పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు | Youngster to pour petrol during Vinayaka shoba yatra | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు

Sep 28 2015 1:57 PM | Updated on Sep 3 2017 10:08 AM

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

రుద్రంపూర్(ఖమ్మం): ఆర్థిక ఇబ్బందులతో యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సోమవారం జరిగింది. వివరాలు.. కొత్తగూడెం మున్సిపాలిటి పరిధిలోని పదో వార్డుకు చెందిన సానబోయిన వెంకట నగేష్(32) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో వినాయక శోభాయాత్రలో పాల్గొని ఉదయమే ఇంటికి చేరకున్న నగేష్ ఇంటి దగ్గర పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement