breaking news
Abu Dhabi Knight Riders
-
చరిత్ర సృష్టించిన రస్సెల్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఎవరీకి సాధ్యం కాని రికార్డును సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 5000 ప్లస్ రన్స్, 500 ప్లస్ వికెట్లు, 500 ప్లస్ సిక్సర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా రస్సెల్ రికార్డులెక్కాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2025లో భాగంగా దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రస్సెస్ ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో రస్సెల్ అబుదాబి నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్లో 6 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే లీగ్లో 500 టీ20 వికెట్ల మైలు రాయిని కూడా రస్సెల్ అందుకున్నాడు. ఇప్పుడు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సిక్సర్ల ఘనతను అందుకున్నాడు.ఇక ఈ ఏడాది జూలైలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రస్సెల్.. ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే రస్సెల్ అనూహ్యంగా ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. మినీ వేలానికి ముందు కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోలేదు.దీంతో ఈ కరేబియన్ యోదుడు వేలంలోకి వస్తాడని భావించారు. కానీ అంతలోనే రస్సెల్ క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకొని అందరికి షాకిచ్చాడు. అతడిని కేకేఆర్ యాజమాన్యం పవర్ కోచ్గా నియమించింది. ఐపీఎల్-2026లో కేకేఆర్ బ్యాక్రూమ్ స్టాప్లో రస్సెల్ భాగం కానున్నాడు.టీ20ల్లో 500 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..రషీద్ ఖాన్ – 500 మ్యాచ్లు, 681 వికెట్లుడ్వేన్ బ్రావో – 582 మ్యాచ్లు, 631 వికెట్లుసునీల్ నరైన్ – 569 మ్యాచ్లు, 602 వికెట్లుఇమ్రాన్ తాహిర్ – 446 మ్యాచ్లు, 570 వికెట్లుషకీబ్ అల్ హసన్ – 462 మ్యాచ్లు, 504 వికెట్లుఆండ్రీ రస్సెల్ – 576 మ్యాచ్లు, 500 వికెట్లుచదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో విండీస్ వీరుడి విధ్వంసం
దుబాయ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2025లో విండీస్ వీరుడి రోవ్మన్ పావెల్ (Rovman Powell) విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్కు ఆడుతున్న పావెల్.. నిన్న (డిసెంబర్ 7) అబుదాబీ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 96 పరుగులు చేశాడు. మరో బంతి ఆడే అవకాశం వచ్చుంటే అతని సెంచరీ కూడా పూర్తైయ్యేది. పావెల్ మెరుపులకు జోర్డన్ కాక్స్ (36 బంతుల్లో 52; ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో పావెల్, కాక్స్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.టాబీ ఆల్బర్ట్, సెదిఖుల్లా అటల్ తలో 8, షయాన్ జహంగీర్ 14 పరుగులకు ఔటయ్యారు. నైట్రైడర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అజయ్ కుమార్, పియూశ్ చావ్లా తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలోనూ నైట్రైడర్స్ తడబడింది. వకార్ సలామ్ఖీల్ (3.3-0-29-4), మహ్మద్ నబీ (4-0-12-2), డేవిడ్ విల్లే (3-0-13-2), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3-0-22-2) ధాటికి 15.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో ఫిల్ సాల్ట్ (27) టాప్ స్కోరర్గా నిలువగా.. విధ్వంసకర వీరులు లివింగ్స్టోన్ (16), రూథర్ఫోర్డ్ (19), రసెల్ (12) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
హెట్మైర్ మెరుపులు.. నైట్రైడర్స్ చిత్తు
ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో భాగంగా నిన్న (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్లో డెసర్ట్ వైపర్స్, అబుదాబీ నైట్రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో వైపర్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో రసెల్ (36 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.మిగతా ఆటగాళ్లలో ఫిల్ సాల్ట్ 18, అలీషాన్ షరాఫు 25, లివింగ్స్టోన్ 4, రూథర్ఫోర్డ్ 3, చంద్ 18, నరైన్ 1 (నాటౌట్) పరుగు చేశారు. వైపర్స్ బౌలర్లలో ఖైస్ అహ్మద్, నూర్ అహ్మద్ తలో 2, నసీం షా, డాన్ లారెన్స్ చెరో వికెట్ తీశారు.అనంతరం ఓ మెస్తరు లక్ష్య ఛేదనకు దిగిన వైపర్స్ మరో 3 బంతులు మిగిలుండగానే (8 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. షిమ్రోన్ హెట్మైర్ (25 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి వైపర్స్ను గెలిపించాడు. అతనికి డాన్ లారెన్స్ (35), తన్వీర్ (31 నాటౌట్) సహకరించారు. నైట్రైడర్స్ బౌలర్లలో అజయ్ కుమార్ 3, నరైన్ 2, స్టోన్, పియూశ్ చావ్లా, రసెల్ తలో వికెట్ తీశారు. -
రసెల్, నరైన్ కొనసాగింపు.. కొత్తగా మరో ముగ్గురు విధ్వంసకర వీరులు
దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 నాలుగో సీజన్ డిసెంబర్ 4 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు జరుగనుంది. ఈ సీజన్లో కోసం లీగ్లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు మొదటి దశ సెలెక్షన్ ప్రక్రియను పూర్తి చేశాయి. ఇవాళ (జులై 7) లీగ్ నిర్వహకులు జట్ల వివరాలను వెల్లడించారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 23 మంది ఆటగాళ్లకు అనుమతి ఉంటుంది. ఇందులో ఎనిమిది మందిని రీటైన్ కానీ డైరెక్ట్ సైనింగ్ కానీ చేసుకోవచ్చు. మిగతా బెర్త్లను తొలిసారి వేలం ద్వారా భర్తీ చేయనున్నారు.తొలి దశ ఎంపిక ప్రక్రియలో అన్ని ఫ్రాంచైజీలు విధ్వంసకర బ్యాటర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. అబుదాబీ నైట్రైడర్స్ సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, ఆలీషాన్ షరాఫును రిటైన్ చేసుకొని, కొత్తగా మరో ముగ్గురు విధ్వంసకర బ్యాటర్లను ఎంపిక చేసుకుంది. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లైన అలెక్స్ హేల్స్, లియామ్ లివింగ్స్టోన్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్లను కొత్తగా అక్కున చేర్చుకుంది.మరో ఫ్రాంచైజీ డెజర్ట్ వైపర్స్ డాన్ లారెన్స్, డేవిడ్ పెయిన్, ఖుజైమా బిన్ తన్వీర్, లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్ హోల్డన్, సామ్ కర్రన్, వనిందు హసరంగను రీటైన్ చేసుకొని, ఆండ్రియస్ గౌస్ను కొత్తగా సైన్ చేసుకుంది.దుబాయ్ క్యాపిటల్స్ విషయానికొస్తే.. దసున్ షనక, దుష్మంత చమీరా, గుల్బదిన్ నైబ్, రోవ్మన్ పోవెల్, షాయ్ హోప్ను రీటైన్ చేసుకొని, కొత్తగా లూక్ వుడ్, వకార్ సలాంఖీల్, ముహమ్మద్ జవాదుల్లాను సైన్ చేసుకుంది.గల్ఫ్ జెయింట్స్ ఆయాన్ అఫ్జల్ ఖాన్, బ్లెస్సింగ్ ముజరబానీ, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, మార్క్ అదైర్ను రీటైన్ చేసుకొని.. అజ్మతుల్లా ఒమర్జాయ్, మొయిన్ అలీ, రహ్మానుల్లా గుర్బాజ్ను సైన్ చేసుకుంది.ఎంఐ ఎమిరేట్స్ అల్లా ఘజన్ఫర్, ఫజల్హక్ ఫారూకీ, కుసాల్ పెరీరా, రొమారియో షెపర్డ్, టామ్ బాంటన్, ముహమ్మద్ వసీంను రీటైన్ చేసుకొని.. క్రిస్ వోక్స్, కమిందు మెండిస్ను సైన్ చేసుకుంది.షార్జా వారియర్జ్ జాన్సన్ ఛార్లెస్, కుసాల్ మెండిస్, టిమ్ సౌధి, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ను రీటైన్ చేసుకొని.. మహీశ్ తీక్షణ, సికందర్ రజా, సౌరభ్ నేత్కావల్కర్, టిమ్ డేవిడ్ను సైన్ చేసుకుంది.


