
నయనతార, విఘ్నేశ్ శివన్.. 2022 జూన్ 9వ తేదీన వివాహం చేసుకున్నారు.

సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లలకు ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు.

సినిమా షూటింగ్ నిమిత్తం విఘ్నేశ్ 20 రోజులపాటు విదేశాల్లో ఉండాల్సి వచ్చింది.

ఈ సమయంలో భర్తను ఎంతగానో మిస్ అయ్యానంటోంది నయనతార.

అతడి రాకకోసం తాను, తన పిల్లలు ఎదురు చూశామని ఫోటోలు షేర్ చేసింది.

'20 రోజుల ఎదురుచూపుల తర్వాత నిన్ను చూస్తుంటే మాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము. చాలా మిస్ అయ్యాం' అంటూ ఫోటోలు షేర్ చేసింది.

