ఈపీఎఫ్‌ఓ ఫండ్ మేనేజర్లు కొనసాగింపు | EPFO retains 4 fund managers; also appoints UTI AMC | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ఓ ఫండ్ మేనేజర్లు కొనసాగింపు

Apr 16 2015 2:46 AM | Updated on Sep 3 2017 12:20 AM

రిటైర్మెంట్ నిధులు నిర్వహించే ఈపీఎఫ్‌ఓ తన నాలుగు ఫండ్ మేనేజింగ్ సంస్థలను కొనసాగించాలని

న్యూఢిల్లీ: రిటైర్మెంట్ నిధులు నిర్వహించే ఈపీఎఫ్‌ఓ తన నాలుగు ఫండ్ మేనేజింగ్ సంస్థలను కొనసాగించాలని నిర్ణయించింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్షిప్, రిలయన్స్ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ ఏఎంసీలను ఫండ్ మేనేజర్లుగా మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించామని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది. కొత్తగా యూటీఐ ఏఎంసీను కూడా నియమించామని ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) వివరించింది. ఈపీఎఫ్‌ఓ నిధులు ప్రస్తుతం రూ.6.5 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.80 వేల కోట్లు డిపాజిట్లు వస్తాయని అంచనా.
 

Advertisement
 
Advertisement
Advertisement