భోళా శంకర్ సినిమాను పూర్తి చేసుకున్న చిరంజీవి టూర్కు చెక్కేశాడు.
సతీమణి సురేఖతో కలిసి విమానంలో వెకేషన్కు బయల్దేరిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్గా మారింది.
ఇది చూసిన అభిమానులు.. మా దిష్టే తగిలేలా ఉంది బాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే చిరంజీవి.. 'భోళా శంకర్’ సినిమాలోని తన పాత్ర డబ్బింగ్ని పూర్తి చేశాడు.
ఈ విషయాన్ని చిరంజీవి తనే వెల్లడిస్తూ.. ‘‘భోళా శంకర్’ రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది.
ఈ ఫైర్ మాస్ ఎంటర్టైనర్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్లను మార్క్ చేసుకోండి. థియేటర్స్లో కలుద్దాం’’ అంటూ డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో వదిలాడు.
ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది.
ఈ చిత్రంలో కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు.
మహతి స్వరసాగర్ సంగీతమందించాడు.
వెకేషన్ నుంచి తిరిగొచ్చాక గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు మెగాస్టార్ ట్వీట్లో పేర్కొన్నాడు.
ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు.


