సభ్యుల ఆందోళనల మధ్యే చిదంబరం బడ్జెట్ | Finance Minister P Chidambaram present interim budget in Lok Sabha | Sakshi
Sakshi News home page

సభ్యుల ఆందోళనల మధ్యే చిదంబరం బడ్జెట్

Feb 17 2014 11:20 AM | Updated on Mar 9 2019 3:59 PM

సభ్యుల ఆందోళనల మధ్యే చిదంబరం బడ్జెట్ - Sakshi

సభ్యుల ఆందోళనల మధ్యే చిదంబరం బడ్జెట్

సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్యే ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం లోక్సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

న్యూఢిల్లీ : సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్యే ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. జూలై వరకూ ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి పార్లమెంట్ అనుమతి కోరుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత సభ్యులు స్పీకర్ వెల్లోకి దూసుకు వెళ్లారు. సమైక్య నినాదాలతో హోరెత్తించటంతో స్పీకర్ మీరాకుమార్ జోక్యం చేసుకుని ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు.

 అంతకు ముందు ఆయన సభ్యుల గందరగోళం మధ్య బడ్జెట్ను ఎలా చదివేది అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్ నాథ్ జోక్యం చేసుకుని తమకు బాగానే వినబడుతోందని... బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించాలని కోరారు. దాంతో సభ్యుల ఆందోళన మధ్యే చిదంబరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement