భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రమూక హతం | Encounter With Terrorists In Jammu And Kashmir's Kulgam | Sakshi
Sakshi News home page

భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రమూక హతం

Feb 12 2017 11:13 AM | Updated on Sep 5 2017 3:33 AM

భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రమూక హతం

భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రమూక హతం

జమ్మూకశ్మీర్‌లో చొరబడేందుకు మరోసారి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు.

జమ్మూకశ్మీర్‌లో చొరబడేందుకు మరోసారి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దీంతో కుల్గాం జిల్లాలోని యారిపుర-ఫ్రిజల్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుడు కూడా ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందండంతో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. యారిపుర-ఫ్రిజల్‌ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆపరేషన్‌ ప్రారంభించాయి. మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా గాయపడ్డారని, వారు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement