ఉచిత డేటా, ఉచిత కాలింగ్ అంటూ జియో టెలికాం రంగంలో సంచలనం సృష్టించగా ఇపుడు మరో ఉచిత ఆఫర్ దూసుకొస్తోంది. అయితే ఈ సారి ఓ విదేశీ కంపెనీ కావడం విశేషం. అమెరికాలోని బోస్టన్ ఆధారిత మొబైల్ ప్రకటనల సంస్థ 'జన' ఉచిత డేటా ఆఫర్ తో ముందుకొస్తోంది. రోజుకు 10 ఎంబీ డేటాను ఉచితంగా అందించనుంది. అంతేకాదు తమ ప్లాట్ ఫాంపై ప్రకటనల ఆదాయం పెరిగే కొద్దీ ఉచిత డేటా ఆఫర్ను కూడా ఆమేరకు పెంచుతుందట.
ముఖ్యంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఉచిత ఆఫర్ లకు స్వస్తి పలికి బిల్లింగ్ మోడ్ లోకి మారిపోయిన తరుణంలో, జన ఆండ్రాయిడ్ బ్రౌజర్ ను ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా తన ఎంసెంట్(mCent ) బ్రౌజర్ ను భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో శుక్రవారం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రారంభ దశలో, వినియోగదారులకు రోజుకు ఉచిత 10ఎంబీ డేటా (వారానికి 70ఎంబీ) అందించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు భారతి ఎయిర్ టెల్, రిలియన్స్ జియో లాంటి ఇతర దేశీయ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. బిలియన్ ప్రజలకు ఇంటర్నెట్ ఉచితంగా అందించడమే తమ తదుపరి లక్ష్యమని జన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సహ వ్యవస్థాపకుడు నాథన్ ఈగిల్ చెప్పారు. ఎంసెంట్ బ్రౌజర్ ను ఎంసెంట్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
ఇప్పటి వరకు అధిక డేటా ఖర్చు భయంతో వినియోగదారులు మోర్ సెలెక్టివ్గా ఉండడం, మొబైల్ ప్రకటనకర్తలకు సవాలుగా మారిందని అయితే, ఎంసెంట్ ఎంట్రీ ఇది మొత్తం మారిపోనుందని జన మేనేజర్, సహ వ్యవస్థాపకుడు జోనాథన్ డిసౌజా తెలిపారు. ఇది వినియోగదారుల ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ సదుపాయం అందించడంతోపాటు, ప్రకటనకర్తలకు మంచి అవకాశాన్ని కల్పించనుందని చెప్పారు. కాగా దాదాపు గూగుల్ ప్లే స్టోర్ను పోలిన ఎంసెంట్ బ్రౌజర్ ను ఎంసెంట్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భారతదేశం లో 2014 లో ప్రారంభించిన ఈ యాప్ ప్రతి డౌన్ లోడ్ పై ఉచిత డేటాను ఆఫర్ చేసి 30 మిలియన్ల యూజర్లను ఆకర్షించింది.
జియోకి షాక్..‘జన’ ఉచిత డేటా ఆఫర్
Published Fri, Mar 10 2017 12:08 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ రేసులోకొచ్చింది!
గుట్టలుగా... అవినీతి కట్టలు
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
చెంచులతో మమేకమై.. ఓటు విలువ తెలిపి
జిల్లాకేంద్రంలో గాలి దుమారం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
తల్లడిల్లుతున్నారు..!
భారత బాక్సర్ల పసిడి పంచ్
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement