జమ్మూకశ్మీర్ లో హైవేల మూసివేత | Rains, snowfall close highways in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్ లో హైవేల మూసివేత

Nov 5 2015 9:39 AM | Updated on Sep 3 2017 12:04 PM

జమ్మూకశ్మీర్ లో హైవేల మూసివేత

జమ్మూకశ్మీర్ లో హైవేల మూసివేత

భారీ వర్షాలు, హిమపాతంతో జమ్మూకశ్మీర్ లో జనజీవన స్తంభించింది. మంచు బాగా కురుస్తుడడంతో పలు రహదారులు మూతపడ్డాయి.

జమ్మూ: భారీ వర్షాలు, హిమపాతంతో జమ్మూకశ్మీర్ లో జనజీవన స్తంభించింది. మంచు బాగా కురుస్తుడడంతో పలు రహదారులు మూతపడ్డాయి. శ్రీనగర్-లెహ్, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారులను మూసివేశారు. గత 24 గంటలుగా వర్షాలు కురుస్తుండడంతో రామబాన్ జిల్లాలోని రామసో, మాగర్ కోటె ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేయాల్సి వచ్చిందని, కశ్మీర్ లోయలోని ప్రజలకు వస్తువులు సరఫరా చేస్తున్న దాదాపు 500 వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.

భారీ హిమపాతంతో శ్రీనగర్-లెహ్ రహదారిని మూసేశారు. రోడ్డు 2 అడుగుల మేర మంచు పేరుకుపోయిందని, దీంతో వాహనాలను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement