనో బయటపెడుతుంటారు. తాజాగా బుర్కినా ఫాసో గోల్ కీపర్ హార్వే కోఫీ తన సంతోషాన్ని ఎవరు ఊహించని విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్బాల్ లీగ్లో గాబన్, బుర్కినా ఫాసోల మధ్య రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో పెనాల్టీ షూటౌట్కు దారి తీసింది. షూటౌట్లో బుర్కినా ఫోసో ఆటగాడు ఇస్మాహిలా ఔడ్రాగో గోల్ కొట్టడంతో ఆ జట్టు విజయం సాధించి క్వార్టర్స్కు చేరింది. చదవండి: ఫుట్బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి గోల్ కొట్టిన ఆనందంలో ఔడ్రాగో షర్ట్ తీసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. అయితే ఇదంతా గమనించిన గోల్కీపర్ హార్వే కోఫీ మైదానంలోనే ఎరోబిక్ విన్యాసాలు(దొమ్మరిగడ్డలు) వేశాడు. ఇది చూసిన ఆటగాళ్లు గోల్ కీపర్ ఇలా చేయడం చూసి ఆశ్చర్యపోయినప్పటికి అతని సెలబ్రేషన్స్లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. క్వార్టర్ ఫైనల్ల్లో గెలిస్తేనే ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉన్నాయి.. మరి ఫైనల్లో గెలిచి కప్ అందుకుంటే ఇంకేం చూడాల్సి వస్తుందో అని ఫన్నీగా క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్లో రిఫరీ రెడ్యూనే జియేద్ ఇరు జట్లకు కలిపి దాదాపు 14సార్లు ఎల్లోకార్డులు జారీ చేశారు. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం When you reach the #TotalEnergiesAFCON2021 quarter finals! #TeamBurkinaFaso edition! 😆#AFCON2021 | #TeamBurkinaFaso pic.twitter.com/QVotLloBt3 — #TotalEnergiesAFCON2021 🏆 (@CAF_Online) January 24, 2022 -
'రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం'
సాక్షి, విశాఖపట్నం : భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అమెరికా రాయభారి కెన్నత్ జస్టర్ పేర్కొన్నారు.ఇండియా - అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెన్నత్ జస్టర్కు భారత్ తరఫున నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ గోర్మడే స్వాగతం పలికారు. కెన్నత్ మాట్లాడుతూ.. డిసెంబర్ 18,19 తేదిలలో హైదరాబాద్ లో, ఫిబ్రవరిలో లక్నోలో రెండు దేశాల మధ్య వాణిజ్య సదస్సులు ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఇండియా-అమెరికా భాగస్వామ్యంతో హైదరాబాద్ లో అపాచి హెలికాఫ్టర్లు, ఎఫ్ 16 యుద్ధ విమానాల విడిభాగాలు, సి1 30 విమానాల విడిభాగాల తయారీలు పురోగతిలో ఉన్నాయన్నారు. కాగా, భారత - అమెరికా సంయుక్త విన్యాసాలు టైగర్ ట్రంప్ 2019 ఉభయచర విన్యాసాలలో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వపై ఉభయ దళాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఈనెల 21 వరకు విశాఖ, కాకినాడలలో ఇండో-అమెరికన్ త్రివిధ దళాలు విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విశాఖ తీరానికి అమెరికా యుద్ద నౌక జర్మన్ టౌన్ చేరుకుంది. ఈ సందర్భంగా ఇండియా, అమెరికా నేవీ అధికారులు యుద్ద విమానాలు, మిస్సైల్ ను ప్రదర్సించారు. భారత - అమెరికా మిలటరీ సహకారానికి ఈ విన్యాసాలు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాయని ఇండియా, అమెరికా నేవీ అధికారులు పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య త్రివిధ దళాల మధ్య మెరుగైన సంబంధాలు, మానవీయ సాయం, విపత్తుల వంటి అంశాలలో నైపుణ్యాల అభివృద్ది , పరస్పర సహకారాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సంయుక్త విన్యాసాలలో భాగంగా ఇరుదేశాల త్రివిధ దళాల సైనికులు పరస్పర సందర్శనలు, సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే లైవ్ ఫైర్ డ్రిల్లులు, భారత హెలీకాప్టర్లు అమెరికా నౌక జర్మన్ టౌన్ పై లాండింగ్ వంటివి రాబోయే తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. -
యుద్ధ నౌకలో విజ్ఞాన యాత్ర
నడిసంద్రంలో విన్యాసాల హోరు నావికాదళ సత్తా చాటేలా ప్రదర్శనలు విద్యార్థులకు విజ్ఞానం.. వినోదం ఘనంగా సముద్రంలో ఒక రోజు ఒకటి కాదు.. రెండు కాదు.. శత్రుభీకరమైన ఆరు యుద్ధనౌకలు.. వాటికి తోడుగా ఓ సబ్మెరైన్.. హెలికాప్టర్లు.. యుద్ధ విమానాలు.. అవి చేసిన విన్యాసాలు.. సమర సన్నద్ధత ప్రదర్శనలు.. రెస్క్యూ ఆపరేషన్లు.. వెరసి నడిసంద్రంలో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించారుు. వేలాది విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు విజ్ఞానం.. వినోదం అందించారుు. నేవీడే ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన డే ఎట్ సీ(సముద్రంలో ఒక రోజు) కార్యక్రమం గగుర్పాటు కలిగించింది. ప్రతినిధి, విశాఖపట్నం: యుద్ధ నౌకల బారులు.. ఆరుుల్ ట్యాంకర్ కమ్ వార్షిప్ ఐఎన్ఎస్ శక్తి నౌక, సబ్మెరైన్ సింధువీర్.. అదనంగా హైస్పీడ్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లు టి 36, టి 37, టి38, టి39.. నడిసంద్రంలో వేగంగా వెళ్తుండగా.. గగనతలంలో రెండు యుద్ధ విమానాలు. మూడు సెర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్లు. మరో రెండు రెండు హాక్ ఫైటర్ ఎరుుర్క్రాఫ్ట్లు... ప్రదర్శించిన అద్భుతమైన విన్యాసాలకు నడిసంద్రమే వేదికై ంది. నగరంలోని వివిధ పాఠశాలలతోపాటు, కోరుకొండ సైనిక్ స్కూల్, భువనేశ్వర్లోని సైనిక్ స్కూళ్లకు చెందిన సుమారు రెండున్నర వేలమంది విద్యార్థులు, నగరంలోని సీనియర్ సిటిజన్లు, మీడియా ప్రతినిధులను నేవీ అధికారులు నౌకల్లో విశాఖ తీరం నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలోకి తీసుకువెళ్లారు. ఉదయం 9 గంటలకు మొదలైన ప్రయాణం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మధ్యలో సుమారు ఐదుగంటల పాటు ఏకబిగిన సాగిన విన్యాసాలు విద్యార్ధులు, చూపరులను సంద్రమాశ్చర్యాల్లో ముంచెత్తారుు. ►యుద్ధనౌకలు వరుసగా ఒకదాని వెంట ఒకటి.. కొంత దూరం తర్వాత ఐదు యుద్ధ నౌకలు పక్క పక్కనే ఒకే వేగంతో ప్రయాణించడం, ఎడమ వైపు సత్పుర.. కుడి వైపు శివాలిక్ .. మధ్యలో శక్తి యుద్ధనౌక స్థిరవేగంతో ప్రయాణిస్తూ ఒకదాని నుంచి మరొకటి డీజిల్ నింపుకోవడం, సత్పుర, శివాలిక్ల నుంచి కేవలం తాడు సాయంతో నావికులు శక్తి నౌకలోకి ప్రవేశించడం, పై నుంచి వేగంగా వచ్చిన హెలికాప్టర్ నుంచి ఓ వ్యక్తి సముద్రంలో ఉన్న హైస్పీడ్ బోటులోకి దిగడం.. వంటి అరుదైన విన్యాసాలు విద్యార్థులు, చూపరులను అబ్బురుపరిచారుు. నేవీ సత్తా, విపత్కర, యుద్ధ సమయాల్లో అది స్పందించే తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. ►విపత్తులు, యుద్ధాల సమయంలో నావికాదళం ఏవిధంగా స్పందిస్తుంది.. వేగవంతమైన మోటారు పడవలు(ఫాస్ట్ ఎటాక్ క్రాఫ్ట్లు ) సముద్రంలో ఎలా వెళ్తారుు, యుద్ధ నౌకలు ప్రయాణిస్తుండగానే వాటిలో ఇంధనాన్ని ఎలా నింపుకుంటారు, శత్రు సైనికులు, ఉగ్రవాదులపై యుద్ధనౌకల్లో నుంచి అత్యాధునిక మెషిన్గన్లతో దాడి జరిపే తీరు.. నౌకాదళ హెలికాప్టర్లు సముద్రంలో జలాంతర్గాముల్ని ఏ విధంగా గుర్తిస్తారుు, యుద్ధ నౌకల్లో నావికులు ఒకదాని నుంచి మరో నౌకలోకి తాడు సాయంతో ఎలా వెళ్తారు. సముద్రంలో చిక్కుకుపోరుున వారిని హెలికాప్టర్ల ద్వారా ఏవిధంగా రక్షిస్తారు.. జలాంతర్గాముల రాకపోకలు ఎలా ఉంటాయన్న అంశాలు ప్రదర్శించారు. యుద్ధ నౌకలివే.. సముద్రంలోకి తీసుకువెళ్లేందుకు, యుద్ధ విన్యాసాలు చూపించేందుకు ఐఎన్ఎస్ శక్తి, శివాలిక్, సత్పుర, రణ్విజయ్, సుకన్య, కోరా, కాట్మా, కుంజర్ యుద్ధ నౌకలను వినియోగించారు. వీటితో పాటు సింధువీర్ జలాంతర్గామి పాల్గొంది. చేతక్, కమావ్-28, సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ అండ్ రెస్క్యూ విధానాన్ని ప్రదర్శించారు. అనంతరం రెండు హాక్ ఫైటర్ (అడ్వాన్స జెట్ ట్రైనర్) ఎరుుర్క్రాఫ్ట్లు, రెండు యుద్ధ విమానాలు డార్నియర్, పి8ఐ విన్యాసాలను ప్రదర్శించారు. పి8ఐ విమానాన్ని ఇటీవలే అమెరికా నుంచి కొనుగోలు చేసి బహుళార్ధ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నట్టు ఫ్లీట్ కమాండర్ బి.దాస్ గుప్తా వెల్లడించారు .
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement