బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరికి ఉరిశిక్ష | Tripura men given death sentence for raping, killing minor girl | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరికి ఉరిశిక్ష

Sep 23 2015 5:13 PM | Updated on Jul 28 2018 8:53 PM

బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరికి ఉరిశిక్ష - Sakshi

బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరికి ఉరిశిక్ష

ఓ బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో త్రిపురలో ఇద్దరికి ఉరిశిక్ష పడింది.

అగర్తలా: త్రిపురలో ఓ బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఇద్దరికి ఉరిశిక్ష పడింది. ఉత్తర త్రిపురలోని కమల్పూర్ అడిషనల్ సెషన్స్ జడ్జి అరిందమ్ పాల్ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.

గతేడాది రషీద త్రిపుర (25), జాని త్రిపుర (20) అనే గిరిజన యువకులు 12 ఏళ్ల గిరిజన బాలికను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు. వీరిద్దరూ ఆ అమ్మాయిని సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. నిందితులు నేరం చేసినట్టు కోర్టులో రుజువు కావడంతో ఉరిశిక్షతో పాటు 20 వేల రూపాయలు చొప్పున జరిమానా విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement