వైద్యం అందక వీడియో జర్నలిస్టు మృతి | video journalist dies of hospital neglegance in eluru | Sakshi
Sakshi News home page

వైద్యం అందక వీడియో జర్నలిస్టు మృతి

Aug 18 2015 4:37 PM | Updated on Sep 3 2017 7:40 AM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆశ్రమ్ ఆస్పత్రిలో సుధాకర్ అనే వీడియో జర్నలిస్టు మరణించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆశ్రమ్ ఆస్పత్రిలో సుధాకర్ అనే వీడియో జర్నలిస్టు మరణించారు. ఆశ్రమ్ ఆస్పత్రిలో సమయానికే చేరినా, వైద్యం అందించలేదని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. సుధాకర్కు జర్నలిస్టు హెల్త్ కార్డు ఉన్నా పట్టించుకోలేదంటూ మండిపడుతున్నారు.

కాగా ఆశ్రమ్ ఆస్పత్రికి ప్రస్తుతం చైర్మన్గా నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యవహరిస్తున్నారు. సుధాకర్ మృతికి నిరసనగా ఆశ్రమ్ ఆస్పత్రి ముందు జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు బైఠాయించారు. అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement