ఒకే వేదికపై.. మోదీ, సీఎం అరుదైన కలయిక! | M Modi praises Nitish Kumar | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై.. మోదీ, సీఎం అరుదైన కలయిక!

Jan 5 2017 2:23 PM | Updated on Aug 15 2018 6:32 PM

ఈ సందర్భంగా సీఎం నితీశ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించడం గమనార్హం.

పట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గురువారం ఒకే వేదికను పంచుకున్నారు. గురుగోవింద్‌ సింగ్‌ 350వ జయంతి సందర్భంగా పట్నాలో నిర్వహించిన ప్రకాశ్‌ పర్వ వేడుకల్లో సీఎం నితీశ్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. గాంధీ మైదానంలో తాత్కాలిక గురుద్వారను ఏర్పాటుచేసి ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌ నేతృత్వంలోని జేడీయూ కూటమి బీజేపీ ఓడించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ, నితీశ్‌ ఒకే వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా పెద్ద నోట్ల రద్దు తర్వాత బిహార్‌కు మోదీ తొలిసారి వచ్చారు. నోట్లరద్దును విపక్షాలు వ్యతిరేకిస్తున్నా సీఎం నితీశ్‌ బాహాటంగా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే.

ఈ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గురుగోవింద్‌ సింగ్‌ సేవలను కొనియాడారు. గురుగోవింద్‌సింగ్‌, కర్పూరి ఠాకూర్‌, జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి యోధులను బిహార్‌ గడ్డ అందించిందని, దేశాన్ని ముందుకు నడిపించడంలో బిహార్‌ ఎప్పుడు అండగా నిలబడుతున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం నితీశ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించడం గమనార్హం. ప్రకాశ్‌ పర్వ్‌ వేడుకల కోసం నితీశ్‌ ఘనంగా ఏర్పాట్లు చేయడాన్ని మోదీ కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement