మిజోరంలో ప్రచారం సమాప్తం | Election campaign comes to an end in Mizoram | Sakshi
Sakshi News home page

మిజోరంలో ప్రచారం సమాప్తం

Nov 24 2013 5:07 AM | Updated on Sep 17 2018 5:36 PM

ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు హోరాహోరీగా సాగించిన ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది.

ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు హోరాహోరీగా సాగించిన ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం 142 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సోమవారం జరిగే పోలింగ్‌లో వారి భవితవ్యాన్ని 6.91 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement