టీఆర్ఎస్ వైఫల్యం వల్లే రైతు ఆత్మహత్యలు | trs failures lead farmers suicides, says mla payam venkateswarlu | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ వైఫల్యం వల్లే రైతు ఆత్మహత్యలు

Sep 23 2015 10:04 AM | Updated on Sep 29 2018 7:10 PM

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే 1100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే 1100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. రుణమాఫీ చేయకపోవడం వల్లే రైతాంగ సంక్షోభం నెలకొందని ఆయన అన్నారు.

వెంటనే రుణమాఫీ చేయడంతో పాటు కరువు మండలాలను ప్రకటించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పెండింగులో ఉన్న హౌసింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement