breaking news
Tax proposals in Interim budget
-
బడ్జెట్-2014 ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం సోమవారం లోక్సభలో 2014-15 ఏడాదికిగాను మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్కు సంబంధించిన ముఖ్య అంశాలు : * గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం *2013లో గ్లోబల్ జీడీపీ వృద్ధిరేటు: 3 శాతం *2013-14 ఆర్థిక లోటును 4.65 శాతానికి పరిమితి చేస్తాం *2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి: 263 మిలియన్ టన్నులు *కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ): 45 బిలియన్ డాలర్లు *ఆహార ద్రవ్యోల్బణమే పెద్ద సమస్య *ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నాయి *ఇండియాకు రేటింగ్ డౌన్గ్రేడ్ భయం లేదు *ఈ ఏడాది 15 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు జమ అయ్యాయి *వ్యవసాయ రుణాల లక్ష్యం: రూ.7.35 లక్షల కోట్లు *గతంలో వ్యవసాయ రుణాల అంచనా: రూ.7 లక్షల కోట్లు *ఎగుమతుల లక్ష్యం: 326 బిలియన్ డాలర్లు (గతం కంటే 6.4 శాతం ఎక్కువ) *పెట్టుబడుల రేటు: 34.8 శాతం, సేవింగ్స్ రేటు: 30.1 శాతం *2013-14 జీడీపీ వృద్ధిరేటు అంచనా: 4.9 శాతం *జనవరి ఆఖరుకు కేబినెట్ ప్యానెల్ క్లియర్ చేసిన ప్రాజెక్టులు: 296 *మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పుంజుకోవడం లేదు *ఇన్ఫ్రా ప్రాజెక్టుల ఫండింగ్ నిబంధనల్ని సడలించాం *2013-14లో అదనంగా జమ కానున్న 29300 మెగావాట్ల విద్యుదుత్పత్తి *గడిచిన 9 క్వార్టర్లలో జీడీపీ వృద్ధిరేటు 7.9 నుంచి 4.4 శాతానికి పతనం *డిసెంబరు, మార్చి క్వార్టర్లలో 5.2 శాతం, 4.9 శాతం ఉంటుందని అంచనా *రూపాయి హెచ్చుతగ్గులను ప్రభుత్వం, ఆర్బీఐ, సెబీ నియంత్రించాయి *చక్కెరపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేశాం *నిర్మాణంలో 50 వేల మెగావాట్ల థర్మల్, జల విద్యుత్ ప్లాంట్లు *2013-14లో జాతీయ సోలార్ మిషన్ రెండో దశ మొదలైంది *విధానపరమైన నిర్ణయాల్లో నిష్క్రియాపరత్వం లేదు *వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లు ప్రారంభం *రూ.100 కోట్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ఫండ్ *అభివృద్ధిలో యూపీఏకి సాటి వచ్చే ప్రభుత్వం లేదు *ఈశాన్య రాష్ట్రాల కోసం అదనంగా రూ.1200 కోట్ల కేటాయింపు *భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్డీఐ విధానాలను సరళీకరించాం *జాతీయ సోలార్ మిషన్ కింద 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులు *జనవరి నాటికి క్లియర్ చేసిన 296 ప్రాజెక్టుల విలువ: రూ.6.6 లక్షల కోట్లు *57 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశాం *బొగ్గు ఉత్పత్తి 554 మిలియన్ టన్నులకు పెరుగుతుంది *గడిచిన పదేళ్లలో సగటున బొగ్గు ఉత్పత్తి: 361 మిలియన్ టన్నులు *ప్రణాళిక వ్యయంలో మార్పు లేదు, రూ.5.55 లక్షల కోట్లే *2013-14లో ప్రణాళికేతర వ్యయం బడ్జెట్ అంచనాలను మించుతుంది *2014-15లో ప్రణాళికేతర వ్యయం : రూ.12.07 లక్షల కోట్లు *2014-15లో సబ్సిడీలు: రూ.2.65 లక్షల కోట్లు *2014-15లో ఫుడ్ సబ్సిడీ అంచనా: రూ.1.15 లక్షల కోట్లు *నిర్భయ ఫండ్కు అదనంగా రూ.1000 కోట్లు *2014-15లో ఇంధన సబ్సిడీ: రూ.65 వేల కోట్లు *ఈ ఏడాదికి చెందిన రూ.35 వేల కోట్ల ఇంధన సబ్సిడీని వచ్చే సంవత్సరానికి రోల్ ఓవర్ చేస్తాం *ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.33,725 కోట్లు * పీఎస్యూ బ్యాంకుల్లో క్యాపిటల్ పెట్టుబడి: రూ.11,200 కోట్లు *రక్షణ శాఖకు: రూ.2.24 లక్షల కోట్లు, గతంలో: రూ.2.04 లక్షల కోట్లు *2014-15లో వ్యవసాయ రుణాల లక్ష్యం: రూ.8 లక్షల కోట్లు *మైనార్టీ వ్యవహారాల శాఖకు: రూ.3,711 కోట్లు *ట్యాక్స్ శ్లాబులో ఎలాంటి మార్పు లేదు *క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లకు ఎక్సైజ్ సుంకం 2 శాతం తగ్గింపు *సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు *ఆటో రంగానికి ఊరట *ఎస్యూవీ వాహనా ఎక్సైజ్ సుంకం 30 నుంచి 24 శాతానికి తగ్గింపు *చిన్న కార్లపై ఎక్సైజ్ సుంకం 8 శాతానికి తగ్గింపు *పెద్ద, మధ్య తరహా కార్లపై ఎక్సైజ్ సుంకం 20 శాతానికి తగ్గింపు *2014-15లో రెవిన్యూ లోటు 3 శాతానికి తగ్గుతుంది *2014-15లో ద్రవ్యలోటు 4.1 శాతానికి తగ్గుతుంది *చిన్న కార్లపై 4 శాతం ఎక్సైజ్ సుంకం తగ్గింపు *రూ.5 లక్షల కారు రూ.20 వేల దాకా తగ్గే అవకాశం *రైస్ కంపెనీలకు సర్వీసు ట్యాక్స్ ఊరట *దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహిస్తాం *ఆహార సబ్సిడీ రూ.1.15 లక్షల కోట్లు *10 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్ *రూ.2 లక్షల 24 వేల కోట్లకు చేరిన రక్షణ బడ్జెట్ *ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉంది *ఆహార ధాన్యాల ధరలు దిగివచ్చాయి *ఉత్పాదక రంగం ఇంకా పుంజుకోలేదు *దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకోసం ప్రత్యేక ఫండ్ *ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనాలను అధిగమించాయి *విదేశీ మారక నిల్వలు పెరిగాయి *ఆధార్ అమలుకు కట్టుబడి ఉన్నాం *సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆధార్ అవసరం *రక్షణ శాఖ కేటాయింపు రూ.2,24,000 కోట్లు 'రక్షణ ఉద్యోగులకు ఒక ర్యాంకు- ఒక పెన్షన్కు ఆమోదం '2014-15 ప్రణాళిక వ్యయం రూ.5,55,322 కోట్లు 'పాత విద్యరుణాల వడ్డీపై విద్యార్థులకు స్వల్ప ఊరట -
తగ్గనున్న కార్లు, బైకులు, మొబైల్ ఫోన్ల ధరలు
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి చిదంబరం సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ నామ్కే వాస్తేగా ఉంది. ఒక్క ఆటో రంగం, ఎలక్ట్రానిక్ గూడ్స్ రంగాలకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరత్రా ఎవరికీ సంతోషం కలిగించే వార్త బడ్జెట్లో లేదు. అదే సమయంలో బాధ పెట్టే నిర్ణయం కూడా లేకపోవడమే సంతోషాన్నిచ్చే అంశమే. కార్లు, బైకులు, స్కూటర్లు, మొబైల్ ఫోన్ల ధరలు తగ్గించే నిర్ణయాలు చిదంబరం ప్రకటించారు. ఇతరత్రా నిర్ణయాలన్నీ కేటాయింపులే. కొన్ని కేటాయింపులు యథాతథంగా ఉండగా, మరికొన్ని రంగాలకు కేటాయింపులు పెంచారు. రక్షణ శాఖ బడ్జెట్ను 10 శాతం పెంచారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకించి ఎలాంటి కేటాయింపు లేకపోవడం విశేషం. సీమాంధ్రను సంతృప్తి పరిచే నిర్ణయం ఏదైనా ఉంటుందేమోనన్న ఆలోచనను చిదంబరం అసలు పట్టించుకోలేదు. -
సభ్యుల ఆందోళనల మధ్యే చిదంబరం బడ్జెట్
-
సభ్యుల ఆందోళనల మధ్యే చిదంబరం బడ్జెట్
న్యూఢిల్లీ : సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్యే ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. జూలై వరకూ ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి పార్లమెంట్ అనుమతి కోరుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత సభ్యులు స్పీకర్ వెల్లోకి దూసుకు వెళ్లారు. సమైక్య నినాదాలతో హోరెత్తించటంతో స్పీకర్ మీరాకుమార్ జోక్యం చేసుకుని ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఆయన సభ్యుల గందరగోళం మధ్య బడ్జెట్ను ఎలా చదివేది అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్ నాథ్ జోక్యం చేసుకుని తమకు బాగానే వినబడుతోందని... బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించాలని కోరారు. దాంతో సభ్యుల ఆందోళన మధ్యే చిదంబరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.