కొత్త టెక్నాలజీని వాడే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్యాలయాలనూ ఆ టెక్నాలజీ బాటలో నడిపించనున్నారు
న్యూఢిల్లీ: కొత్త టెక్నాలజీని వాడే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్యాలయాలనూ ఆ టెక్నాలజీ బాటలో నడిపించనున్నారు. వాటిని కాగితరహితంగా మార్చేందుకు, పారదర్శకత పెంచేందుకు, పనులు వేగవంతంగా చేసేందుకు ‘ఈ-ఆఫీస్’ అనే సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టే చర్యలను వేగవంతం చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు కేబినెట్ సెక్రటేరియట్ ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఫైళ్ల నమోదు, రసీదులు తదితరాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే ఈ-గవర్నెన్స్ ద్వారా చేపడతామని అధికార వర్గాలు తెలిపాయి.