breaking news
Aarushi parents
-
మౌనం వీడిన తల్వార్ దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి తల్లిదండ్రులు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. కూతురు, పని మనిషి హేమరాజ్లను హత్య చేశారంటూ ఆరోపణలు ఎదుర్కున్న తల్వార్ దంపతులు జైలు నుంచి విడుదలయ్యాక అజ్ఞాతవాసంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కూతురిని కోల్పోయిన నాటి నుంచి విడుదలయ్యే సమయం దాకా ఏనాడూ వాళ్లు మీడియా ముందు నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో హాట్స్టార్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్లు తొలిసారి స్పందించారు. ‘‘దస్న జైల్లో ఉన్న నాలుగేళ్లు నరకం అనుభవించాం. ప్రతీరోజూ ఏడుస్తూనే ఉన్నాం. అక్కడనుంత సేపు ఎంతో భావోద్వేగంగా గడిపాం. పక్క సెల్లో ఉన్న ఓ అమ్మాయిలో మా కూతురి(ఆరుషి)ని చూసుకుంటూ గడిపాం. ఎట్టకేలకు విడుదలతో కాస్త ఉపశమనం దొరికినట్లయ్యింది. కానీ, బయటికొచ్చాక ఎలా? అది ఇంకా భయంకరమైన పరిస్థితి. లోకం మా గురించి ఏమనుకుంటుందో అంటూ క్షణక్షణం మనోవేదనతో గడపాలి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు మాకీ పరిస్థితి తప్పదు’’ అని వారన్నారు. అయితే పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మారుతుందని.. కోర్టు తీర్పు తర్వాత కొందరు తమపై సానుభూతి చూపించటం మొదలుపెట్టారని రాజేశ్ తల్వార్ చెప్పారు. కూతురిని కోల్పోయామని, ఇక మిగిలిన జీవితం ఆమె జ్ఞాపకాలతోనే బతుకుతామని, కూతురి పేరిట సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని నుపుర్ తల్వార్ తెలిపారు. అసలు హంతకులు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానానికి.. ఆ విషయం భగవంతుడే తేల్చాలని వారన్నారు. ఇక హేమరాజ్ మరణంపై ఆ సమయంలో స్పందించే ఆస్కారం లేకుండా పోయిందన్న తల్వార్ దంపతులు.. అతని కుటుంబానికి అభ్యంతరం లేకపోతే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. -
ఆరుషి తల్లిదండ్రులే హంతకులు: కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: ఆరుషి, పని మనిషి హేమ్రాజ్ హత్య కేసులో ఆరుషి తల్లిదండ్రులు తల్వార్ దంపతులే దోషులని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే దోషులకు శిక్షలను కోర్టు రేపు ఖరారు చేస్తుంది. అయిదున్నరేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఆరుషి హత్య కేసులో ఎట్టకేలకు ఈ రోజు కోర్టు తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తుది తీర్పు వెలువడుతున్న ఈ నేపథ్యంలో ఘజియాబాద్ కోర్టు వద్ద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ కేసుకు సంబంధించి 15 నెలల్లో 84 మంది సాక్షులను సీబీఐ విచారించింది. తల్లిదండ్రులు డాక్టర్ రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్లే కూతురు ఆరుషి, తమ వద్ద పని చేసే హేమరాజ్ను హత్య చేశారని ఛార్జీషీట్లో పేర్కొన్నారు. ఆరుషిని చంపింది ఆమె తల్లిదండ్రులేనని సీబీఐ కోర్టు నిర్ధారించింది. హత్యతో పాటు సాక్ష్యాధారాలు కూడా వారు తారుమారు చేశారంటూ కోర్టు తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముందుగా అనుకున్నట్లే ఆరుషి తల్లిదండ్రులు నూపుర్, రాజేష్ తల్వార్లే దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయు విహార్లోని తన నివాసంలో మే16, 2008న 14 ఏళ్ల ఆరుషి హత్యకు గురైంది. నిందితుడిగా అనుమానించిన హేమ్రాజ్ కూడా ఆ తరువాత అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తల్లిదండ్రలు ఉన్నారు. ఈ హత్య మిస్టరీగా మారడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రారంభం నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజలు ఈ కేసు పట్ల ఆసక్తి చూపించారు. జర్నలిస్టులను సాక్షులుగా పరిగణించాలన్న తల్వార్ విజ్ఞప్తిని సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆరుషి హత్య కేసులో సాక్షులను ప్రశ్నించాలన్న తల్వార్ దంపతుల విజ్ఞప్తి సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎడిజి(శాంతి భద్రతలు), సిబిఐ సంయుక్త సంచాలకులు అరుణ్ కుమార్లతో పాటు అదనంగా మరో 14 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ ప్రత్యేక కోర్టు ముందుగా కొట్టివేసింది. దాంతో వారు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. ఘజియాబాద్ కోర్టు నూపుర్, రాజేష్ తల్వార్లనే హంతకులుగా తీర్పు చెప్పింది. అయితే కోర్టు రేపు శిక్ష ఖరారు చేస్తుంది.