మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు | Madras High Court orders Tamil Nadu government to waive off farmer loans | Sakshi
Sakshi News home page

మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

Apr 4 2017 1:20 PM | Updated on Oct 8 2018 3:56 PM

మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు - Sakshi

మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

అన్నదాతల ఆక్రందనలు హైకోర్టును కదలించాయి.

చెన్నై: అన్నదాతల ఆక్రందనలు హైకోర్టును కదలించాయి. 23 రోజులుగా దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులకు ఊరటనిచ్చేలా మద్రాస్‌ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. సహకార సంఘాల నుంచి కర్షకులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించింది. ఐదు ఎకరాల వరకు పంట భూములు కలిగిన రైతుల రుణాలు మాఫీ చేయాలని సూచించింది.

హైకోర్టు తీర్పుపై అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద 23 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement