దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదు: కలెక్టర్‌ కార్తికేయమిశ్రా

Collector Kartikeya Mishra Enquiry Eluru Asram Hospital Incident - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ఆశ్రమ్‌ ఆస్పత్రిలో ఘటనపై కమిటీ నిజనిర్ధారణ చేసిందని కలెక్టర్‌ కార్తికేయమిశ్రా అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌ పేషెంట్‌ దొరబాబు గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. డయాబెటిక్‌ పేషెంట్‌ దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదన్నారు. ఆ సమయంలో విద్యుత్‌, ఆక్సిజన్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కోలుకున్నాక గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. 

చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top