మహారాష్ట్రలోని ఓ స్ధానిక మరాఠీ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్నఓ వ్యక్తిపై ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు దాడి చేశారు. వారిపై పిడిగుద్దులు కురిపించారు.
నాసిక్: మహారాష్ట్రలోని స్ధానిక మరాఠీ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్నఓ వ్యక్తిపై ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు దాడి చేశారు. అతడిపై పిడిగుద్దులు కురిపించారు. సందీప్ జాదవ్ అనే వ్యక్తి బైదీ కాంగర్ వద్ద క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. అతడు ఆ ప్రాంతంలోని ఓ వ్యక్తి పాల్పడుతున్న అక్రమాలకు సంబంధిచిన వార్తలు వెలువరించడంతో ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి మాట్లాడేందుకు రావాల్సిందిగా కోరి అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.