ఆ ఎనిమిది రోజులు మాంసం అమ్మకం బంద్ | meet ban on eve of paryushan | Sakshi
Sakshi News home page

ఆ ఎనిమిది రోజులు మాంసం అమ్మకం బంద్

Sep 6 2015 4:33 PM | Updated on Sep 3 2017 8:52 AM

మాంసం అమ్మకాలను మహారాష్ట్రలోని మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ) ఓ ఎనిమిది రోజులపాటు నిషేధించనుంది

థానే: మాంసం అమ్మకాలను మహారాష్ట్రలోని మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ) ఓ ఎనిమిది రోజులపాటు నిషేధించనుంది. ఈ నెలలో జైనులు పవిత్రంగా భావించే ఆ ఎనిమిది రోజులు ఎవరూ మాంసం విక్రయించడానికి వీల్లేదంటూ నిషేధాజ్ఞలు జారీ చేయనుంది. జైనులు పవిత్రంగా ఉండే  ఈ ఎనిమిది రోజుల కార్యక్రమాన్ని 'పర్యుషాన్' అని అంటారు.

దీనిని ఈ నెల 11 నుంచి 18వరకు పాటించనున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక భేటీ నిర్వహించిన ఎంబీఎంసీ పాలక మండలి ఈ ఎనిమది రోజులు పూర్తయ్యేవరకు ఎవరూ తమ కార్పొరేషన్లో మాంసం విక్రయించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని నిర్ణయించారు. దీనిపై సోమవారం అధికారికంగా నిర్ణయం తీసుకునేందుకు మరో సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి పోలీసులు కూడా హాజరుకానున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement